విడదల రజిని కొత్త పంచాయితీ!

వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా వెలగబెట్టిన సైబరాబాద్ మొక్క విడదల రజిని అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు విడుదల రజని అవినీతి లీలలు చాలా బయటపడ్డాయిగానీ, ఇప్పుడు ‘అవినీతి’ అని అనలేముగానీ, ‘అన్యాయం, అక్రమం’ అనడానికి అర్హత వున్న ఒక కొత్త పంచాయితీ బయటపడింది. పల్నాడు జిల్లా యడ్లపాడులో కోటయ్య అనే రైతుకి చెందిన మూడెకరాల భూమిని విడదల రజిని తన మరిది గోపీనాథ్ పేరు మీద కొనుగోలు చేశారు. ఎంచక్కా రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకున్నారు. ఇంకా పాతిక లక్షల రూపాయలు తర్వాత ఇస్తాం అన్నారు. విడదల రజిని గారి తాలూకు కదా అని సదరు రైతు అప్పట్లో ఏం మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు రైతు కోటయ్య తన డబ్బు పాతిక లక్షలు ఇవ్వాలని అడుగుతుంటే ఇవ్వకుండా విడదల రజిని అండ్ కో రేపు మాపు అని తిప్పుతున్నారు. దాంతో కోటయ్య డైరెక్ట్.గా మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు వచ్చేశాడు. ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నాడు. మరి ఈ ఫిర్యాదు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఒక్క విడదల రజిని విషయం మాత్రమే కాదు..  వైసీపీ ఐదేళ్ళ రాక్షస పాలనలో నష్టపోయినవారు. వైసీపీ నాయకుల చేతిలో మోసపోయిన వారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులకు చేరుకుని ఫిర్యాదులు చేస్తున్నారు. అక్రమ కేసులు తొలగించాలని కొందరు, గత ప్రభుత్వం వల్ల నష్టపోయామని మరికొందరు.. ఇలా వైసీపీ ప్రభుత్వ బాధితులు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం కార్యాలయాలకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు.

ఇరాక్‌లో ఇక చిన్నారి పెళ్ళికూతుళ్ళు!

ఇరాక్‌లో అమ్మాయిలకు పెళ్ళి చేయడానికి కనీస వయసును 9 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ బిల్లు ఆమోదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పర్సనల్ స్టేటస్ ‘లా’ను సవరించే ఉద్దేశంతో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మీద ఇరాక్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి బిల్లునే ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కితగ్గింది. ఈసారి మాత్రం వెనక్కి తగ్గే ఉద్దేశంలో వున్నట్టు లేదు. ప్రస్తుతం ఇరాక్‌లో అమ్మాయిల వివాహానికి కనీస వయసు 18 సంవత్సరాలుగా వుంది. ఇప్పుడు ఈ బిల్లుకు ఆమోదం లభించినట్టయితే, అమ్మాయిల పెళ్లి వయసు 9 ఏళ్ళకు, అబ్బాయిల పెళ్ళి వయసు 15 ఏళ్ళకు తగ్గుతుంది. అప్పుడు ఇరాక్‌లో బాల్య వివాహాలు చేసుకోవడానికి చట్టపరంగా ఎలాంటి అభ్యంతరం వుండదు. ఇది బాల్య వివాహాలు పెరగడానికి కారణం కావడంతోపాటు, మహిళల హక్కుల విషయంలో ఇంతకాలం సాధించిన అభివృద్ధి కుంటుపడుతుందని ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు అంటున్నాయి. అంతే కాకుండా ఈ బిల్లు ఆమోదం పొందితే బాలికల విద్య, ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతుందని, చదువు మధ్యలో ఆపే ఆడపిల్లల సంఖ్య పెరుగుతుందని అంటున్నాయి. చిన్న వయసులోనే గర్భందాల్చడం, గృహహింస వంటివి పెరుగుతాయని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లిటిగేషన్ క్వీన్ పూజా ఖేడ్కర్!

తప్పుడు సర్టిఫికెట్లతో ఐఏఎస్ అయి, ఆ తర్వాత సర్వీసులో వుండగా ఓవర్ యాక్షన్ చేసి, ప్రస్తుతం పరారీలో వున్న పూజా ఖేడ్కర్ పెద్ద లిలిగేషన్ క్వీన్ మాదిరిగా వుంది. చట్టంలో వున్న లొసుగులను ఎలా ఉపయోగించుకోవాలి, పై పదవులలో వున్నవారిని ఎలా ప్రభావితం చేయాలనే పాయింట్లలో పూజా ఖేడ్కర్ పీహెచ్‌డీ చేసినట్టుంది. అందుకే వేలికి వేస్తే కాలికి వేసి, కాలికి వేస్తే వేలికి వేసి ఐఏఎస్ అయింది. అనుకున్నది సాధించినప్పటికీ, పద్దతిగా వుండకపోవడంతో అమ్మగారి గుట్టు రట్టయిపోయింది. ఆమె ఐఏఎస్ హోదా రద్దు కావడంతోపాటు భవిష్యత్తులో కూడా ఆమె యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలలో హాజరు కావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇక ఆమెని అరెస్టు చేయడం ఒక్కటే మిగిలి వుంది. అయితే పరారీలో వున్న పూజా ఖేడ్కర్‌ తన లాయర్ల ద్వారా గేమ్ నడిపిస్తోంది.  తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం మీద పూజా ఖేడ్కర్ ఢిల్లీ కోర్టుని ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఆమె లాయర్ కోర్టులో వాదన వినిపిస్తూ, ‘‘పూజా ఖేడ్కర్ యూపీఎస్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన విషయం ఇంతవరకు నా క్లయింట్‌కి తెలవదు. దానికి సంబంధించిన ఉత్తర్వులు నా క్లయింట్‌కి అందలేదు. మీడియా ద్వారా మాత్రమే ఈ విషయం తెలిసింది. తనకు ఉత్తర్వులు అందిన తర్వాత నా క్లయింట్ ట్రైబ్యునల్‌ని ఆశ్రయిస్తుంది’’ అని అన్నాడు. ఇక్కడే పూజా ఖేడ్కర్ అతి తెలివితేటలు బయటపడుతున్నాయి. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వుంది. ఆమె ఎక్కడ వుందో తెలియదు. అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్టు నోటీసులు ఇద్దామంటే ఆమె పత్తాయే లేదు. ఈ లిటిగేషన్ క్వీన్ ఒకపక్క తప్పించుకుని తిరుగుతుంది.. మరో పక్క తనకు నోటీసులు అందలేదని కోర్టుకు చెబుతుంది. పాప తెలివితేటలు మామూలుగా లేవు!

నాగార్జుసాగర్ నిర్మాణానికి నారు, నీరు పోసిందెవరు?

