హైదరాబాద్‌లో హైడ్రా నాలుగు నెలలు స్పెషల్‌ డ్రైవ్‌

 

హైదరాబాద్ నగరంలో రాబోయే 4 నెలలు స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతామని  హైడ్రా కమీషనర్  రంగనాథ్ తెలిపారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన కమర్షియల్ భవనలను తొలిగిస్తామని కమీషన్ తెలిపారు. పేదల నిర్మాణాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రంగనాథ్ తెలిపారు. ముఖ్యంగా నగరంలో వరదనీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నాలా, నీటి వనరుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.. ఈ అధ్యయనం ద్వారా సమస్య మూలాలను కనుగొని, శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.రసూల్‌పురా నాలాపై అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని రంగనాథ్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ పరిధిలో బేగంపేట, ప్యాట్నీలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.
 

Teluguone gnews banner