జగన్ పై పార్టీ నేతల అసహనం....మావోడికి ఆ సోయి లేదు...

  పాదయాత్ర అయినా... ప్రెస్ మీట్ అయినా.. జగన్ టార్గెట్ మాత్రం ఒక్కటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడిపై దుమ్మెత్తిపోయడమే. గతంలోనే చంద్రబాబు నాయిడిని కాల్చి  పారేయాలి... ఉరితీయాలని ఇలా ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన... ఇప్పుడు మరోసారి ఆయనపై వ్యక్తిగత దూషణలు చేసి నేనింతే అని రుజువు చేశారు. ఇక పనిలో పనిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా నాలుగు సెటైర్లు వేశారు. 'పవన్‌' సినిమాకు తక్కువ...ఇంటర్‌వెల్‌కు ఎక్కువ...అని అన్నారు. దీంతో జగన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్‌కళ్యాణ్‌'పై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట.   ఎందుకంటే... జనసేన పార్టీ ఆవిర్భావం రోజు వరకూ పవన్ కళ్యాణ్ టీడీపీ కీలుబొమ్మ అని.. చంద్రబాబు-పవన్ ఒకటే అని గతంలో జగన్ పలుమార్లు విమర్సలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇక జనసేన పార్టీ ఆవిర్భావం రోజు పవన్ ప్రసంగం విన్నవారు ఒక్కసారిగా షాకయ్యారు. కారణం..పవన్ టీడీపీ పై పెద్దఎత్తున ఆరోపణలు చేయడమే. దాంతో పవన్ టీడీపీకి వ్యతిరేకమయ్యారు. అంతేకాదు.. తాను అవసరమైతే....వచ్చే ఎన్నికల నాటికి వైకాపాను సమర్థిస్తాను తప్ప...'టిడిపి'వైపు ఉండనని తేల్చిచెప్పేశారు కూడా. అలాంటింది... పవన్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేసి మరోసారి సెల్ఫ్‌ గోల్‌ వేసుకున్నాడని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. అంతేకాదు...అవసరానికి పనికి వచ్చే వాళ్లను.... ఆదుకునేవాళ్లను...తన నోటి దురదతో మరోసారి దూరం చేసుకుంటున్నాడని... 'చంద్రబాబు'కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న 'పవన్‌'పై వ్యాఖ్యానించి...ఈయన ఒరగబెట్టేదేముంది...? వచ్చే ఎన్నికల నాటికి 'చంద్రబాబు' వ్యతిరేకులంతా..ఒకవైపు చేరితే...అంతిమంగా లాభపడేది...తమ పార్టీ...అని...ఆ సంగతి తెలుసుకోకుండా...ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తోన్న 'పవన్‌'ను విమర్శించి...'చంద్రబాబు' వ్యతిరేక ఓటు చీలిపోవడానికి మా నాయకుడే దారి చూపిస్తున్నారని అనుకుంటున్నారు. ఇదేం తెలివో...అర్థం కావడం లేదు..ప్రభుత్వ వ్యతిరేక ఓటు...'జగన్‌', 'పవన్‌'ల మధ్య చీలితే...చివరకు... లాభపడేది...'చంద్రబాబే' అన్న సోయి...మావోడి లేదు...ఏం చేస్తాం...అంతా మా ఖర్మ'...అంటూ ఆ నాయకులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.   అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. అప్పుడెప్పుడో..లక్ష కోట్లు...తిన్నాడని...తండ్రి ముఖ్యమంత్రి అయితే....కొడుకు కూడా ముఖ్యమంత్రి కావాలా...? అని ప్రశ్నించిన 'పవన్‌'పై కోపం చల్లారకే...'జగన్‌' అసహనాన్ని ప్రదర్శించారని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇప్పటికైనా జగన్ నోటి దురుసుకాస్త తగ్గించుకొని.. కాస్త రాజకీయాల గురించి.. అవగాహన తెచ్చుకుంటే పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడటం నేర్చుకుంటే బెటర్ అని పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ఏపీలో 105 దాటేసిన పొలిటికల్ టెంపరేచర్..

  ఈసారి సమ్మర్ సీజన్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతుంటే... ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ టెంపరేచర్ మాత్రం 105 దాటేస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది టైముంది. ముందస్తు ఎన్నికలు వస్తే తప్ప... వచ్చే సమ్మర్ సీజన్ వరకు ఎన్నికలు జరిగే ఛాన్సే లేదు. కానీ ప్రత్యేక హోదా పోరుతో ఏపీలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. స్పెషల్ స్టేషస్ ఇష్యూ రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపేస్తోంది.   ఒకవైపు అధికార టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా సైకిల్, బైక్ ర్యాలీలు చేపడితే.... మరోవైపు ప్రతిపక్ష వైసీపీ... తన ఎంపీలతో రాజీనామా చేయించి ఢిల్లీలో ఆమరణదీక్షలకు కూర్చోబెట్టింది. ఇక గుర్తొచ్చినప్పుడల్లా జనం మధ్యకొచ్చే జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హోదా పోరులోకి దిగారు. వామపక్షాలతో కలిసి జాతీయ రహదారులపై పాదయాత్రలకు పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ స్వయంగా బెజవాడ బెంజి సర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు.   మొత్తానికి ఈ సమ్మర్ సీజన్ కూల్ కూల్ గా ఉంటుందంటూ భారత వాతావరణశాఖ చల్లని వార్త చెబితే... ఏపీలో మాత్రం పొలిటికల్ టెంపరేచర్ సెగలు పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో  రేగుతోన్న రాజకీయ సెగ.... దేశ రాజధాని ఢిల్లీని సైతం వణికిస్తోంది. దాంతో ఏం చేయాలో తోచక మోడీ సర్కార్ తప్పించుకొని తిరుగుతోంది.

హరీష్ తో ఎదురుదాడి... ఈటలకు చీవాట్లు

  కాగ్ నివేదికపై కాంగ్రెస్ కారు కూతలు కూస్తోందంటూ మంత్రి హరీష్ రావుతో ఎదురుదాడి చేయించినా... కాగ్  అక్షింతలతో కేసీఆర్‌‌ ఆత్మరక్షణలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో ఆర్ధిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందంటూ ప్రభుత్వాన్ని కడిగిపారేయడమే కాకుండా‌.... అన్ని రంగాల్లో లోపాలను ఎత్తిచూపడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అసలెక్కడ లోపం జరిగింది? కారణమెవరనే దానిపై పోస్టుమార్టం మొదలుపెట్టారు. ఇంతకాలం ఆదర్శ పాలన సాగిస్తున్నామని చెబుతుంటే... కాగ్‌ మాత్రం తమను ప్రజల ముందు దోషులుగా నిలిపిందని కేసీఆర్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.   ప్రభుత్వం చెబుతున్నట్లుగా తెలంగాణ మిగులు రాష్ట్రం కానే కాదని... ముమ్మాటికీ లోటు ఉందని ప్రభుత్వ లెక్కల్లోని డొల్లతనాన్ని ఎండగట్టిన కాగ్.... అప్పులను ఆస్తులుగా చూపడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. FRBM రూల్స్‌‌ ప్రకారం GSDPలో 3.5శాతానికి మించి అప్పులు తీసుకోకూడదనే నిబంధన ఉన్నా.... ప్రభుత్వం 4శాతానికి మించి అప్పులు చేసిందని కాగ్ కడిగిపారేసింది. ఇదే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందనే మాట వినిపిస్తోంది. అప్పులపై కాగ్‌ కొర్రీలు పెట్టడంతో భవిష్యత్‌లో అప్పులు పుట్టవని కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. అసలే ఎన్నికలవేళ అన్ని వర్గాలను ఆకర్షించేందుకు కొత్త పథకాలు ప్రకటిస్తే... ఇప్పుడు కొత్త అప్పు పుట్టకపోతే సంక్షేమ కార్యక్రమాల అమలు కష్టమవుతుందని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.   దీనంతటికీ ఆర్ధిక లెక్కల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటమే కారణమని కేసీఆర్‌‌ సీరియస్‌‌ అయినట్లు తెలుస్తోంది. అందుకే ఆర్ధికమంత్రి ఈటలను, ఆర్ధికశాఖ కార్యదర్శిని పిలిచి గట్టిగా చీవాట్లు పెట్టినట్లు చెబుతున్నారు. ఆర్ధికశాఖను నిర్వహించడంలో విఫలమయ్యారంటూ ఈటెలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. రెవెన్యూ వ్యయాన్ని కేపిటల్ ఎక్స్ పెండీచర్ లో చూపించడం వల్లే ఇదంతా జరిగిందని గుర్తించిన కేసీఆర్.... ఇది ఆర్ధికశాఖ వైఫల్యానికి పరాకాష్ట అంటూ ఈటలకు చీవాట్లు టాక్ వినిపిస్తోంది. ఆర్ధికశాఖ నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వం అప్రతిష్ట కావాల్సి వచ్చిందని కేసీఆర్ ఫైరైనట్లు చెబుతున్నారు. అసలు ఆర్ధికమంత్రిగా మీరేం చేస్తున్నారంటూ ఈటలను గట్టిగా మందలించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాగ్ ఎత్తిచూపిన లోపాలపై ఇంటర్నల్‌ ఆడిటింగ్‌‌‌కు ఆదేశించిన కేసీఆర్‌‌.... అన్నింటిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