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపకర్త  వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గురించి తెలుసుకోవాలంటే  ఆయన కంటే  ముందు తరాలకు  చెందిన రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు  గురించి తెలుసుకోవాలి!  వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1761, ఏప్రిల్ 27న జగ్గ భూపతి, అచ్చమాంబ దంపతులకు జన్మించారు. క్రీస్తు శకం 1413 నుండి తీరాంధ్ర ప్రాంతంలో ఒక భాగాన్ని పాలించిన వాసిరెడ్డి వంశానికి చెందినవాడు వేంకటాద్రి నాయుడు. నేడు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో  జగ్గయ్యపేట అనేది  తన తండ్రి పేరు   జగ్గ భూపతి పేరు మీద నిర్మించిన పట్టణం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణా నదికి కుడివైపున ఉన్న అచ్చంపేటను తన తల్లి అచ్చమాంబ పేరు మీద అచ్చంపేటగా నిర్మించాడు.  నాటి అమరావతి నగర  నిర్మాత కూడా వేంకటాద్రి నాయుడే! తన రాజధాని  చింతపల్లి నుండి  అమరావతికి మార్చి అమరావతి శివాలయంతో పాటు  మొత్తం 108 దేవాలయాలు  కట్టించాడు. మంగళగిరి నరసింహ స్వామి గుడి గోపురం  కట్టించింది కూడా  వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడే!  ఆ గోపురం దేశంలోనే రెండో అతి పెద్ద గోపురంగా నిలిచింది అని చెబుతారు.  అమరావతి  అమరలింగేశ్వర స్వామి  సేవలో గడుపుతూ 1817, ఆగష్టు 17న శివైక్యం చెందారు.  ఆ రాజవంశానికి  చెందిన  వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆయనే ముక్త్యాల రాజాగా ప్రసిద్ధి. నాగార్జునసాగర్ కథలో ఆయనే హీరో..!  జగ్గయ్యపేట  అసెంబ్లీ నియోజకవర్గ నుంచి 1972లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ అలియాస్ ముక్త్యాల రాజా. ముక్త్యాల రాజాని ప్రాజెక్టుల ప్రసాద్ అని కూడా పిలిచేవారు. ప్రజలకు శాశ్వితంగా ఉపయోగేపడే పని చేయాలన్న తపనతో తలంపుతో  నాగార్జున సాగర్ డాం నిర్మాణానికి ప్రసాద్ అహర్నిశలూ శ్రమించారు. కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్తు నిర్మాణం ఆలోచన వాసిరెడ్డి ప్రసాద్‌దే కావడం విశేషం.  మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళులతో కలసి వుండగా  కృష్ణానది నీటిని తమిళ ప్రాంతానికి  తీసుకుపోవడానికి నాటి తమిళ కాంగ్రేస్ నాయకులు ప్రయత్నాలు  మొదలు పెట్టారు. అందులో భాగంగా  కృష్ణా,  పెన్నా నదులను అనుసంధానం  చేయడానికి తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు.  విషయం తెలుసుకున్న  వాసిరెడ్డి మహేశ్వర ప్రసాద్ ఆంధ్రలో   తొమ్మిది జిల్లాలలో ప్రతి వూరు తిరిగి నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి కేంద్ర  ప్రభుత్వానికి పంపారు.  మాచర్ల నుండి దట్టమయిన అడవుల గుండా నందికొండ వరకు వెళ్ళి!  డ్యాంకు అనువైన స్థలం చూశాడు. సొంత డబ్బుతో రిటైరయిన ఇంజినీర్లను ఒక టీంగా తయారు చేసి వారిచేత ప్రాజెక్టుకు కావల్సిన ప్లానులు, డిజైనులు చేయించాడు. కానీ మద్రాసు ప్రభుత్వం ప్రసాద్ ప్రయత్నాలకు అన్నివిధాలుగా  అడ్డుపడింది. వాసిరెడ్డి  మాత్రం  పట్టువదలని  విక్రమార్కుడిలా  కృష్ణా రైతుల వికాస సంఘం స్థాపించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు. అప్పుడు  ప్రభుత్వం ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది. కానీ ఆ కమిటీ సభ్యులు అడవులల్లో పడి  మేం నందికొండకు చేరుకోలేం!  కార్లు కనీసం జీపులో వెళ్ళటానికి అనువైన దారి కూడా లేదు  అనే సాకుతో పక్కన పడేశారు. వాళ్ళు  అలా  చేయడానికి  వారిని  ఎవరు ప్రభావితం చేసి వుంటారు? తమిళ కాంగ్రెస్ నాయకులు.   మరి నాటి  మన సీమ సింహాలు  ఏం చేశాయి?  ప్రత్యేక  తెలుగు రాష్ట్రం కోసం  పొట్టి శ్రీరాములు అనే  మహానీయుడు  56 రోజులు  కూడు లేకుండా  అమరణ నిరాహార దీక్ష  చేసి  అమరజీవి  అయ్యే వరకు  సీమసింహాలు  ఏం చేసాయో  నాగార్జున  సాగర్  ప్రాజెక్టును  పక్కన పెట్టినప్పుడు కూడా అదే చేసాయి.  పౌరహక్కులు,  అందరికీ  చదువు, నీరు పారి  బీడు భూములు  పచ్చటి  పంట పొలాలుగా  మారిపోతే  ప్రజలు  బాగుపడిపోతారు.  పెత్తందార్ల  ఆటలు  సాగవు కదా!  పచ్చటి  పంట పొలంలో  పేదలకు  వ్యవసాయ కూలిపని  దొరికితే వారి పిల్లలు  బడికి పోతారు!  మరి పెత్తందార్లకు  పాలేర్లు  దొరకరు.  ఒక్కపూట  జొన్న  రాగి ముద్ద కోసం  పెత్తందార్ల వెంట కత్తులు పట్టుకుని  ఎవరు నిలబడతారు! అందుకోసం మనకు పోలవరం  వద్దు  పులిచింతల వద్దు  సాగర్  వద్దు  ఇదీ అనాటి  పెత్తందార్ల కాలకూట  వికృత  రాజకీయం.   రాజా వాసిరెడ్డి ప్రసాద్ పిచ్చోడు కదా! వేల రూపాయల తన సొంత డబ్బు ఖర్చు పెట్టి  ఇరవై ఐదు గ్రామాలనుండి ప్రజలను   స్వచ్చంద్ర సామాజిక   కార్యక్తర్తలను సమీకరించి వారం రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి  కార్లు వెళ్ళటానికి  వీలుగా  దారి ఏర్పాటు చేయించాడు.  ఖోస్లా కమిటీ సభ్యులు నందికొండ ప్రదేశం చూసి ప్రాజెక్టు కట్టడానికి   ఇంతకన్నా మంచి చోటు వుండదని తేల్చారు .   ఢిల్లీ వెళ్లి ఆనాటి ప్రధాని నెహ్రు,  పటేల్ వంటి పెద్దలను కలిసి ప్రాజెక్ట్  గొప్పతనం వివరించి, నాగార్జున సాగర్ నిర్మాణంపై  ప్రభుత్వ పెద్దల దృష్టి పడేటట్లు చేశారు. ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టాడానికి   ఢిల్లీలో ప్రయత్నాలు మొదలైయ్యాయి. వాసిరెడ్డి  ప్రసాద్ పలుమార్లు  ఢిల్లీ వెళ్ళి ఆచార్య ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య లాంటి  వారిని ఇతర  పార్లమెంటు సభ్యులను కలిసి, ఖోస్లా కమిటీ రిపోర్టు  ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్లానింగ్ కమిషను సభ్యులందరినీ విసిగించే పనిలో పడ్డాడు.  అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నరు చందూలాల్ త్రివేది ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశాడు. ఎట్టకేలకు 1954లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబరు 10వ తేదీ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్‌  శంకుస్థాపన జరిగింది.    ప్రాజెక్టుకు  నాగార్జున అని  ఎందుకు పెట్టారు.?  అక్కినేని  నాగేశ్వర్రావు  కొడుకు పేరు అని  కొందరు  అనుకునే  ప్రమాదం  వుంది. ఒకటి 2వ శతాబ్దాలలో ఇక్ష్వాకు రాజవంశం తూర్పు దక్కన్‌లోని శాతవాహనుల రాజధానిగా ఉన్న నాగార్జునకొండ పురాతన బౌద్ధ క్షేత్రం. త్రవ్వకాల్లో 30 బౌద్ధ విహారాలు, వేల సంవత్సరాల  చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కళాఖండాలు శాసనాలు లభించాయి. కొన్నింటిని ఇప్పుడు సాగర్ జలాశయం మధ్యలో ఉన్న దీవిగా ఉన్న నాగార్జునకొండకు తరలించారు. మరి కొన్నింటిని సమీపంలోని ప్రధాన భూభాగమైన అనుపు గ్రామానికి తరలించారు.   ఇది బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు  నడయాడిన  ప్రాంతం.   గౌతమి  పుత్ర  శాతకర్ణికి  రాజగురువు  ఆచార్య  నాగార్జునుడు.   ఆయన  పేరు మీద  నాటి  నెహ్రు ప్రభుత్వం   నాగార్జున  సాగర్  అని  పేరు పెట్టింది.   శంకుస్థాపన  సమయంలో నెహ్రూ  మాట్లాడుతూ ఇటువంటి  సాగునీటి  ప్రాజెక్టులు  భారతదేశానికి  ఆధునిక  దేవాలయాలు  అని  వ్యాఖ్యనించారు.   పాపం  పిచ్చోడు  నెహ్రు   ఒక  భారీ గుడి కట్టి   ఈ దేశానికి ఇది  చాలు  ఇంకేం  అవసరం లేదు అని చెప్పకపోవడం  అమాయకత్వం  కాక  మరేమిటి?   ఎవరి కావాలండీ   ప్రాజెక్టులు,  అభివృద్ది !   మనకు  మన  కులపోడు  ముఖ్యం   మన  మత పోడు  ముఖ్యం  అదే కదా  నడుస్తున్న  భారత  దేశ చరిత్ర! సరే  అసలు  విషయానికి  వద్దాం. వాసిరెడ్డి  ప్రసాద్ యాభై రెండు లక్షల రూపాయలు మాచింగ్ గ్రాంటుగా ప్రాజెక్టు నిర్మాణానికి  విరాళం ఇచ్చాడు. 55 వేల  ఎకరాలు  పాజెక్టు కోసం  దానం ఇచ్చాడు . నాటికి  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి ఆనకట్ట... నాగార్జున సాగర్ డ్యామ్. ఇంజనీర్ కానూరి లక్ష్మణరావు. కేఎల్ రావ్‌గా  ప్రసిద్ది. ఆయన పర్యవేక్షణలో  పూర్తిగా స్థానిక పరిజ్ఞానంతో నిర్మించబడిన  సాగర్  1967న 4 ఆగస్టు నాటి  ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కుడి ఎడమ కాలువలకు రిజర్వాయర్ నీటిని విడుదల చేశారు. రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్  కల సాకారం  అయి 57 సంవత్సరాలు పూర్తయింది. ఈ స్క్రిప్ట్ రాసే సమయంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఫోన్ చేశారు . ఏం చేస్తున్నారు మిత్రమా అని అడిగితే నాగార్జునసాగర్ నిర్మాణం జరిగి నేటికి  57 సంవత్సరాలు రాజు గారు   వార్త ప్రిపేర్ చేస్తున్నాను అని చెబితే !  సాగర్  నిర్మాణంలో  కమ్మవారి  పాత్ర  చెప్పొద్దు! నా ఫ్రెండ్  జగన్ రెడ్డికి తెలిస్తే  తెలిస్తే సాగర్ కూల్చే  ఏర్పాటు చేస్తాడు అని కామెంట్ చేశారు.