ప్రతిపక్షాలు పిల్లులు, కుక్కలు, పాములా..!

మోడీకి భయపడి పిల్లులు, కుక్కలు, పాములు, ముంగిసలు ఒకటయ్యాయి... ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరనుకుంటున్నారా...? ఇంకెవరు మోడీ ప్రియ మిత్రుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఇక్కడ పిల్లులు, కుక్కలు, పాములు ఎవరో అర్దమయ్యే ఉంటది కదా. ప్రతిపక్ష పార్టీలపై అమిత్ షా ఎటకారంగా వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ముంబైలో జరిగిన బీజేపీ పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన... ప్రతిపక్షాలపై దుమ్మెత్రిపోశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణగల నేత అని.. మోడీకి భయపడి ప్రతిపక్షపార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చాయని అన్నారు. అంతేకాదు...బీజేపీ కేవలం 10 మంది సభ్యులతో ప్రారంభమైంది.. ఇప్పుడు పదకొండు కోట్ల మంది బీజేపీకి ఉన్నారు.. ఇప్పుడున్నది బీజేపీ స్వర్ణయుగం కాదని.. పశ్చిమ బెంగాల్, ఓడిస్సా లో కూడా ప్రభుత్లం ఏర్పరిచినప్పుడే బీజేపీకి అసలైన స్వర్ణయుగం వచ్చినట్టుని అన్నారు.   ఇంక రాహుల్ గాంధీపై విరుచుకుపడుతూ ‘‘ఇటీవల మనం రెండు లోక్‌సభ స్థానాలను కోల్పోతే, రాహుల్ గాంధీ స్వీట్లు పంచారు. నేను చూసిన ఇలాంటి మొట్టమొదటి నేత ఆయనే’’ అన్నారు. నేడు బీజేపీ పాలనలో 20 రాష్ట్రాలు ఉన్నాయన్నారు. బీజేపీకి ఇది ఆనందించవలసిన విషయమని చెప్పారు.   ఇక ఇప్పుడే అసలు రచ్చ మొదలైంది. ఎంత మాత్రం సొంత మెజార్టీతో అధికారంలో ఉంటే మాత్రం ప్రతిపక్ష పార్టీలను పిల్లులు, కుక్కలతో పోల్చుతారని..దీంతో వారి అహంకారం మరోసారి బయటపడిందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విభజన హామీలు అమలుచేయకపోగా... పార్లమెంట్ సమావేశాల్లో  ఏ ఒక్క అంశాన్ని చర్చకు రానివ్వకుండా డ్రామాలు ఆడితే... ప్రభుత్వ తీరు నచ్చక ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పడం చేతకాక పారిపోయి ఇప్పుడు మమ్మల్ని పిల్లులు, కుక్కలు అంటూ మాట్లాడతారా అంటూ మండిపడుతున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు. మరి ఇప్పటికే సామాన్యులు మోడీ ప్రభుత్వంపై మండిపడుతుంటే.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరింత వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు..

ఆధార్ కు రక్తం, మూత్రం కూడా అడుగుతారేమో..!

  ఈ మధ్య  సంక్షేమ పథకాలకి అయితేనేమి, బ్యాంకులకు గానీ, ఫోన్ నెంబర్లుకు గాను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటికి ఆధార్ ను లింకు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఆధార్ ను ఎంతో మంది నిపుణులు ఆమోదించారని, ఇది విధానపరమైన నిర్ణయం అయినందున న్యాయపరమైన సమీక్ష అవసరం లేదని కేంద్రం వాదనలు వినిపించగా.. కేంద్రం వాదనలు విన్న న్యాయమూర్తులు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించరాదని ఇండియాలో దారిద్ర్య రేఖకు దిగువన నిజంగా మగ్గుతున్న వారిని ఆదుకోవాలన్నదే తమ అభిమతమని.. సాంకేతికంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఆధార్ కార్యక్రమం నడుస్తోందని, కోర్టులు ఇందులో కల్పించుకోజాలవని అటార్ని జనరల్ కే కే వేణుగోపాల్ వాదించారు.  ఇక ఈ కేసును విచారిస్తున్నసుప్రీంకోర్టు  కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నిర్ణయం పారదర్శకతతో కూడినదా? నిజాయితీతో ఉన్నదా? అన్న విషయాలను మాత్రమే కోర్టు విచారించగలుగుతుందని చెప్పారు. ఈ స్కీమ్ ను, ఆధార్ కార్డును వ్య‌తిరేకిస్తున్నవారి ప‌రిస్థితి ఏంట‌ని ఈ సందర్భంగా ధ‌ర్మాస‌నం కేంద్రాన్ని ప్ర‌శ్నించింది. ప్రస్తుతం వేలిముద్రలు, కనుపాపలు సేకరించడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టా? కాదా? అన్న విషయాన్ని విచారిస్తున్నామని, భవిష్యత్తులో ఆధార్ బోర్డు రక్తం, మూత్రం, డీఎన్ఏ నమూనాలను కోరదన్న నమ్మకం ఏంటని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

బయటపడిన అన్నాడీఎంకే నిజస్వరూపం..

  పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ.. నన్ను ఎవరూ చూడట్లేదులే అని ఫీల్ అవుతుందట.. అల అన్నాడీఎంకే అసలు నిజస్వరూపం బయటపడింది. కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్న అన్నాడీఎంకే అసలు ఉద్దేశం తెలిసిపోయింది. ఒకపక్క ఏపీ రాష్ట్ర ప్రజలు తమకు అన్యాయం జరిగింది.. మాకు కాస్త న్యాయం చేయండిరా బాబు అంటూ ధర్నాలు, రాస్తా రోకోలు, దీక్షలు అంటూ రోడెక్కుతున్నారు. ఇక టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వంపై యుద్దానికి దిగారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే పార్లమెంట్ కు కదిలికి వెళ్లారు. అయినా పాడిందే పాటరా అన్నట్టు.. సభ వాయిదాలు పడుతూ.. అవిశ్వాస తీర్మానం మాత్రం చర్చకు రావడం లేదు. దీనికి కారణం అన్నాడీఎంకే నేతల ఆందోళనలు. మొన్నటి వరకూ టీఆరఎస్ కూడా వారి బాటలోనే నడిచినా.. తరువాత మనసు మార్చుకొని ఏపీకి మద్దతుగా నిలుస్తామని చెప్పింది. కానీ అన్నాడీఎంకే మాత్రం తమ ధోరణిని వదలకుండా అలానే ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇక స్పీకర్ గారికి ఇదే సాకు దొరికింది. ఇంతమంది అడ్డుగా ఉంటే చర్చ జరపడం కుదరదు అని.. సభను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ అవిశ్వాస తీర్మానంపై చర్చ మాత్రం జరగుకుండా చేస్తున్నారు.   మరి ఇప్పుడు వెల్ లో ఉండి కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్న అన్నాడీఎంకే నేతల రాజకీయ డ్రామాలు బయటపడ్డాయి. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం చర్చకు రాకుండా, తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్టు ఆ పార్టీ ఎంపీలు చేస్తున్నదంతా డ్రామానే అనే విషయం వెలుగు చూసింది. తమిళ రాష్ట్ర ప్రయోజనాల కోసం కావేరీ బోర్డును ఏర్పాటు చేయాల్సిందే అనే డిమాండ్ తో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు సైతం నిరాహార దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే కదా. అయితే పైకి మాత్రమే నిరాహార దీక్ష అని కలరింగ్ ఇచ్చి.. దీక్ష మధ్యలో పక్కకు వచ్చి, కడుపునిండా భోజనాలు లాగిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో అసలు నిజం బయటపడింది. దీంతో ఇప్పుడు ఈ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు పనిలో పనిగా పలువురు వ్యక్తులు మందు కూడా కొట్టేశారు. దీంకో ఢిల్లీలో అన్నాడీఎంకే నేతలు చేస్తున్నదంతా పొలిటికల్ డ్రామానే అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మొత్తానికి అన్నాడీఎంకే వెనుక బీజేపీ ఉంది.. బీజేపీనే ఇదంతా చేయిస్తుంది అన్న రూమర్లను ఇప్పుడు నిజంగానే నిజం చేశారు అన్నాడీఎంకే నేతలు. మాకు తాగటానికి నీళ్లు లేవు అంటే వెంటనే నీటిని ఇచ్చినా.. ఆ కృతజ్ఞత కూడా లేకుండా.. మాకు కాస్త సహకరించడయ్యా బాబు అంటే పక్క రాష్ట్రాలతో మాకు పనేంటి అని విర్రవీగిన నేతలు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారో.. తాము చేసే డ్రామాలకు ఎలా కవరింగ్ ఇస్తారో చూద్దాం..

మోడీ నియంత్రణ కోల్పోతున్నారా..!

పాపం.. ప్రధాని మోడీకి తన గ్రాఫ్ పడిపోతుండటంతో.. టెన్షన్ బాగా పెరిగిపోయినట్టుంది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా తన మీద వస్తున్న వ్యతిరేకతను చూసి తట్టుకోలేకపోతున్నట్టున్నారు. అందుకే కొత్తగా తీసుకుంటున్న నిర్ణయాల్లో తడబడుతున్నట్టున్నారు. ఇప్పటికే జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు అంటూ తమకి ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని సామాన్య ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకొని బుక్కయ్యారు. అదేంటంటే... నకిలీ వార్త రాస్తే జర్నలిస్టుల గుర్తింపు (అక్రెడిటేషన్‌) రద్దు చేస్తామని ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇక అంతే ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున  దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పత్రికా స్వేచ్ఛపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నదని జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ సందర్భంగా ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు గౌతమ్‌ లాహిరి మాట్లాడుతూ.. పత్రికలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదని.. నకిలీ వార్తలపై ఫిర్యాదులుంటే ప్రెస్‌ కౌన్సిల్‌ చూసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.   దీంతో ఇప్పటికే పరిస్థితి దారుణంగా ఉందని గ్రహించిన మోడీ... ఫేక్ న్యూస్ కట్టడి ప్రతిపాదనలను వెనక్కి తీసుకున్నారు. ఆ ఆదేశాలను రద్దు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో  పీఎంవో సూచన మేరకు ఈ వివాదాస్పద ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.   ఇక ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా... ప్రభుత్వాన్ని ఎప్పుడూ విమర్శిద్దామా అని చూసే ప్రతిపక్షాలకు మంచి పాయింట్ దొరికింది. ఫేక్ న్యూస్ ఆదేశాలను మోడీ వెనక్కి తీసుకోవడంపై ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ముఖ్యంగా మోడీ అంటేనే ఒంటి కాలిపై లేచే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీ నిర్ణయంపై స్పందిస్తూ.. ఫేక్ న్యూస్ ఆదేశాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతాయని గ్రహించిన మోదీ సొంత ఆదేశాలపై యూటర్న్ తీసుకున్నారని కామెంట్ విసిరారు. ప్రభుత్వంపై మోదీ నియంత్రణ కోల్పోతున్నారన్న విషయం దీంతో తేటతెల్లమైందని విమర్శించారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..  ఏ మార్గం లేకపోవడం వల్లే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నదని.. నిత్యం ఓ రాజకీయ పార్టీ ప్రచారం చేస్తున్న ఫేక్‌న్యూస్ సంగతి ఏమిటి? అని పేరు ప్రస్తావించకుండా బీజేపీపై మండిపడ్డారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా దీనిపై స్పందిస్తూ.. ఫేక్‌న్యూస్ ముసుగులో తనకు నచ్చని కథనాలపై ప్రభుత్వం దాడి చేసే అవకాశమున్నదని విమర్శించారు. ఏది ఏమైనా ఒకప్పటి మోడీకి ఇప్పటి మోడీకి చాలా తేడా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు నియంతలా నామాటే వేదం.. నా మాటే శాసనం అన్నట్టు వ్యవహరించిన ఈయన.. ఇప్పుడు కాస్త మెత్తబడ్డారు. అందుకే వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఏం చేస్తారు మరి.. అప్పటిలాగా వ్యవహరిస్తే ఇప్పుడు వర్కవుట్ కాదు కదా.. ఎందుకంటే.. ఈ నాలుగేళ్లలో కావాల్సినంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు... అలాగే త్వరలో వివిధ రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి కదా...

విజయసాయిరెడ్డి జగన్ ను టార్గెట్ చేస్తున్నాడా...!