బందరు పిచ్చోడికి అలా అర్ధమైందట!

ఓటమి తరువాత వైసీపీ నేతలకు మైండ్ పోయినట్లుంది.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సుపరిపాలన దిశగా వేగంగా వెస్తున్న అడుగులతో వాళ్లకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు. దీంతో  వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రామా అన్నా వారికి బూతుగానే వినిపిస్తోంది. ఆ కోవలో వైసీపీ అధినేత జగన్ తరువాత ముందుగా చెప్పుకోవలసింది వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గురించి.  పార్టీ ఓటమి తరువాత వైసీపీ తరఫున మాట్లాడేవాళ్లే కరవయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం, బూతులతో, అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే  రోజా, సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వంటి వారంతా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఇక జగన్ తరఫున మాట్లాడడానికి, మీడియా ముందుకు రావడానికి వైసీపీకి పేర్ని నాని ఒక్కరే మిగిలినట్లు కనిపిస్తున్నది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి ఇష్టారీతిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు, జనసేన అధినేతపై నోటికొచ్చిందల్లా మాట్లాడేవారు.  ఇంత మాట్లాడిన ఆయనకు ఎన్నికలలో పోటీ చేసే ధైర్యం మాత్రం లేకపోయింది. అందుకే మచిలీపట్నం నుంచి తాను తప్పుకుని తన వారసుడిని నిలబెట్టారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు పేర్ని నాని కుమారుడు కిష్టు కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో, అహంకారపూరిత వైఖరితో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని పరాజయం పాలయ్యారు. అది వేరే  సంగతి. ఇప్పుడు పేర్ని నాని అవసరం ఉన్నా లేకపోయినా మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నారు.   తాజాగా తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం (ఆగస్టు5) కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన తొలి కలెక్టర్ల సమావేశం ఇది. ఆ సమావేశంలో చంద్రబాబునాయుడు పాలనా పరమైన అంశాలలో కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. శాఖల వారీగా సమీక్షలు నిర్వహించారు. సమస్యల పరిష్కారంలో వేగంగా పని చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధామ్యాలును వివరించారు. ఆ సందర్భంగా చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. అందులో తప్పేమీ లేదు. కలెక్టర్లు ఉన్నది కూడా ప్రజలకు సేవ చేయడానికే కదా? అలాగే స్థానిక సమస్యల సత్వర పరిష్కారం విషయంలో ప్రజా ప్రతినిథులతో సమన్వయం చేసుకోవాలని, స్థానిక ప్రజా ప్రతినిథులతో  ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని సమస్యల పరిష్కారం విషయంలో వేగంగా పని చేయాలని సూచించారు. అందులోనూ తప్పేమీ లేదు. కానీ పేర్ని నానికి మాత్రం ప్రజా పాలన సజావుగా సాగడమే తప్పుగా కనిపించింది. చంద్రబాబు తమ పార్టీ నేతలు ఏం చెబితే అది చేయాలని కలెక్టర్లను ఆదేశించారంటూ గగ్గోలు పెడుతున్నారు. అలా కలెక్టర్ల సమావేశం పూర్తయ్యిందో లేదో ఇలా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పేర్ని నాని.. తన ఫేక్ ప్రాపగాండాను ఆరంభించేశారు. చంద్రబాబు కలెక్టర్లను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పినట్లు నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారంటూ గుండెలు బాదేసుకున్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన అధికారులు, రాజకీయ నాయకులు ఆ ప్రజల సమస్యలపై సమన్వయంతో పని చేయాలనడం తప్పెలా అవుతుందో పేర్ని నానికే తెలియాలి. అయితే వైసీపీ స్టైలే ఇది.. ఫేక్ ప్రచారంతో జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తారు. 2014 నుంచి 2019 వరకూ అదే చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే మొదలెట్టేశారు. అయతే ఒక సారి నమ్మి మోసపోయిన జనం మరోసారి ఇటువంటి ప్రాపగాండాను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మరన్న విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు.  

బంగ్లాదేశ్‌లో విధ్వంసం వెనుక పాక్.. భార‌త్‌కు ఎదురుదెబ్బే!

బంగ్లాదేశ్‌లో విధ్వంసం వెనుక పాకిస్థాన్ కుట్ర ఉందా.. రిజర్వేషన్ల వివాదంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల ఆందోళనల్లోకి ప్రతిపక్ష పార్టీనే కాకుండా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేరిపోయారా.. రాడికల్స్, పాకిస్థాన్ అనుకూల ఇస్లామిక్ గ్రూప్స్ విద్యార్థుల రూపంలో ఆందోళనలను డైవర్ట్ చేసి వంద‌లాది మంది చావుకు కార‌ణ‌మ‌య్యారా.. అంటే అవున‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. పాకిస్థాన్ అనుకూల ఉగ్ర‌వాద సంస్థ‌లు రిజ‌ర్వేష‌న్ నిర‌స‌న‌ల వెనుక దేశంలో విద్వంసం సృష్టించ‌డంతో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపుత‌ప్పాయి. దీంతో బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా దేశం వ‌దిలి పారిపోవాల్సి వ‌చ్చింది. అయితే, బంగ్లాదేశ్‌లో తాజా ప‌రిణామాలు భార‌త్ కు ఎదురుదెబ్బేన‌ని అంటున్నారు. ఎందుకంటే.. అధికారంలో ఉన్న షేక్ హసీనా ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్‌ అవామీ లీగ్ పార్టీ భారత్ దేశానికి అనుకూలంగా ఉంటూ వ‌స్తున్నది.  ఈ కార‌ణంగా పాక్ టెర్రరిస్ట్ సంస్థ ఐఏఎస్ రంగంలోకి దిగి పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉండే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్‌ ప్రభుత్వ ఏర్పాటు కావాలని కుట్ర‌ల‌ను అమ‌లు చేసింది. ఇదే స‌మ‌యంలో తెర‌పైకి వ‌చ్చిన రిజర్వేషన్ల అంశాన్ని అవకాశంగా మలుచుకుంది. ఇప్పుడు సైనిక పాలన రావడంతో,   బీఎన్‌పీ, జమాత్‌ పార్టీ బంగ్లాదేశ్‌లో అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయ‌ని పరిశీలకులు అంటున్నారు‌. అదే జ‌రిగితే.. పాకిస్థాన్‌, చైనాతోపాటు బంగ్లాదేశ్ కూడా భార‌త్ దేశానికి శ‌త్రు దేశంగా, పక్కలో బల్లెంగా మారే అవ‌కాశాలు ఉన్నాయి.  బంగ్లాదేశ్ లో ఈ ప‌రిస్థితి త‌లెత్తడానికి రిజ‌ర్వేష‌న్ల అంశం కార‌ణం. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంకోం పోరాడిన‌వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో 30శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ హ‌సీనా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వివాదాస్ప‌దం అయింది. స్వాతంత్ర్య పోరాటంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అవామీ లీగ్ పార్టీ (హ‌సీనా పార్టీ) మ‌ద్ద‌తుదారుల‌కే అది ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌నే వాద‌న మొద‌లైంది. దీంతో రిజ‌ర్వేషన్లు ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళ‌న బాట‌ప‌ట్టారు. రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ నెల‌రోజులుగా విద్యార్థులు ఆందోళ‌న చేస్తున్నారు. ప్ర‌భుత్వం ఈ నిర‌స‌న‌ల‌ను లైట్‌గా తీసుకోవ‌డంతో అవి  దేశం మొత్తం విస్త‌రించాయి. ప్ర‌తిప‌క్ష పార్టీ మ‌ద్ద‌తుతో దేశ‌ వ్యాప్తంగా ప్ర‌జ‌లు రోడ్ల‌పైకివ‌చ్చి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు ఉధృతం చేశారు. ఈ క్ర‌మంలోనే పాకిస్థాన్ అనుకూల ఉగ్ర‌వాద సంస్థ‌లు రంగంలోకి దిగి నిర‌స‌న‌ల మాటున విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లు, నిర‌స‌న‌కారుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు తలెత్తాయి. నెల రోజుల ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో దాదాపు 300 మందికి పైగా మ‌ర‌ణించారు. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రిజ‌ర్వేష‌న్లు 30శాతం నుంచి 5శాతంకు త‌గ్గించాల‌ని ప్ర‌భుత్వానికి సూచించింది. హ‌సీనా ప్ర‌భుత్వంకూడా అందుకు అంగీక‌రించిన‌ప్ప‌టికీ.. నిర‌స‌నకారులు శాంతించ‌ లేదు. హ‌సీనా రాజీనామా చేయాల‌ని ప‌ట్టుబ‌డుతూ పెద్ద ఎత్తున అల్ల‌ర్ల‌కు పాల్ప‌డ్డారు. ఈ తతంగం మొత్తాన్ని వెన‌క‌నుండి న‌డిపించింది పాకిస్థాన్ అనుకూల ఉగ్ర‌వాద సంస్థ‌లేన‌ని అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి.   ప్రధాని హ‌సీనా ఇటీవ‌ల మాట్లాడుతూ.. రిజ‌ర్వేష‌న్లకు నిర‌స‌న‌గా ఆందోళ‌నకారుల విధ్వంసం వెనుక ఉగ్ర‌వాదుల ప్ర‌మేయం ఉంద‌ని పేర్కొన్నారు కూడా.  ఉగ్ర‌వాదుల‌తో క‌లిసి బంగ్లాదేశ్ ప్ర‌దాన ప్ర‌తిపక్ష నేష‌న‌లిస్ట్  పార్టీతో పాటు, ఇటీవ‌ల‌ నిషేధానికి గురైన జ‌మాతే ఇస్లామి పార్టీ దేశంలో విధ్వంసానికి కార‌ణ‌మ‌ని హ‌సీనాతోపాటు ఆమె పార్టీ ప్ర‌తినిధులు కూడా చెబుతూ వ‌చ్చారు. అయినా, దేశంలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు క‌ట్ట‌డి చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం కావ‌డంతో.. నిరసనకారుల హింసాకాండ మరింత పెచ్చరిల్లింది.    ఏకంగా ప్రధాని ఇంటిని ముట్టడించేవరకూ వెళ్లింది. పరిస్థితి చేయి దాటి పోవడంతో చివరకు షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తన సోదరి షేక్ రెహానాతో కలసి ఆర్మీ హెలికాప్టర్‌లో దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. మొద‌ట భార‌త్ వ‌చ్చిన ఆమె.. త‌రువాత లండ‌న్ వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ లో దేశంలో సైనిక పాల‌న న‌డుస్తున్నది. ఈ విష‌యాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ అధికారికంగా ప్రకటించారు. తమ దేశంలో సైనిక పాలన ఉంటుందని, త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు  కృషి చేస్తామని తెలిపారు.  హ‌సీనా దేశం విడిచి వెళ్లిపోవ‌డంతో ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ స్పందించారు. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా కుటుంబ స‌భ్యుల ఒత్తిడి మేర‌కే హ‌సీనా దేశం విడిచిన‌ట్లు వెల్ల‌డించారు. తిరిగి ఆమె రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని చెప్పారు. హ‌సీనా దేశం విడిచి వెళ్లిన త‌రువాత ప్ర‌ధాని అధికారిక నివాస‌మైన‌ గ‌ణ‌భాబ‌న్ ను ఆందోళ‌న‌కారులు ముట్ట‌డించి విధ్వంసం సృష్టించారు. ఫ‌ర్నీచ‌ర్ ధ్వంసం చేశారు. బంగ్లా ప‌రిణామాల‌పై భార‌త్ నిశితంగా ప‌రిశీలిస్తుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల క్యాబినెట్ క‌మిటీ అత్య‌వ‌స‌ర భేటీ అయింది. పొరుగుదేశంలో తాజా ప‌రిస్థితులు, స్థానికంగా చేప‌ట్టాల్సిన భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌పై స‌మీక్ష జ‌రిపిన‌ట్లు తెలిసింది బంగ్లాదేశ్ లో నెల‌కొన్న‌ ఉద్రిక్త ప‌రిస్థితుల‌తో భార‌త్ - బంగ్లాదేశ్ మ‌ధ్య వాణిజ్యానికి తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది. నిత్యావ‌స‌రాలు మిన‌హా మిగిలిన వాణిజ్యం నిలిచిపోయింది.