  ఉరుము ఉరిమి మంగలం మీద పడింది అన్న సామెత లాగ... పాపం విజయసాయిరెడ్డి చేసిన పని వల్ల ఇప్పుడు జగన్ కు మరిన్ని సమస్యలు వచ్చిపడేలా ఉన్నాయి. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన మాల్యాను సీఎం చంద్రబాబు నాయుడు కలిశారని... విజయ్ మాల్యాను చంద్రబాబు నాయుడు కలిశారా? లేదా? అని ప్రశ్నిస్తున్నానని..  దీనిపై బాబు ప్రజలకు సమాధానం చెప్పాలని మీడియా ముందు రెచ్చిపోయాడు. అంతేకాదు విజయ్ మాల్యా నుంచి రాజకీయ విరాళాల రూపంలో రూ.150కోట్లు సేకరించారా? లేదా?’ అంటూ చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు విజయ సాయిరెడ్డి. అయితే విజయసాయిరెడ్డికి ఇలా మాట్లాడటం అలవాటేలే అని కామెడీగా తీసుకున్నా ఇప్పుడు ఈ విషయం సీరియస్ అవుతోంది. చంద్రబాబుపై విజసాయిరెడ్డి చేసిన కామెంట్లపై రగిలిపోతున్న టీడీపీ నేతలు..  అసలు విజయ్ మాల్యాతో వైసీపీ నేతలు ఎవరెవరికి సంబంధాలున్నాయో అన్న విషయాలు తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు.   ఈ నేపథ్యంలోనే సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అది కూడా జగన్ గురించే. లండన్ లో చదువుకుంటున్న జగన్ కూతురు ప్రస్తుత నివాసం.. విజయ్ మాల్యా ఇంట్లోనేనట..!విజయ్ మాల్యాతో వైఎస్ జగన్ కు సన్నిహిత సంబంధాలున్నాయన్న సంగతి తెలిసిందే కదా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు… టీడీపీ ఎంపీగా ఉన్న డీకే ఆదికేశవులునాయుడును.. తన వైపుకు తిప్పుకున్నారు. లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్న ఆదికేశవులు నాయుడు… విజయ్ మాల్యా వ్యాపార భాగస్వామి. ఆ సమయంలో విజయ్ మాల్యాకు..వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పటినుండి ఆ పరిచయం అలా కొనసాగిందట. అంతేకాదు అప్పట్లో కాంగ్రెస్ కు ..గత ఎన్నికలకు ముందు వైసీపీ కూడా.. విరాళాలు..యూబీ గ్రూప్ నుంచి అందాయట. ఇక ఈ పరిచయాలతోనే చదువు కోసం లండన్ కు వెళ్లిన తన కూతురిని విజయ్ మాల్యా నివాసంలోనే ఉంచారట. తన కుమార్తె బాగోగులు చూసుకునేందుకు… అక్కడే ఉంటున్న విజయ్ మాల్యా సహకారం కోరగా.. లండన్ లో తనకు ఉన్న ఓ ఇంటిని జగన్ కూతురి కోసం విజయ్ మాల్యా కేటాయించినట్టు చెబుతున్నారు.   ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...ఈ విషయాలన్నీ విజయసాయిరెడ్డికి తెలుసు.. అయినా కూడా మాల్యా పేరు బాబుతో లింక్ చేసి... ఆ రచ్చలో జగన్ కు ఉన్న సంబంధాలను టీడీపీ ద్వారా ఇన్ డైరెక్ట్ గా బయటకు తీసుకురావాడనికే ఇలా చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క వైఎస్ జగన్ కూడా… విజయసాయిరెడ్డి తీరుపై అసహనానికి గురవుతున్నారట. తెర వెనుక ఏదో జరుగుతోందన్న ఆందోళనకు జగన్ గురువుతున్నారట. మరి నిజంగానే విజయసాయిరెడ్డి జగన్ ను ఇరికించేందుకే ఈ ప్లానే వేశారా...? విజయసాయిరెడ్డి అసలు టార్గెట్ చంద్రబాబా..? లేక వైసీపీ అధినేత జగనా..? అని వైసీపీ నేతలు జుట్టుపీక్కుంటున్నారు..ఏది ఏమైనా విజయసాయిరెడ్డి జగన్ కిందకే నీళ్లు తెచ్చేలా ఉన్నారని సామాన్యులు గుసగుసలాడుకుంటున్నారు..

పూనమ్ దగ్గర పెన్‌డ్రైవ్‌లు... చంద్రబాబు అపాయింట్‌మెంట్‌

  ఇప్పుడున్న ట్విస్ట్ లు చాలవన్నట్టు ఏపీ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఒకపక్క ఏపీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో.. ఇక్కడ రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా ఉండటానికి రకరకాల డ్రామాలాడుతుంది. దీంతో ఇదంతా వర్కవుట్ కాదులే అనుకొని ఏకంగా చంద్రబాబే రంగంలోకి దిగి ఢిల్లీ వెళ్లారు. అక్కడ వివిధ పార్టీల నేతలతో భేటీ అయి..  ప్రత్యేక హోదాపై రూపొందించిన వివరణ పత్రాలను అన్ని పార్టీల నేతలకు అందజేసి... ఏపీకి బీజేపీ చేసిన అన్యాయాన్ని వివరించనున్నారు.   ఇదంతా ఒకఎత్తైతే ఇప్పుడు మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును సినిమా నటి 'పూనమ్‌కౌర్‌' కలుసుకోబోతోందని...ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇటీవల పవన్, కత్తి మహశ్ వివాదంలో పూనమ్ కౌర్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కత్తి మహేశ్ పూనమ్ కౌర్ గురించి..ఇంకా ఆమె వ్యక్తిగత విషయాలగురించి కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక సినిమా నటుడు, పార్టీ అధ్యక్షుడికి ఆమెకు మధ్య సంబంధం ఉందని...ఆమెను అతను మోసం చేశాడని 'కత్తి' ఆరోపించారు. ఈ వివాదంపై అప్పట్లో...పూనమ్‌కౌర్‌ కూడా స్పందించి ట్విట్టర్‌లో కొన్ని వ్యాఖ్యలు చేసి...తరువాత డిలీట్‌ చేసింది. ఆ తరువాత ఏమైందో కానీ... అప్పటివరకూ మద్దతుగా నిలిచిన ఆమె.. పరోక్షంగా సినిమానటుడు, పార్టీ అధ్యక్షుడుపై విమర్శలు గుప్పిస్తోంది. 'కాన్సెప్ట్‌లు కాపీ...చేసి...బట్టలు మార్చినట్టూ...మాటపై నిలబడకుండా...జనాలను అమాయకులను చేస్తూ...అమ్మాయిలను అడ్డం పెట్టుకుంటూ...రాజకీయాలు చేస్తోన్న వారి గురించి భగవంతుడే నిజా నిజాలు తెలియజేయాలని కోరుకుంటున్నా...' అంటూ ఇటీవల ఆమె ట్వీట్‌ చేశారు.   ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె చంద్రబాబును కలవడానికి గల కారణం ఏంటబ్బా అని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఇదే సందర్భంలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఓ నటుడు గురించి చెప్పడానికే పూనమ్ చంద్రబాబును కలవనున్నారని అంటున్నారు. తనను మోసం చేసిన నటుడుపై చర్యలు తీసుకోవాలని.. తనకు న్యాయం చేయాలని ఆమె చంద్రబాబునాయుడును కోరనున్నారట. ఇప్పటికే ఆమె సిఎం అపాయింట్‌మెంట్‌ అడిగారని...ఆమెకు 4వ తేదీన ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ దొరికిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తనను మోసం చేసిన వ్యక్తి గురించి..అందరికీ తెలుసునని..ఆ వ్యక్తి వద్ద ఉన్న పెన్‌డ్రైవ్‌లు..తన వద్ద కూడా ఉన్నాయని..వాటిని సిఎంకు అందజేస్తానని ఆమె చెబుతున్నారట. ఒక వేళ ఆమె కనుక సిఎంను కలసి..పెన్‌డ్రైవ్‌లు ఇస్తే...రాష్ట్ర రాజకీయాలు కీలకమైన మలుపులు తిరుగుతాయని...రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే మీకు స్ట్రైక్ అయి ఉండొచ్చు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొంత సమయం వెయిట్ చేయాల్సిందే.

బాలయ్య హర్ట్....రాజకీయాలకు గుడ్ బై..!

  ఇప్పటికే ఏపీ రాజకీయాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకో ట్విస్ట్ తో.. రోజుకో కొత్త విషయంతో క్షణ క్షణం ఉత్కంఠ భరితంగా మారుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం బయటకువచ్చింది. అదేంటంటే... నందమూరి బాలకృష్ణ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారట. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. దీనికి పలుకారణాలు కూడా తెరపైకి వచ్చాయి.   2014 సార్వత్రిక ఎన్నికల్లో బాలయ్య హిందూపురం నుంచి ఎన్నికైన తర్వాత ఆయనకు తెలుగుదేశంలో మంత్రిత్వశాఖ లభిస్తుందని అందరూ ఊహించారు. కానీ వ్యూహాత్మకంగా చంద్రబాబు బాలయ్యను పక్కన పెట్టారు. ఇక ఆతరువాత ఎమ్మెల్యేగా కొనసాగుతూనే నియోజక వర్గాన్ని అభివృద్ది చేశారు. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆ అవకాశం కూడా లేనట్టు తెలుస్తోంది. మరోసారి హిందూపురం నుంచి గెలిచి, పార్టీలో చక్రం తిప్పాలని బాలయ్య భావిస్తున్నా...ఈసారి లోకేష్ ను హిందూపురం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అంతేకాక, తెదేపా అధిష్టానం బాలయ్యను తెలంగాణ టీడీపీ బలోపేతానికి కృషి చేయాలంటూ సూచించడంతో బాలయ్య నొచ్చుకున్నారట. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎంటో అందరికీ తెలిసిందే. దాంతో అక్కడ తెదేపా బలపడుతుందన్న నమ్మకం బాలకృష్ణకు లేదట. దానికితోడు.. ఆయనకు అక్కడ పెద్దగా ఫ్యాన్ బేస్ కూడా లేకపోవడం మైనస్ గా మారుతుందని భావిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో తాను రాజకీయాల్లో కొనసాగడం కంటే, చక్కగా సినిమాలు చేసుకుంటే మేలని బాలయ్య భావిస్తున్నారట. ఇప్పుడు హిందూపురాన్ని కూడా లోకేష్ కు కేటాయించేయడంతో, అల్లుడి మాట కాదనలేని బాలకృష్ణ, మనస్థాపంతో ఇక రాజకీయాలకు పూర్తిగా దూరం కావాలని నిర్ణయించుకున్నారట. మొత్తానికి నందమూరి కుటుంబంలో ఇప్పటికే పురంధరేశ్వరి, హరికృష్ణ చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ కూడా వారి జాబితాలో చేరిపోయినట్టున్నాడు. ఏదో అల్లుడు కాబట్టి ఆలోచిస్తున్నాడు.. కానీ లేకపోతే వాళ్లలాగ తన వ్యతిరేకతను బయటపెట్టేవాడేనేమో... చూద్దాం ఇందులో ఎంత నిజముందో...

చిడతలు వాయించినందుకే జగన్ కు ఆ ర్యాంకు... !

  వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌కు 35... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 36.. ఏంటీ నెంబర్లు అనుకుంటున్నారా...? ఏం లేందడీ.. ఈ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకులు ఎవరంటూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ జాబితాను విడుదుల చేసిన సంగతి తెలిసిందే కదా.  2017-18 సంవత్సరానికి గానూ అత్యంత శక్తిమంతమైన 100 మంది భారతీయుల జాబితాను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ విడుదల చేసింది. ఇక ఈ జాబితాలో ప్రధాని మోడీ గారు మొదటి స్థానంలో నిలిచారు. ఆ తరువాత.. స్థానంలో ఆయన ప్రియ మిత్రుడు అమిత్ షా నిలిచారు. అయితే ఇందులో ఆశ్చర్యం ఏం లేదనుకోండి. ఎందుకంటే...ఎలాగూ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ.. అందునా ప్రధాన మంత్రి.. ప్రధాని పదవిలో ఏ వ్యక్తి ఉన్నా శక్తివంతుడే..దీనిలో పెద్దగా చెప్పేదేమీ ఉండదు. గతంలో యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు సోనియాకు ఇదే ర్యాంకు వచ్చింది. అప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు దాన్నీ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు 'మోడీ' భక్తులు చెప్పుకుంటున్నారు అంతే తేడా.   అయితే ఇదే జాబితాలో జగన్‌కు 35... చంద్రబాబు నాయుడికి 36వ ర్యాంకు వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు కంటే.. జగనే అత్యంత శక్తివంతుడని సదరు పత్రిక తెలిపింది. అంతేకాదండోయే ఎందకు శక్తివంతమయ్యాడో కూడా ఆ పత్రిక వివరించింది.  ప్రతిపక్షనేత రాష్ట్రంలో బలోపేతం అవుతున్నారని...అందుకే ఆయనకు ఆ ర్యాంక్‌ వచ్చిందని సదరు పత్రిక విశ్లేషించింది. 'జగన్‌' పాదయాత్ర చేస్తూ...ప్రజలను కలుస్తున్నారని..అదే సమయంలో కేంద్రంలోని 'బిజెపి'తో అంటకాగుతున్నందున...ఆయన బలం పెరిగిపోయిందని విశ్లేషించింది. దీనిబట్టి చూస్తే అందరూ అనుకుంటున్న డౌట్లను ఈ పత్రిక క్లియర్ చేసినట్టే కనిపిస్తోంది. ఒక పక్క ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటం అంటూనే మోడీతో దగ్గరవ్వడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని.. డ్రామాలు ఆడుతున్నాడని..టీడీపీ నేతలు మండిపడుతూనే ఉన్నారు. ఇప్పుడు వారు చెప్పింది నిజం చేస్తూ ఆ పత్రిక కూడా అదే చెబుతుంది. దీన్నిబట్టి చూస్తే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.. అధికారంలోకి ఉన్నవారికి చిడతలు వాయిస్తే...శక్తివంతమైన నాయకులవుతారన్న విషయం పత్రిక విశ్లేషణ బట్టి అర్ధమవుతోంది.

పవన్ కు జేపీ పంచ్.. కామన్ సెన్స్ ఉండాలి...

  జేఎఫ్సీ కమిటీ అన్నారు.. అందరి నిగ్గు తేల్చుతా అన్నారు... అసలు కేంద్ర ప్రభుత్వం అబద్దం చెబుతుందా.. రాష్ట్ర ప్రభుత్వం అబద్దం చెబుతుందా నిజాలు బయటపెడతా అన్నారు... అఖరికి సైలెంట్ అయిపోయారు... ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఇప్పటికే అర్ధమైపోయి ఉండొచ్చు. ఇంకెవరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జేఎఫ్సీ మీటింగ్ అంటూ హడావుడి చేసి జేపీ, ఉండవల్లి అరుణ కుమార్ వంటి నలుగురు పెద్ద తలకాయలను పక్కనపెట్టుకొని నాలుగు రోజులు హడావుడి చేశారు. ఇక ఒక మీటింగ్ పెట్టి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చింది ఏం లేదని..ఇంకా 75 వేల కోట్ల ఇవ్వాలని చెప్పి చెప్పారు. ఇక అంతే అప్పటినుండి ఇప్పటివరకూ కమిటీ అడ్రస్సే లేదు. ఎవరి పనిలో వాళ్లు మునిగిపోయారు. పవన్ అయితే అసలు తాను ఓ కమిటీ ఏర్పాటు చేశాననే సంగతే మర్చిపోయినట్టు ఉన్నాడు.   ఇక ఇలా అయితే వర్కవుట్ కాదని అనుకున్నారేమో జేపీ తానే ఓ కమిటీ ఏర్పాటు చేశారు.  ఇండిపెండెంట్ గ్రూప్ ఆఫ్ ఎక్స్ పర్ట్స్(ఐజీఎఫ్) పేరిట ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి తొలి మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన పవన్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. జేఎఫ్సీ పై పవన్‌ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత చూపడం లేదని, అది ఒక ఈవెంట్ గా జరిగింది అంటూ, జేపీ ఘాటు వ్యాఖ్యలే చేసారు. లెక్కలు తేల్చిన తర్వాత ఎలాంటి చర్యలు లేవని, అందుకే స్వతంత్ర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. జేఎఫ్‌సీ తొలిదశ అయితే... నిపుణుల కమిటీ రెండో దశ అని జేపీ అన్నారు...  ఈ బృందంలో మాజీ ఐఏఎస్ పద్మనాభయ్య, ప్రొ.గలాబ్, రాఘవాచారీ, శాంతాసిన్హా, హెచ్ఏ దొర, ఇతర ప్రముఖులుంటారని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లేఖపై కూడా నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందని చెప్పారు...   అయితే జేపీ కమిటీ పై పవన్ కళ్యాణ్ స్పందించారు. జేపీ ఏర్పాటుచేయబోయే స్వతంత్ర కమిటీని స్వాగతిస్తున్నానని ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యలు, ప్రత్యేక హోదా, ఇతర సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలని కోరారు. ఇక పవన్ ట్వీట్ కు, జేపీ స్పందిస్తూ మరో ట్వీట్ చేసారు...ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం, కామన్ సెన్స్ తో ప్రవర్తిస్తే, అన్నీ పరిష్కారం అవుతాయి అనే నమ్మకం నాకు ఉంది అంటూ, ఒక పంచ్ వేసారు జేపీ. ఇప్పటికే పవన్ పై కన్ఫ్యూజన్ మాస్టర్ అనే ముద్ర పడింది. మరి కన్ఫ్యూజన్ రాజకీయాలు మానేసి..పవన్ ఓ క్లారిటీకి ఎప్పుడు వస్తాడో ఏమో.. లేకపోతే ఇలానే ఉండే ఆయన అభిమానుల్లో కూడా ఇదే కన్ఫ్యూజన్ ఏర్పడి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది..