జగన్‌తో అంటకాగారుగా.. అనుభవించండి!

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపి అరాచకాలకు కొమ్ముకాశారనే ఫిర్యాదులున్న రాజంపేట, తుళ్లూరు డివిజన్ల డీఎస్పీలు వీఎన్కే చైతన్య, ఈ.అశోక్ కుమార్ గౌడ్లపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీవేటు వేసింది. ఇద్దరికీ ఎక్కడా పోస్టింగు ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు డీజీపీ సీహెచ్. ద్వారకాతిరుమలరావు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై భౌతికదాడులకు దిగారని విమర్శలున్నాయి. తాడిపత్రిలో బాధితులు చైతన్యపై 23 ప్రైవేటు కేసులు దాఖలు చేశారు. రాజంపేటకు బదిలీపై వెళ్లి, అక్కడా అదే అరాచకాలు కొనసాగించారు. అర్ధరాత్రి వేళ తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలోకి చొరబడి టీడీపీ కార్యకర్తలపై లాఠీలతో దాడి చేశారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. జేసీ ఇంట్లో పనిచేసే దళితుడు, దివ్యాంగుడైన కిరణ్‌కుమార్‌ని ఇష్టానుసారం కొట్టారు.  ఇటువంటి రాక్షస పోలీసులపై చర్యలకు ఎన్ని రోజులు పడుతుంది.  చంద్రబాబుకు వున్న సహనం బాధిత ప్రజలకు  కూటమి కార్యకర్తలకు లేదు.  తప్పుడు అధికారులపై  కఠినంగా  ఉక్కుపాదం మోపి, ఒంటి మీద  ఖాకీ యునిఫాం తీయించకపోతే  రాక్షస పోలీసులకు  సాదారణ పోలీసులకు  తేడా ఏంటి  అని  ప్రజలు  ప్రశ్నిస్తున్నారు.  డీఎస్పీచైతన్యను కేవలం బదిలీ చేయడానికి  50 రోజుల సమయమా?  పైగా  ఆ నిర్ణయం  పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు చైతన్యను బదిలీ చేశారు. పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశం అవటానికి  50 రోజులు సమయం పట్టిందన్నమాట.  అంటే  అర్థం ఏంటి?  డీజీపీ  ద్వారకా తిరుమలరావు ప్రజలు ఆశించినంత వేగంగా పని చేయడంలేదు  అని అనుకోవాల్సిన పరిస్థితికి  అద్దం పడుతోంది.   మరో డీఎస్పి అశోక్ కుమార్ గౌడ్ నూజివీడు డీఎస్పీగా పనిచేసిన సమయంలో  వైసీపీకి కొమ్ముకాశారనే ఫిర్యాదులున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ని తీవ్రంగా వేధించారు. ఆయన్ని బహిరంగంగా హెచ్చరించారు. ఎన్నికలకు కొద్ది రోజులు ముందు అశోక్ కుమార్ గౌడ్ తుళ్లూరు డీఎస్పీగా నియమితులయ్యారు. ఎన్డీయే విజయం సాధించిన నేపథ్యంలో మందడంలో అమరావతి రైతులు బాణాసంచా కాల్చగా వారిపట్ల అశోక్ కుమార్ గౌడ్ దురుసుగా ప్రవర్తించారన్న ఫిర్యాదులున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో వైసీపీ మూకల దాడిపై కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఒక సీఐ, మరో ఇద్దరు ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. అప్పటి మంగళగిరి రూరల్ సీఐ భూషణంతోపాటు అప్పట్లో రూరల్ ఎస్సైలుగా పని చేసిన లోకేశ్, క్రాంతికిరణ్‌ను కూడా సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మంగళగిరిలోనే రెండు నెలలకు పైగా ఎస్సైలుగా పనిచేసిన విజయకుమార్ రెడ్డి, రమేష్ బాబులపై క్రమశిక్షణ చర్యలకు ఐజీ ఆదేశించారు. కేసు నమోదులోనే ఎన్నో లోపాలున్నాయని ఉన్నతాధికారులు గుర్తించారు. నాటి రూరల్ సీఐ భూషణం దర్యాప్తును అసలు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటిదాకా 18 మందిని అరెస్టు చేశారు. కొత్తగా వచ్చిన ఎస్పీ సతీష్ కుమార్ ఇటీవల మంగళగిరి రూరల్ స్టేషన్‌కి వెళ్లి సమగ్రంగా పరిశీలించి, లోపాలను గుర్తించారు. దాడి జరగ్గానే పోలీసులు ఆధారాలను పూర్తిస్థాయిలో సేకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అనంతరం దర్యాప్తులోనూ జాప్యం ప్రదర్శించారని ఆయన తేల్చారు. ప్రత్యక్ష సాక్షులుగా కూరగాయలు అమ్ముకునేవారి పేర్లను సీఐ భూషణం, పెట్టారని తెలుసుకుని ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. 2021లో కేసు నమోదైతే నిందితులను గుర్తించి, అరెస్టు చేయకుండా సీఐ భూషణం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎస్పీ తన నివేదికలో తప్పు పట్టినట్లు తెలిసింది.

నాకు రెస్పెక్ట్ కావాలి మొర్రో!