భయపడేవాళ్లే దేశంలో అత్యంత శక్తివంతమైనవాళ్లట..!

2017-18 సంవత్సరానికి గానూ అత్యంత శక్తిమంతమైన వక్తి ఎవరో తెలుసా..? ఇంకెవరో కాదు...ప్రధాని మోడీ గారే. 2015-16, 2016-17 జాబితాలోనూ మోదీ తొలిస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.  ఈసారి కూడా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.  ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2017-18 సంవత్సరానికి గానూ అత్యంత శక్తిమంతమైన 100 మంది భారతీయుల జాబితాను తాజాగా విడుదల చేసింది. 100 పేర్లతో విడుదల చేసిన ఈ జాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. ఆ వెంటనే రెండో స్థానం ఎవరిదో తెలుసా...? ఆయన కూడా మరెవరో కాదు.. మోడీ ప్రియ మిత్రుడు అమిత్ షా. ఆయన రెండో స్థానంలో ఉన్నారు. షా ఇలా రెండో స్థానంలో నిలవడం ఇది రెండోసారి.   మరి ఈ విషయం తెలిసినా నెటిజన్లు ఊరుకుంటారా..? అప్పుడే మోడీ, షా ద్వయంపై సోషల్ మీడియా సాక్షిగా సెటైర్లు వేసుకుంటున్నారు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై స్పందిస్తూ మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన నరేంద్ర మోడీ లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నా ఒక సాధారణ అవిశ్వాస తీర్మానంకు బయపడి పారిపోతున్నారు అని అంటున్నారు. ఇంకా కొంతమందైతే.. దాదాపుగా 15 రోజులుగా సభ సజావుగా లేదు అనే వంకతో సభ వాయిదా వేయిస్తూ అవిశ్వాసాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటుంటే.. మరికొంత మంది మాత్రం... సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాసం పెడితే తిరగబడతారేమో అని వారు భయపడుతున్నారు.. అటువంటప్పుడు వారు అత్యంత శక్తిమంతులు ఎలా అవుతారని కామెంట్లు విసురుతున్నారు. మరి కామెంట్ల సంగతి పక్కన పెడితే.. అందులో ఎంతో కొంత నిజం ఉందని చెప్పొచ్చు. అత్యంత శక్తివంతమైన మోడీ.. అవిశ్వాస తీర్మానానికి భయపడి.. దానిని చర్చకు రానివ్వకపోవడం నిజంగా హాస్యాస్పదం. మరి అలాంటివారు శక్తివంతులు ఎలా అవుతారో.. ఏమో..వారికే తెలియాలి..

నోరు జారుతున్నారా..? నిజాలు చెబుతున్నారా..?

రాజకీయ నాయకులు నోరు జారడం కామన్ థింగే. కాస్త తడబాటులో నోరు జారుతుంటారు. నోరు జారి.. ఆ తరువాత పొరపాటును గ్రహిస్తారు. అదేంటో ఈ మధ్య బీజేపీ నేతలు తెగ నోరుజారుతున్నారు. నోరు జారితే జారారు... కానీ మోడీ పరువును అడ్డంగా తీసేస్తున్నారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకు వచ్చినప్పుడు ఓ సభలో పాల్గొన్నారు. ఇక సభలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక కాంగ్రెసు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ అత్యంత అవినీతికరమైన ప్రభత్వం ఏది అని పోటీ పెడితే యడ్యూరప్ప ప్రభుత్వం మొదటి స్థానంలో నిలుస్తుందని వ్యాఖ్యానించి అందరికీ షాకిచ్చాడు. ఇక షా పక్కనే కూర్చున్న యడ్యూరప్ప అయితే ఒక్కసారిగా ఖంగుతిని షా వైపు చూడగా.... తప్పు తెలుసుకున్న అమిత్ షా.. తన వ్యాఖ్యలను సరి చేసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమిత్ షా చేసిన వ్యాఖ్యల వీడియో వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అందరూ సెటైర్లు విసిరారు.    ఇప్పుడు మరోనేత అలాగే నోరుజారి మోడీ పరువు తీసేశారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి కర్ణాటకలోని ఓ సభలో పాల్గొనేందుకు వచ్చారు. అయితే ఈసారి ఆయన  ప్రహ్లాద్ జోషి అనే ట్రాన్స్ లేటర్ ను పెట్టుకున్నారు. ఇక అమిత్ షా హిందీలో మాట్లాడుతుండగా.. ప్రహ్లాద్ జోషి కన్నడలో అనువదించారు. ఈ సందర్భంగా అమిత్  షా 'సిద్దరామయ్య ప్రభుత్వం కర్ణాటకను అభివ్రుద్ధి చేయదు. మీరు ప్రధాని మోదీ పట్ల విశ్వాసం ఉంచి బీఎస్ యెడ్యూరప్పకు ఓటేయండి. మేం కర్ణాటక రాష్ట్రాన్ని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం' అని అన్నారు. దానికి ప్రహ్లాద్ జోషి.. 'ప్రధాని నరేంద్రమోదీ దళితులు, పేదలు, బలహీన వర్గాల వారికి ఏమీ చేయరు. ఆయన వల్ల దేశానికి నష్టం వాటిల్లుతుంది. దయచేసి ఆయనకు ఓటేయండి' అని అమిత్ షా అన్నారని కన్నడ భాషలో చెప్పారు. ఆ తరువాత తప్పు గ్రహించి...మళ్లీ ఆ వ్యాఖ్యలు సరిచేశారనుకోండి. మొత్తానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని కలలు కంటున్న మోడీకి పార్టీ నేతలే నష్టం తెచ్చిపెడుతున్నారు. ఇప్పటికే మోడీకి పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీనికి తోడు పార్టీ నేతలే ఉన్న పరువు కాస్త తీసేస్తున్నారు.