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ వైసీపీ  శాసనసభా పక్ష నేత వైఎస్ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యం విచారణార్హతపై కౌంటర్ వేయాలని శాసన వ్యవహారాలు, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్‌కి విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరఫు సీనియర్ న్యాయవాది చెబుతున్నందున దీనిపై వివరాలు సమర్పించాలంటూ అసెంబ్లీ, స్పీకర్ కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. వ్యాజ్యం విచారణార్హతకు లోబడి ఈ ఉత్తర్వులుంటాయని పేర్కొంది. మరోవైపు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసన వ్యవహారాల మంత్రి  పయ్యావుల కేశవ్‌కు  నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మంగళవారం ఉత్తర్వులిచ్చారు.  అసెంబ్లీలో ప్రతి పక్ష నేత హోదా ఇచ్చేలా శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పైమంగళవారం జరిగిన విచారణలో ఆయన తరఫున  న్యాయవాది ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు పిటిషనర్ అర్హుడని చెప్పగా, న్యాయమూర్తి స్పందిస్తూ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేనందున, వ్యాజ్యంపై లోతైన విచారణ జరపాల్సి ఉందన్నారు. ప్రతివాదులు కౌంటర్ వేయాలని ఆదేశిస్తామన్నారు. శాసన వ్యవహారాలు, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, 'అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదు. కౌంటర్ వేసేందుకు మాకు సమయమివ్వండి. వ్యాజ్యం లోతుల్లోకి వెళ్లే ముందు విచారణార్హతను తేల్చాలన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి కేశవ్‌లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చడం అభ్యంతరకరం' అని వాదించారు. ప్రతిపక్ష నేత హోదాపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరని న్యాయమూర్తి ప్రశ్నించగా, 'స్పీకర్' అని ఏజీ బదులిచ్చారు. జగన్ తరపు  న్యాయవాది శ్రీరామ్ వాదనలు  కొనసాగిస్తూ ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని స్పీకర్‌కి వినతిపత్రమిచ్చాం. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్పీకరుకు న్యాయస్థానం నోటీసు ఇవ్వడంపై ఎలాంటి నిషేధం లేదు. మహారాష్ట్రలో స్పీకరుకు సుప్రీం కోర్టు నోటీసు ఇచ్చిన సందర్భముంది. ఈ కేసులోనూ స్పీకర్ కార్యదర్శికి నోటీసు ఇచ్చి మా విజ్ఞప్తిపై ఏ నిర్ణయం తీసుకున్నారో స్పష్టత కోరాల'ని పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. స్పీకర్‌కి జగన్ విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నందున ఏం నిర్ణయం తీసుకున్నారో చూద్దామన్నారు. అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శికి నోటీసులు జారీచేశారు.  అయితే ఈ వ్యవహారంలో న్యాయ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. న్యాయవ్యవస్థ తన పరిధి దాటి శాసన వ్యవస్థలోకి ఎలా చొచ్చుకు రాగలుగుతుంది అనేది ప్రశ్న..! అసెంబ్లీకి అధిపతి స్పీకర్. శాసన వ్యవస్థ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ.  కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జ్యూడిషరీ శాసన వ్యవస్థ నిర్ణయాలని తప్పుపడుతుంది అది ఎప్పుడూ...  ప్రాథమిక హక్కులకు భంగం కలిగింది అని అనుకున్నప్పుడు.  ఇక్కడ ఆ ప్రశ్న ఉత్పన్నం కాలేదు . జగన్ పిటిషన్‌కు అసలు విచారణ అర్హత లేదు అనేది ఏజీ దమ్మాలపాటి వాదన.  స్పీకర్ చేయాల్సిన నిర్ణయాన్ని కోర్టే చేసి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కల్పించండి అని స్పీకర్ ను ఆదేశిస్తుందా..? ఒకవేళ ఆదేశిస్తే స్పీకర్ ఆ అంశాన్ని పక్కన పెడితే ఏమవుతుంది ? స్పీకర్‌ని హైకోర్టు బోనులోకి పిలిపించి నిల్చోపెడుతుందా? అంటే అది రాజ్యాంగ సంక్షోభం దిశగా అడుగులు పడ్డట్టే లెక్క.  ప్రతిపక్ష నాయకుడు అనేది చట్టబద్ధమైన స్థానం తప్ప 10% రూల్ అనేది చట్టంలో లేదు. భారత పార్లమెంటు సభలలో ప్రతిపక్ష నాయకుడు అనేది ఒక చట్టబద్ధమైన పదవి. ఈ పోస్ట్ పార్లమెంట్ చట్టం, 1977లో ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల కోసం  ప్రతిపక్షంలో సంఖ్యాపరంగా అతిపెద్ద పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు హోదాగా నిర్వచించింది. ఆ గుర్తింపు స్పీకర్ లేదా  చైర్మన్ ద్వారా గుర్తించబడుతుంది.  మోడీ మొదటిసారి ప్రధాని అయిన 2014 నుంచి 2019 వరకు  రెండోసారి ప్రధాని అయిన 2019 నుండి  2024 వరకు  నాటి పార్లమెంట్ స్పీకర్  కాంగ్రెస్ పార్టీకి  ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు! పది సంవత్సరాల పాటు  కాంగ్రెస్‌కు  ప్రతిపక్ష హోదా లేకుండానే  ప్రజా క్షేత్రంలో  పోరాటం చేసింది.  మొన్న జరిగిన  ఎన్నికల్లో  ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ సాధించింది.  రాహుల్ గాంధీ  నాకు  రెస్పెక్ట్ కావాలి అని  గోల గోల చేయలేదే!  కోర్టు మెట్లు ఎక్కలేదే!  కాని  ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం  జగన్  రెడ్డి  నాకు  రెస్పెక్ట్ కావాల్సిందే అని  కోర్టుకు ఎక్కారు.  ప్రజలే  ఇవ్వని  రెస్పెక్ట్ కోసం కోర్టు ద్వారా రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. రెస్పెక్ట్ అనేది కొనుక్కుంటేనో కోరుకుంటేనో  వచ్చేది కాదు! అది ఎదుటి వారు ఇచ్చేది అనే సూక్ష్మం జగన్మోహన్ రెడ్డి గ్రహించలేకపోవటం విషాదం.  అదేదో సినిమాలో  బ్రహ్మానందం నాకు  రెస్పెక్ట్ కావాలని  ప్రేక్షకులను  నవ్విస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా దానికి ఒక పక్కా లెక్క ముందస్తు ప్రణాళిక వ్యూహం ఉంటాయి. దీంట్లో జగన్ ఎత్తులు పై ఎత్తులు ఏంటో జరగబోయే పరిణామాలేంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.

అబ్దుల్ కలామ్ కంటే జగనే గొప్పా?.. వీళ్లింక మారరా?

వైసీపీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరింది. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పినా వారిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్ర‌పంచంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కంటే గొప్ప‌వారు ఎవ‌రూ ఉండ‌ర‌న్న రీతిలో కొంద‌రు వైసీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో తాజాగా ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం తీసుకున్న కీల‌క నిర్ణ‌యం ప‌ట్ల వారు అభ్యంత‌రం తెలుపుతున్నారు. గత ప్రభుత్వ  హయాంలో విద్యాశాఖ‌లో అమ‌లు చేసిన ప‌థ‌కాల‌కు జ‌గ‌న‌న్న పేరు పెట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం ఆ ప‌థ‌కాల పేర్లు మార్చేసింది. కొత్త పేర్లు పెట్టింది. దేశంలో, రాష్ట్రంలో ప‌లు రంగాల్లో గుర్తింపు పొందిన ప్ర‌ముఖుల పేర్ల‌ను ఆ ప‌థ‌కాల‌కు పెడుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యంతో ఏపీ ప్ర‌జ‌లు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు. కానీ, కొంద‌రు వైసీపీ నేత‌లు మాత్రం ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. దేశంలోని ప‌లు రంగాల్లో గుర్తింపు పొందిన ప్ర‌ముఖుల కంటే మా జ‌గ‌న‌న్నే గొప్ప‌.. మా జ‌గ‌న‌న్న పేరుపై ఉన్న ప‌థ‌కాన్ని ఎందుకు తీసేశారంటూ గగ్గోలు పెడుతున్నారు. మా ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత మ‌ళ్లీ జ‌గ‌న‌న్న పేరుతో ప‌థ‌కాలు అమ‌లు చేస్తామంటూ   వివిధ ఛాన‌ళ్ల డిబేట్ల‌లో  ఆవేశపడిపోతున్నారు.   వైసీపీ నేత‌ల తీరు పట్ల ప్రజలలో అసహనం వ్యక్తం అవుతోంది.  వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యాశాఖ‌లో జ‌గ‌న‌న్న అమ్మఒడి, జ‌గ‌న‌న్న విద్యాకానుక‌, జ‌గ‌న‌న్న గోరుముద్ద‌, మ‌న‌బ‌డి నాడు- నేడు, స్వేచ్ఛ‌, జ‌గ‌న‌న్న ఆణిముత్యాలు వంటి ప‌థ‌కాల‌ను అమ‌లు చేసింది. ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం ఆ ప‌థ‌కాల‌కు పేర్ల‌ను మార్పు చేసింది. దేశానికి విశేష సేవ‌లందించిన ప‌లువురు భార‌త‌మాత ముద్ద‌బిడ్డ‌ల పేర్లతో ఆ పథకాలకు నామకరణం చేసింది.  స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్‌, అబ్దుల్ క‌లాం, డొక్కా సీత‌మ్మ తదితర గొప్పగొప్ప వారి పేర్లను ఆయా పథకాలకు పెట్టింది.   జ‌గ‌న‌న్న అమ్మఒడి పథకానికి త‌ల్లికి వంద‌నంగానూ  , జ‌గ‌న‌న్న విద్యాకానుక‌ పథకానికి స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ విద్యార్థి మిత్రగానూ పేర్లు మార్చింది. అలాగే  జగనన్న గోరు ముద్ద పథకాన్ని  డొక్కా సీత‌మ్మ మ‌ధ్యాహ్న బ‌డి భోజ‌నంగా మార్పు చేసింది, మ‌న బ‌డి నాడు- నేడు పథకానికి మ‌న బ‌డి - మ‌న భ‌విష్య‌త్తు గా పేరు మార్చింది. స్వేచ్ఛ పథకం పేరును బాలికా రక్షగా మార్చింది.  జగనన్న ఆణిముల్యాలు పథకం పేరును అబ్దుల్ క‌లాం ప్ర‌తిభ పుర‌స్కారంగా మార్పు చేసింది. ఈ విష‌యాన్ని విద్య, ఐటీ శాఖ‌ల‌ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ద్వారా తెలియ‌జేశారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్నిప్ర‌జ‌లు స్వాగతిస్తున్నారు. విద్యాశాఖ‌కు సంబంధించిన ప‌థ‌కాల‌కు ప్ర‌ముఖుల పేర్లు పెట్ట‌డం ముదావహం, శుభపరిణామం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా గోప్పవారి పేర్లు ఆయా పథకాలకు పెట్టడం ద్వారా  వారి జీవిత చ‌రిత్ర‌ల గురించి విద్యార్థుల‌కు పూర్తి అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంద‌ని విద్యావేత్త‌లు అభిప్రాయ ప‌డుతున్నారు. తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యం ప‌ట్ల అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నా కొంద‌రు వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేరు తొల‌గించార‌ని తెగ‌బాధ‌ప‌డిపోతున్నారు. అబ్దుల్ క‌లాం, స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ కంటే జ‌గ‌న్ గొప్ప‌వాడు అన్న‌రీతిలో మాట్లాడుతున్నారు.  విద్యాశాఖ‌లోని ప‌థ‌కాల‌కు పేర్లు మార్పుపై జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతోషం వ్య‌క్తం చేశారు. త‌న సంతోషాన్ని ఎక్స్ ద్వారా తెలియ జేశారు. భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని అన్నారు. ప‌థ‌కాల‌కు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లు పెట్ట‌డం ప‌ట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కు  జనసేనాని అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళంపాడి విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించేలా గొప్పగొప్ప మహానుభావుల పేర్లతో పథకాలు అమలు చేయడం మంచి పరిణామం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటు ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు చంద్ర‌బాబు, లోకేశ్ నిర్ణ‌యాన్ని ప్ర‌శంసిస్తున్నారు. అయితే ఊరందరిదీ ఒకదాని.. ఉలిపికట్టది ఒక దారి అన్నట్లుగా కొంద‌రు వైసీపీ నేత‌లు మాత్రం ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతున్నారు.  మా జ‌గ‌న‌న్న పేరును ఎందుకు తొల‌గించారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఓ అడుగు ముందుకేసి మ‌ళ్లీ మా ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌స్తుంది. అప్పుడు మ‌ళ్లీ జ‌గ‌న‌న్న పేర్లు పెడ‌తామంటూ చెబుతున్నారు. వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల విచిత్ర ప్ర‌వ‌ర్త‌న‌ను జనం చీద‌రించుకుంటున్నారు.