జేపీ కొత్త కమిటీ... పవన్ తో వేస్ట్

  అసలు ఎవరు నిజం చెబుతున్నారు...ఎవరు అబద్దం చెబుతున్నారు అంటూ వారి నిజాలు బయటకి తీస్తా.. నిజాల నిగ్గు తేలుస్తా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హడావుడి చేసిన సంగతి తెలిసిందే కదా. ఏపీకి మేము ఇవ్వాల్సిన నిధులు ఇచ్చామని.. అంటే.. టీడీపీ మాత్రం ఇవ్వలేదని చెబుతూ... జనాల్ని అయోమయంలో పడేస్తున్నారంటూ.. ఇద్దరిలో ఎవరు  నిజం చెబుతున్నారో.. ఎవరు అబద్దం చెబుతున్నారో నిజాలు బయటపెడతానంటూ లోక్ సత్తా అధినేత జేపీ, ఉండవల్లి ఇంకా చాలా పెద్ద పెద్ద తలకాయలతో కలిసి జేఎఫ్ సీ అని ఓ కమిటీ ఏర్పాటు చేశాడు. ఇక ఆతరువాత అందరూ కలిసి ఏదో ఒక వారం రోజులు కష్టపడి మరో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని నిజాలు బయటపెట్టారు. ఏపీకి కేంద్రం ఇచ్చింది ఏం లేదని..దాదాపు 75 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెబుతూ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పారు. ఇక ఆతరువాత ఆ కమిటీ అడ్రస్సే లేదు. తొలుత కాస్తంత హడావిడి చేసిన పవన్ ఇప్పుడు అసలు దాని విషయమే మరిచిపోయారు. ఆ తరువాత ఎవరి దారి వారిది అన్నట్టు అయిపోయింది.   అందుకే జేపీ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జేఎఫ్సీ తరహాలోనే ఇండిపెండెంట్ గ్రూప్ ఆఫ్ ఎక్స్ పర్ట్స్(ఐజీఎఫ్) పేరిట ఓ కమిటీని ప్రకటించేశారు. దీనిలో భాగంగానే జేపీ ఓ ప్రకటన కూడా చేశారు. ఈ కమిటీ తొలి సమావేశం ఈ నెల 30న జరుగుతుందని కూడా జేపీ ఆ ప్రకటనలో ప్రకటించేశారు. ఈ కమిటీలో కూడా చాలా పెద్ద పెద్ద వ్యక్తులే ఉన్నారు. అయితే జేపీ సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటబ్బా అని అందరూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు... అసలు ఉన్నట్టుండి జేఎఫ్ సీ లో సభ్యుడిగా ఉన్న జేపీ ప్రత్యేకంగా కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారబ్బా అని అందరూ ఆలోచిస్తుండగా... ఓ ఆసక్తికర విషయం బయటపడింది. అసలు పవన్ కు తాను ఏర్పాటు చేసిన కమిటీపైనే నమ్మకం లేదన్న భావన ఉన్నట్లుగా జేపీ గ్రహంచారట. అంతేకాకుండా రాజకీయంగా ఎప్పటిప్పుడు కన్ఫూజన్ మైండెడ్తో ముందుకు సాగుతున్నారని ఈ క్రమంలో జేఎఫ్ సీతో పని కాదని ఓ అంచనాకు వచ్చిన తర్వాతే జేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి జేపీకి కూడా పవన్ కన్ఫ్యూజన్ మైండ్ గురించి అర్ధమైనట్టు ఉంది. అందుకే ఈయనతో పెట్టుకుంటే వర్కవుట్ కాదని చెప్పి బయటకు వచ్చేసినట్టు ఉన్నారు. మరి జేపీ ఈ కమిటీ ద్వారా ఏం నిజాలు బయటపెడతారో చూద్దాం...

ఆమరణ నిరాహార దీక్షకు సిద్దం.. ఆ జిల్లా నుండే..!

  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒకపక్క టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తీరుపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. అయితే ఇంతవరకూ అవిశ్వాస తీర్మానం చర్చకు రాలేదనుకోండి. సభలు వాయిదా పడటం తప్ప... అవిశ్వాస తీర్మానం పై చర్చకు వచ్చే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలు సైతం అవిశ్వాస తీర్మానం పై చర్చ జరపాలని పట్టుపడుతున్నా అది మాత్రం వర్కవుట్ కావట్లేదు.   ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పోరాటానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. టీడీపీ, బీజేపీలతో బంధానికి గుడ్‌బై చెప్పేసిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజాలకెత్తుకోవాలని భావిస్తున్నారట. దీనికోసం సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తాలతో జిల్లాలవారీ పర్యటనలు చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే అనంతపురం, ఒంగోలు, కాకినాడ, వైజాగ్‌లలో సభలు పెట్టి ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి వచ్చే లాభాలను వివరించాలని ప్లాన్ చేసుకుంటున్నారట. ఇక జిల్లాల పర్యటన ముగిసిన వెంటనే రాయలసీమలోని అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ పవన్‌కళ్యాణ్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హోదా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలంటే ఆమరణ దీక్ష బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందనే భావనతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు.. ఎలాగూ ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి... అనంతపురం నుంచే ప్రత్యేక హోదా ఎజెండాతో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నారట.   మొత్తానికి పవన్ కళ్యాణ్ మంచి ప్లానే వేసినట్టు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ప్రత్యేక హోదా సాధనలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని పవన్  విమర్శిస్తూనే ఉన్నారు. దానికి తోడు కేంద్రం తీరు కూడా అలానే ఉంది. ఎలాగూ పవన్ కు బీజేపీ కి మధ్య లోపాయికార ఒప్పందం ఉందన్న వార్తలు వస్తున్నాయి కాబట్టి.. ఒకవేళ పవన్ దీక్ష చేపట్టి... దానికి కేంద్రం ఒప్పుకొని హోదా ఇస్తే క్రెడిట్ మొత్తం పవన్ కే వెళుతుంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే పవన్ దీక్ష వరకూ ఆగాల్సిందే.

వీరి కాంబోలో మరో అద్భుతమైన సీన్..బీ రెడీ..

  త్వరలో మరో అద్భుతమైన సీన్ చూసే అదృష్టానికి ఏపీ ప్రజలు నోచుకున్నారు. ఇంతకీ ఆ సీన్ ఏంటనుకుంటున్నారా...? ప్రధాని నరేంద్ర మోడీ, విజయసాయిరెడ్డిలు మరోసారి ఓ అద్భుతమైన సీన్ చూపించబోతున్నారు. ఇప్పటికే భూమి సూర్యని చుట్టూ తిరుతునట్టు.. తన కేసుల నేపథ్యంలో రెడ్డిగారు మోడీ చుట్టూ ప్రదిక్షణలు చేస్తూనే ఉన్నారు. ఆయన అపాయింట్ మెంట్ తీసుకుంటారు. అవసరమైతే ఆయన కోసం వెయిట్ చేస్తారు. ఇంకా అవసరమైతే కాళ్ల మీద పడతారు. ఇక ఈ విషయం వార్తల్లో రావటం..దీని గురించి ఏదైనా మాట్లాడితే.. నా ఇష్టం నేను కలుస్తా.. ఎన్నిసార్లైనా కలుస్తా.. మీ కెందుకు అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. అంతేనా అక్కడితో ఆగడు.. ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా...బూతు పురాణం ఎత్తుకుంటాడు. దీంతో ఎంత కవర్ చేసిన విజయసాయిరెడ్డి ఆలోచన ఏంటనేది అందరికీ అర్ధమయింది.   ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే...విజయసాయి రెడ్డిగారు "వెంకటేశ్వర వైభవం" అనే పుస్తకం రాశారంట. అయితే ఈ పుస్తక ఆవిష్కరణ మోడీతో చేయించనున్నారట. ఈ విషయం మోడీ దగ్గర ప్రస్తావించి.. ఆయన్ని టైం అడిగితే.. మోడీ గారు కూడా ఓకే అన్నారట. దీంతో తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారట. ఇక ఈ వార్తలు బయటకు రావడంతో అప్పుడే చర్చలు, కామెంట్లు మొదలయ్యాయి. విజయసాయి రెడ్డి... మళ్ళీ మోడీ కాళ్ళ పై పడే సీన్ ఈ రాష్ట్ర ప్రజలు మరోసారి చూడనున్నారని అంటుండగా... తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలు మన ప్రధానికి కనపడవు కాని.. అదే వెంకన్న పాదాల సాక్షిగా A2 రాసిన పుస్తకం మాత్రం విడుదల చేస్తారంట... అని అనుకుంటున్నారు.   మరి ఒకపక్క ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ.. ఏపీ ప్రజలంతా పోరాటం చేస్తుంటే... మోడీ మనకు అన్యాయం చేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరోపక్క విజయసాయి రెడ్డి మాత్రం, మోడీ కాళ్ళకు మొక్కి, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఈ విధంగా తాకట్టుపెడుతున్నారు. ఇక ముఖ్యమంత్రిగారికి అపాయింట్ మెంట్ ఇచ్చే తీరిక మన ప్రధాని గారికి లేదు కానీ.. ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చి.. పుస్తకాన్ని ఆవిష్కరించడానికి మాత్రం టైం దొరుకుతుంది. ఈ విషయం ఎలాగూ అందరికీ తెలిసిపోయింది కదా అని అనుకుంటున్నట్టున్నారు...అందుకే డైరెక్ట్ గానే ఈ సీన్ చూపించడానికి రెడీఅవుతున్నారు. మరి 16 నెలలు జైలుకి వెళ్లి వచ్చి, బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తిని, మోడీనే ప్రోత్సహిస్తున్నాడు అంటే, ఇంకా ఏమి చెప్పాలి ?