బెంగ‌ళూరులోనే జగన్ మకాం.. శ‌వం ఉంటేనే ఆంధ్రాకు!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాన‌సిక స్థితి స‌రిగా లేన‌ట్లు క‌నిపిస్తోంది. హ‌త్య‌లు, దాడుల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టి మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని భావించిన ఆయ‌న‌కు ఎన్నిక‌ల్లో గ‌ట్టి షాక్ త‌గిలింది. ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌తో విసిగిపోయిన ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదని నిర్ద్వంద్వంగా తేల్చేశారు. అధికారంలో ఉన్న‌ప్పుడే జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితిపై కొంద‌రు వైసీపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఘోర‌ ఓట‌మి త‌రువాత ఆయ‌న ఎప్పుడు ఏం చేస్తున్నారో అర్థంకావ‌డం లేద‌ని ఆ పార్టీ నేత‌లు తలలుబాదుకుంటున్నారు. నూత‌నంగా అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేశం  ప్ర‌భుత్వానికి పాల‌నాప‌రంగా స‌ర్దుబాటు కావ‌టానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. దీంతో ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఏ పార్టీ అయినా క‌నీసం ఓ ఆర్నెళ్లు త‌న రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌ను ముమ్మ‌రం చేసేందుకు స‌మ‌యం తీసుకుంటుంది. త‌ద్వారా ఆ స‌మ‌యంలో అధికార పార్టీ వ్య‌వ‌హార‌శైలిని బ‌ట్టి రాజ‌కీయంగా ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు వ్యూహాల‌కు ప‌దునుపెడుతుంటారు. కానీ, జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి సంప్ర‌దాయ రాజ‌కీయాల‌కు భిన్నంగా ఉంది. అధికారం కోల్పోయిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా క్షీణించాయ‌ని, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేస్తున్నారంటూ జ‌గ‌న్ గ‌గ్గోలు పెడుతున్నారు. ఓ ప‌క్క రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణంతో ప్ర‌జ‌లు సంతోషంగా ఉంటే.. జ‌గ‌న్, కొంద‌రు వైసీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. అధికారం కోల్పోయిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని భ‌యం వెంటాడుతోంది. ఐదేళ్ల కాలంలో తానుచేసిన అరాచ‌క పాల‌న‌ను గుర్తుచేసుకుంటున్న జ‌గ‌న్‌.. కూట‌మి ప్ర‌భుత్వంకూడా అదే ప‌ద్ద‌తిని పాటిస్తుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు‌. కానీ, సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధే ల‌క్ష్యంగా పాల‌న‌పై దృష్టిపెట్టారు. రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఉంటే పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీల ప్ర‌తినిధులు ముందుకొస్తార‌ని, త‌ద్వారా ఉపాధి అవ‌కాశాలు పెరిగి, రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంద‌ని భావిస్తున్నారు. ఎన్డీయేలో భాగ‌స్వామిగా ఉండ‌టంతో కేంద్రం నుంచి వీలైన‌న్ని ఎక్కువ‌ నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జ‌రిగేలా చంద్ర‌బాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే రాష్ట్రంలో అభివృద్ధిని చూసి త‌ట్టుకోలేపోతున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లి ప్యాలెస్ లో ఉండ‌లేక పోతున్నారు‌. దీంతో చీటికిమాటికి బెంగ‌ళూరులోని ఆయ‌న ప్యాలెస్‌కు వెళ్తున్నాడు.  అధికారం కోల్పోయిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టికే రెండు సార్లు బెంగ‌ళూరులోని ఆయ‌న ప్యాలెస్‌కు వెళ్లారు. కొద్దిరోజులు అక్క‌డే ఉన్నారు. ఇటీవ‌ల రాష్ట్రానికి వ‌చ్చిన ఆయ‌న‌.. శ‌వ రాజ‌కీయం పూర్త‌యిన త‌రువాత‌.. మ‌ళ్లీ స‌తీస‌మేతంగా బెంగ‌ళూరు వెళ్లారు. బెంగ‌ళూరులో జ‌గ‌న్ వెళ్లేది ఆయ‌న‌ సొంత ఇంటికే అయినా.. అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఒక్క‌సారి కూడా అక్కడకు వెళ్ల‌ని జ‌గ‌న్‌ ఇప్పుడు చిటికీ మాటికీ బెంగళూరు వెళ్ల‌డానికి కార‌ణం ఏమిట‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ వర్గాల్లో జ‌రుగుతోంది. అందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి. ప్ర‌జ‌లు ఘోరంగా ఓడించ‌టాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు..   చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన 50రోజుల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉరుకులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా కూట‌మి ప్ర‌భుత్వంలో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ ప్యాలెస్ కూడా అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలోనే ఉంది. ప్ర‌స్తుతం ఆ ప్రాంతం నిత్యం ర‌ద్దీగా మారింది. తనకు నచ్చని అమరావతి రాజధాని పనులు తన కళ్లముందే వేగంగా జరుగుతుండటంతో జగన్ ఓర్వలేకపోతున్నారు. అందుకే అక్కడ ఉండలేకపోతున్నారని   వైసీపీ నేతలే చెబుతున్నారు. ఈ కారణంగా జగన్ బెంగళూరులో  ప్యాలెస్ లోనే మకాం వేస్తున్నారు.   బెంగళూరు నుంచే రాష్ట్రంలో ఘర్షణలకు జగన్ ప్లాన్ చేస్తున్నారని తెలుగుదేశం కూటమి పార్టీల్లోని నేతలు ఆరోపిస్తున్నారు. తద్వారా శవ రాజకీయాలతో రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని దేశ ప్రజలను నమ్మించేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల ప్రతినిధులు ఏపీ వైపు చూడకుండా జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు.    జగన్ కు తాడేపల్లితోపాటు హైదరాబాద్ లోనూ ఓ ప్యాలస్ లాంటి నివాసం ఉంది. గతంలో ఎక్కువగా జగన్ హైదరాబాద్ లోనే నివాసం ఉండేవారు. కానీ, ప్రస్తుతం హైదరాబాద్ వెళ్లేందుకు కూడా జగన్ ఇష్టపడటం లేదు. ఎందుకంటే.. తెలంగాణ   ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండటమే కారణం. రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు శిష్యుడిగా జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో పలు సందర్భంగాల్లో రేవంత్ ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం గ‌త ఐదేళ్ల జగన్ పాలనలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తుండ‌టంతో ఎప్పుడైనా త‌న‌ను అరెస్టు చేయొచ్చ‌ని కూడా జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారు‌. ఏపీలో ఉన్నా.. హైదరాబాద్ లో ఉన్నా తనకు ఇబ్బంది ఉంటుందని భావిస్తున్న జగన్.. బెంగళూరులో ఉండటమే సేఫ్ గా భావిస్తున్నారు. బెంగళూరులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే, అక్కడి డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఉన్నారు. డీకేతో వైఎస్ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా జగన్ బెంగళూరులోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఏపీకి కేవలం శవ రాజకీయాలు చేయడానికే మాత్రమే జగన్ వస్తారన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.

ఏపీ అసెంబ్లీలో తమాషా సంఘటన!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమాషా సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి మీద శ్వేతపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం కేసులు పెట్టిన వాళ్ళు లేచి నిల్చోండి అన్నారు. దాంతో పవన్ కళ్యాణ్‌తో సహా మెజారిటీ సభ్యులు లేచి నిల్చున్నారు. దాంతో సభలో నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం వీళ్ళని లోపల వేయాలని కేసులు పెట్టింది. కానీ ప్రజలు వీళ్ళని అసెంబ్లీకి పంపించారు అని అన్నారు. ఆ తర్వాత కేసులేవీ లేని వాళ్ళు లేచి నిల్చోండి అని అడిగారు. అప్పుడు చాలా కొద్దిమంది మాత్రమే లేచి నిల్చున్నారు. ‘మీరు అదృష్టవంతులు’ అని చంద్రబాబు ఈ సందర్భంగా చమత్కరించారు.

గురివింద అమెరికా!

గురివింద గింజ సామెత చాలామందికి తెలిసే వుంటుంది. ‘‘అబ్భ.. నేనెంత ఎర్రగా వున్నానో’’ అని గురివింద గింజ అనుకుంటూ వుంటుందట. కానీ, తన డాష్ కింద ఏముందో తనకి తెలియదట. అగ్రరాజ్యంలాగా ప్రపంచం మీద ఆధిపత్యం చేయాలని చూసే అమెరికా పరిస్థితి కూడా గురివింద గింజ మాదిరిగానే తయారైంది. తమ దేశంలో తప్ప మిగతా ప్రపంచంలో ఎక్కడా భద్రత వుండదని భావిస్తూ వుంటుంది. అందుకే, అప్పుడప్పుడు వివిధ దేశాలలో వున్న తన పౌరులకు భద్రతపరమైన సూచనలు ఇస్తూ వుంటుంది. ఆ సూచనలు ఎలా వుంటాయంటే, అమెరికా చాలా సేఫెస్ట్ ప్లేస్... మిగతా ప్రపంచం అంతా దారుణాలకు నిలయం అన్నట్టుగా వుంటాయి. లేటెస్ట్.గా ఇండియాలో వున్న తమ పౌరులకు అమెరికా కొన్ని భద్రతాపరమైన సూచనలు చేసింది. ఇండియాలో ఏయే ప్రాంతాలకు అమెరికా పౌరులు వెళ్ళొద్దో సూచిస్తూ ఒక పెద్ద లిస్టు విడదల చేసింది. ఆ లిస్టుని ఎవడైనా ఎరగని వాడు చూశాడంటే, ఇండియాకి రావడానికి కూడా భయపడిపోతాడు. అమెరికా రిలీజ్ చేసిన లిస్టు ప్రకారం దేశంలోని చాలా రాష్ట్రాలకు అమెరికా పౌరులు వెళ్ళకూడదు. వెళ్ళాల్సివస్తే రాజధానులకు మాత్రమే వెళ్ళాలి. ఈ స్టేటు, ఆ స్టేటు అని కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలనూ అమెరికా తన లిస్టులో పేర్కొంది. కొన్ని రాష్ట్రాలకు వెళ్తే తీవ్రవాదుల సమస్యట, మరికొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టు సమస్య వుందట. అదే విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ వుంటాయి కాబట్టి అటువైపు వెళ్ళనే వెళ్ళొద్దట... అంత దారుణంగా వుంది ఈ లిస్టు.  నిజానికి అమెరికా పౌరులు ఇండియాలో ఏ రాష్ట్రానికైనా నిస్సంకోచంగా వెళ్ళవచ్చు.. తమదేశం అమెరికా వెళ్ళడానికే భయపడాలి.. ఆలోచించాలి. ఎందుకంటే, అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా వుంది. ఎవడికి ఎప్పుడు బుద్ధి పుట్టినా, తన జేబులోంచి రివాల్వర్ తీసి ఎవరు కనబడితే వాళ్ళని కాల్చిపారేస్తూ వుంటాడు. మొన్నీమధ్యే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద హత్యాయత్నం కూడా జరిగింది. ప్రపంచంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు వుంటాయేమో.. అమెరికాలో అణువణువునా ఉద్రిక్తమే. జేబులో రివాల్వర్ వున్న ప్రతి ఒక్కడూ ఉగ్రవాదే. అందువల్ల ఇతర దేశాలకు భద్రత విషయంలో సర్టిఫికెట్లు ఇవ్వడం మానుకుని, తమ దేశంలో భద్రత గురించి అమెరికన్లు ఆలోచించుకుంటే మంచిది.

అమరావతికి పోటీగా రేవంత్ ‘మాస్టర్ ప్లాన్’!

గత పన్నెండు సంవత్సరాల నుంచి హైదరాబాద్, హైదరాబాద్ పరిసర ప్రజలు రెగ్యులర్‌గా వింటున్న మాట ‘మాస్టర్ ప్లాన్’. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో మొత్తం ఐదు మాస్టర్ ప్లాన్స్ వున్నాయి. వాటిని మొత్తాన్నీ మిక్స్ చేసి హెచ్ఎండీఏ పరిధి వరకు సరికొత్త ‘మాస్టర్ ప్లాన్’ని తీసుకురావాలన్నది నాయకుల ప్లాన్. మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతున్నాం.. రెండు మూడు నెలల్లో వచ్చేస్తుంది అని పన్నెండు సంవత్సరాల నుంచి నాయకులు, అధికారులు ప్రకటిస్తూనే వున్నారుగానీ, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి వుంది. ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ విడుదలైంది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో వున్న దాదాపు పదేళ్ళ కాలంలో సంవత్సరానికోసారి ‘ఇదిగో మరో మాస్టర్ ప్లాన్ వచ్చేస్తోంది’ అంటూ ఊరిస్తూ వచ్చారే తప్ప పని జరగలేదు.  ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పథంలో దూసుకువెళ్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలర్ట్ అయినట్టు సమాచారం. పన్నెండేళ్ళుగా అంగుళం కూడా ముందుకు కదలని మాస్టర్ ప్లాన్ అంశాన్ని ఈ ఏడాది చివరికి ఒక కొలిక్కి తేవడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరాంతానికి కొత్త సమగ్ర మాస్టర్ ప్లాన్‌ని ప్రకటించాలన్నది రేవంత్ రెడ్డి లక్ష్యం. లేటెస్ట్.గా అమరావతికి కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయలను గ్రాంట్‌గా ప్రకటించిన నేపథ్యంలో అలెర్ట్ అయి హైదరాబాద్ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం వుందని రేవంత్ రెడ్డి గుర్తించారు. దీనికి తొలి అడుగుగా సమగ్ర మాస్టర్ ప్లాన్‌ని రూపొందించాలని సంకల్పించారు. అసలు ‘సమగ్ర మాస్టర్ ప్లాన్’ వల్ల ఉపయోగాలు ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే, ప్రధాన నగరం మీద ఒత్తిడి తగ్గుతుంది. సరికొత్త నివాస ప్రాంతాలు, సరికొత్త వ్యాపార ప్రాంతాలు, సరికొత్త పారిశ్రామిక ప్రాంతాలు పెరుగుతాయి. తద్వారా నగర అభివృద్ధి విస్తృతం అవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుంది. అమరావతి ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద పడకుండా వుండాలంటే యథాతథ స్థితిని కొనసాగించడం కాకుండా, హైదరాబాద్ చుట్టూ సరికొత్త అవకాశాలను సృష్టించాలి. అప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెనుకబడకుండా వుంటుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈసారి మాత్రం సమగ్ర మాస్టర్ ప్లాన్ విషయంలో చాలా పట్టుదలగా వున్నట్టు తెలుస్తోంది. మరి ఈ పట్టుదల గత ప్రభుత్వం ‘పట్టుదల’ మాదిరిగా మాటలకే పరిమితం అవుతుందో, ఆశించిన ఫలితాలను తెస్తుందో వేచి చూడాలి.

‘హు కిల్డ్ బాబాయ్?’కి సమాధానం దొరకబోతోంది!