అడ్డంగా దొరికిపోయిన విజయసాయిరెడ్డి...

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వద్ద టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఎప్పుడో అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. అయితే అది ఇంతవరకూ చర్చకు రాలేదనుకోండి. ఒకపక్క రెండు పార్టీలు పోరాటం చేసేది ప్రత్యేక హోదా కోసమే అయినా..ఎడమొహం, పెడ మొహం గానే పోరాటం చేస్తున్నారు. వైసీపీ నేతలు టీడీపీ విమర్శలు గుప్పిస్తుంటే.. టీడీపీ నేతలు వైసీపీ నేతలపై ప్రతి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ పోరాటం కాస్త ఇప్పుడు రివర్స్ అయింది. అసలు పోరాటాన్ని వదిలేసి వ్యక్తిగత దూషణలు చేసుకునే వరకు వెళ్లారు. దీనికి కారణం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మోడీ కాళ్ల మీద పడ్డారు అన్న వార్తలు రావడమే.   ఈ వార్తలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో హోదా కోసం నినదించిన నోర్లు కాస్త సాయంత్రానికి ఒకరిపై ఒకరు ఎదురు దాడులకు దిగాయి. ఇప్పటికే ఒక పక్క హోదా కావాలని నాటకాలు ఆడుతూ.. విజయసాయిరెడ్డి మోడీ చుట్టూ తిరగడం ఏంటీ అని టీడీపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో దానిపై స్పందించిన విజయసాయిరెడ్డి నేను మోడీని కలుస్తా... ఎన్నిసార్లైనా కలుస్తా.. మీకేంటీ.. చంద్రబాబును జైలు పంపించే వరకూ కలుస్తా అని చిందులు వేశారు. ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో మరోసారి కోపంతో ఊగిపోయారు విజయసాయిరెడ్డిగారు. మోడీ కాళ్లు తను మొక్కినట్టుగా అసత్య ప్రచారం చేస్తున్నట్టుగా విజయసాయి రెడ్డి చంద్రబాబుపై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని, బాబు నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడివి అయితే ఇలాంటివి చౌకబారు కామెంట్స్ చేయవని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్దం నెలకొంది. దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.   వైసీపీపై టీడీపీ ఎదురుదాడి మొదలు పెట్టింది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఈ సమయంలో టీడీపీ సవాల్ ను స్వీకరించిన విజయసాయి రెడ్డి.. పుటేజ్ బయట పెట్టాలంటూ.. రాజ్యసభకు లెటర్ రాశారు. అప్పుడు ఎవరు కాళ్లు మొక్కారో తెలుస్తుందని అన్నారు. అయితే ఈ లెటర్ ను చూసిన టీడీపీ నేతలు విజయసాయిరెడ్డి అడ్డంగా దొరికిపోయారని అన్నారు. ఎందుకంటే... మార్చ్ నెల రాయాల్సింది దగ్గర.. ఆగష్టు అని రాసి మోసం చేశారని... ఇక్కడే దొరికిపోయాడంటూ చెబుతుంది. ఇప్పుడు కనుక వెంకయ్య నాయుడు ఆ పుటేజ్ ని బయటపెడితే విజయసాయిరెడ్డి అసలు బాగోతం బయపడుతుందంటూ టీడీపీ చెబుతుంది. దీంతో ఇప్పుడు వెంకయ్య నాయుడు నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో..

లోకేశ్ పై పవన్ కామెంట్లు.. ఓ మంత్రిగారి హస్తం...

  గుంటూరులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి ఇచ్చిన షాక్ ఎవ్వరూ మరిచిపోలేనిది. ఎందుకంటే అప్పటి వరకూ ఇద్దరిదీ ఒకే జట్టు అని అందరూ భ్రమలో ఉండగా.. కాదు అని టీడీపీ పై ఓ రేంజ్ లో దుమ్మెత్తి పోశారు పవన్. నిజానికి టీడీపీ పై చేసిన ఆరోపణలు వైసీపీపై బీజేపీ పై కూడా చేసి ఉండరు ఆయన. అంతలా టీడీపీపై విమర్శలు చేశారు. అంతేనా బహిరంగంగానే చంద్రబాబు తనయుడు లోకేశ్ పై అవినీతి ఆరోపణలు గుప్పించారు. మంత్రి లోకేష్‌ అవినీతిపరుడని...ఆయన అవినీతికి పాల్పడుతున్నారని... మీ కుమారుడి అవినీతి గురించి మీకు తెలీదా అంటూ ఏకంగా చంద్రబాబునే ప్రశ్నించాడు ఆయన. దీంతో ఇంత సడెన్ గా పవన్ యూటర్న్ తీసుకోవడం చూసి షాకైన టీడీపీ నేతలు.. ఆ మరుసటి రోజు నుండి పవన్ పై ముప్పేట దాడి చేశారు. పవన్ వెనుక బీజేపీ ఉందని..పవన్, వైసీపీ కలిపోయాయని ఇలా ఎవరికి నచ్చిన వాదన వారు వినిపించారు.   అయితే విమర్శలు అయితే గుప్పించారు కానీ.. అసలు పవన్ ఇలా మాట్లాడటానికి కారణం ఏంటీ.. దీని వెనుక ఎవరు ఉన్నారు...'లోకేష్‌' అవినీతికి పాల్పడుతున్నారని...'పవన్‌'కు చెప్పిందెవరు..? అసలు 'లోకేష్‌'పై 'పవన్‌'ను ఉసిగొల్పింది..ఎవరు? అన్న విషయాలపై టీడీపీలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం బయట పడింది.  లోకేష్‌పై 'పవన్‌' అవినీతి ఆరోపణలు చేయడం వెనుక...చంద్రబాబు మంత్రివర్గంలో కీలక శాఖ నిర్వహిస్తున్న మంత్రి హస్తం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మంత్రే...'పవన్‌'కు క్లూ ఇచ్చారని... 'లోకేష్‌' ఎక్కడ అక్రమాలు చేశారో...ఆయన చెప్పారని...అయితే...'లోకేష్‌' చేసిన అవినీతికి మాత్రం ఆధారాలు చూపకుండా...యధాలాపంగా...'లోకేష్‌' అవినీతిపరుడని...'పవన్‌'తో వ్యక్తిగత సంభాషణల సమయంలో చెప్పారట. దీంతో...'పవన్‌' దాన్నే ఆధారంగా చేసుకుని 'లోకేష్‌'పై ఆరోపణలు చేశారట. దీంతో ఇప్పుడు ఆ మంత్రిగారు ఎవరబ్బా అనే చర్చలు మొదలయ్యాయి. .'చంద్రబాబు' క్యాబినెట్‌ సహచరుడే...ఆయన కుమారుడు అవినీతికి పాల్పడ్డారని..ప్రచారం చేయడంపై టిడిపి వర్గాలు అవాక్కు అవుతున్నారట. ఆ మంత్రి ఎవరు..? ఆయన 'లోకేష్‌'పై ఎందుకు కత్తి కట్టారు...? వ్యాపార లావాదేవీల్లో వారిద్దరి మధ్య ఏమైనా తేడాలు వచ్చాయా...? లేక...ఇంకేమైనా రాజకీయ ప్రయోజనాలను ఆశించి..ఆ మంత్రి...'లోకేష్‌' అవినీతిపై ప్రచారం చేస్తున్నారా...? అనేదానిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సదరు మంత్రి 'పవన్‌'తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారా...? వచ్చే రోజుల్లో ఆయన 'జనసేన' పార్టీలో చేరతారా..? దీని కోసమే...ఆయన 'లోకేష్‌' అవినీతి గురించి ప్రచారం ప్రారంభించారా...? అనే ప్రశ్నలు టిడిపి వర్గాల నుంచి వస్తున్నాయి. మరి పవన్ వెనుక ఉన్న ఆ మంత్రిగారు ఎవరో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.