తెలుగు ప్రజలను గత ఐదేళ్ళుగా సమాధానం దొరక్కుండా వేధిస్తున్న ప్రశ్న ‘హు కిల్డ్ బాబాయ్?’ బేతాళుడి ప్రశ్నలకు సమాధానాలు విక్రమార్కుడు చెప్పేవాడు. కానీ ‘హు కిల్డ్ బాబాయ్’ అనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం చెప్పేవారు ఎవరూ లేరు. ఈ ప్రశ్నకు త్వరలో సమాధానం దొరకబోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘వివేకా హత్యకేసు ఎన్నో మలుపులు తిరిగింది. హత్య జరిగిన తర్వాత ఘటనా స్థలికి సీఐ వెళ్ళారు. సీబీఐకి వాస్తవాలన్నీ తెలియజేయడానికి ఆయన సిద్ధమయ్యారు. కానీ, ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సీఐకి ప్రమోషన్ ఇచ్చింది. విచారణాధికారి మీద కేసు పెడితే హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అసలు నేరస్థుడు ముఖ్యమంత్రి కావడంతో పోలీసులు కూడా వంత పలకాల్సిన పరిస్థితి వచ్చంది. వివేకా హత్యకేసు నిందితులను అరెస్టు చేయడానికి వెళ్ళిన సీబీఐ సిబ్బంది ఏమీ చేయలేక వెనుదిరిగారు. గతంలో ఈ కేసు విషయంలో ఎన్నో అవరోధాలు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. త్వరలో ‘హు కిల్డ్ బాబాయ్?’ అనే ప్రశ్నకు సమాధానం దొరకబోతోంది’’ అన్నారు.

మంచితనం ఒక్కటే చాలదు బాబూ.. కాఠిన్యమూ ఉండాలి!

రాజ్యాన్ని పాలించే రాజుకు మంచిత‌నం మాత్ర‌మే ఉంటే స‌రిపోదు.. ఎప్పుడూ ప్ర‌జ‌ల అభివృద్ధికోసం ఆలోచించ‌డ‌మే కాదు.. రాజ్యంపై దండెత్తే ప్ర‌త్య‌ర్థులపైనా, దోపిడీ దారుల‌పైనా కఠినంగానూ ఉండాలి. అప్పుడే రాజ్యంలోని ప్ర‌జ‌లు ఎలాంటి భ‌యాలు లేకుండా సంతోషంగా జీవ‌నం సాగిస్తారు. వ్యాపారాలు అభివృద్ధి చెంది ఆ రాజ్యం ఆర్థికంగానూ బ‌లోపేతం అవుతుంది. ఆ సూత్రాన్ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు  పట్టించుకున్నట్లు లేదు. ఫ‌లితంగా ప్ర‌తిప‌క్ష హోదా సైతం కోల్పోయిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న అనుచ‌రులు రెచ్చిపోతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండు నెల‌లు కూడా పూర్తి కాక‌ముందే.. రాష్ట్రం మొత్తం అల్ల‌క‌ల్లోలం అవుతోందనీ.. శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయనీ వైసీపీ నేత‌లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. త‌మ‌కు ఇష్ట‌మొచ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తూ.. అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన పోలీసుల‌కు సైతం వార్నింగ్ లు ఇస్తున్నారు. రాష్ట్రంలో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌ల ప్ర‌వ‌ర్త‌న చూస్తున్న ప్ర‌జ‌లు ఏపీలో అధికారంలో ఉంది వైసీపీనా, తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వ‌మా అనే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. దీనంత‌టికి చంద్ర‌బాబు నాయుడు మంచితనమే కార‌ణ‌మ‌ని కొంద‌రు తెలుగుదేశం నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే శాంతి భ‌ద్ర‌త‌లు, అభివృద్ధే ముఖ్యంకాదు.. త‌ప్పుడు ప్ర‌చారం చేసే ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌పై కొర‌డా ఝుళిపించి వారిని అదుపులో పెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉంటుంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గ‌త ఐదేళ్ల జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌లు వ‌ణికిపోయారు. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మ కేసులుపెట్టి జైళ్ల‌కు పంపించారు. ఫ‌లితంగా రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయి. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు  వ్యాపార‌ వేత్త‌లు వెనుక‌డుగు వేశారు. ఏపీ ఆర్థికంగా తీవ్రంగా దెబ్బ‌తింది. ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగాఅడుగంటి పోయింది.   అప్పుల‌తోనే ఐదేళ్లు రాష్ట్రాన్ని జ‌గ‌న్ న‌డిపిస్తూ వ‌చ్చారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయ‌డంపై దృష్టి పెట్టారు. పాల‌నాప‌రంగా సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబు.. తొలుత‌ రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొల్పేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఘ‌ర్ష‌ణ‌లకు, దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డితే వైసీపీ, టీడీపీ, జ‌నసేన పార్టీ నేత‌లు అనే తేడాలేకుండా కేసులు న‌మోదు చేస్తున్నారు.  రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉండేలా కూట‌మి ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంటుంది. మ‌రోవైపు అభివృద్ధి ప‌నుల్లో వేగం పెంచారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై దృష్టి సారించారు. మొత్తంగా చెప్పాలంటే కూట‌మి ప్ర‌భుత్వం 50రోజుల పాల‌న‌లో ప్ర‌జ‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జీవ‌నం సాగిస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేత‌లు రాష్ట్రంలో అల్ల‌ర్లు సృష్టించేలా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. రాష్ట్రంలో వ్య‌క్తుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చ‌కుంటూ.. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని త‌మ అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేస్తున్నారు. ఫ‌లితంగా రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపుతున్న వ్యాపారుల‌ను భ‌యాబ్రాంతుల‌కు గురిచేసేలా జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు.  వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేత‌లు ఇష్టానుసారంగా రెచ్చిపోవ‌టానికి సీఎం చంద్ర‌బాబ నాయుడు మంచితనం కూడా కార‌ణ‌మ‌ని ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌లు వాపోతున్నారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లకు విఘాతం క‌లిగించేవారిపై లాఠీలు ఝుళింపించాలని, అప్పుడే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లాంటి వారు, వైసీపీ నేత‌లు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడుతార‌ని పేర్కొంటున్నారు. అసెంబ్లీ వ‌ద్ద జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలీసుల‌పై వ్య‌వ‌హ‌రించిన తీరును చూస్తుంటే టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. అసెంబ్లీ వ‌ద్ద నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించిన వైసీపీ ఎమ్మెల్యేల‌కు అడ్డు చెప్పినందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలీసుల‌పై చిందులేశాడు. అధికారంలో  ఉంది వైసీపీ.. నేనే సీఎంను అన్న‌ట్లుగా అహంకార పూరితంగా మాట్లాడారు. ఐదేళ్లు అవినీతి, అక్ర‌మాల‌తో రాష్ట్రాన్ని దోచుకున్న జ‌గ‌న్, వైసీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి రోజు నుంచే కొర‌డా ఝుళిపించి ఉంటే ప్ర‌స్తుతం ఈ ప‌రిస్థితి ఉండేది కాద‌ని కొంద‌రు తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు అంటున్నారు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాజాగా ట్విట‌ర్ లో షేర్ చేసిన పోస్టును చూసిన నెటిజ‌న్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జ‌గ‌న్ రెడ్డిని జైలుకు పంపిస్తే బాగుండేద‌ని అభిప్రాయపడుతున్నారు.    కేవలం 50 రోజుల్లోనే కూట‌మి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందింద‌ని జ‌గ‌న్ ట్వీట్ చేయడం గమనార్హం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాలంటూ జ‌గ‌న్ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. అంతేకాదు.. చంద్ర‌బాబు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చూసి భ‌య‌ప‌డుతున్నాడ‌ట‌. వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే అసెంబ్లీలో ప్రశ్నిస్తారన్న భయంతో కూట‌మి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదంటూ జ‌గ‌న్ ట్వీట్ లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మ‌రో అడుగు ముందుకేసి.. చంద్రబాబునాయుడి పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది అంటూ జ‌గ‌న్ ట్వీట్ చేయడం పట్ల ప్రజలు మండిప‌డుతున్నారు. ఇప్పటికైనా సుదీర్ఘ పాలనా అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు అభివృద్ధే లక్ష్యంతో పాటు.. రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించే వైసీపీ మూక‌ల ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ప్రజలు కోరుతున్నారు.  

చెప్పేవి విలువల్స్.. పక్కనే క్రిమినల్స్!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున తన మార్క్ హంగామా ప్రదర్శించారు. ఆయన తీరు నీతులు చెప్పడానికే కానీ ఆచరించడానికి కాదని ఫిక్సైపోయినట్లు ఉంది. ఓ వైపు విలువల గురించి మాట్లాడుతూ.. అదే సమయంలో శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టుకున్నారు. అలాగే దళితుడి శిరోముండనం కేసులో కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించిన తోట త్రిమూర్తులూ ఆయన పక్కనే ఉన్నారు. మొత్తం మీద జగన్ అసెంబ్లీ సజావుగా సాగడం జగన్ కు సుతరామూ ఇష్టం లేదన్న సంగతిని తొలి రోజు విస్పష్టంగా బయటపెట్టుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించే ఉద్దేశం అంతకన్నా లేదని ఆయన చాటారు. ఏదో విధంగా సభలో గలాటా సృష్టించి వాకౌట్ చేయడమో, లేదా సస్పెండ్ అవ్వడమో లక్ష్యంగా ఆయన వ్యవహార శైలి ఉందన్న విమర్శలను మూటకట్టుకున్నారు. అసెంబ్లీలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి.. తద్వారా ఈ నెల 25న తాను తలపెట్టిన ఢిల్లీ ధర్నాకు మైలేజ్ వచ్చేలా చూసుకోవాలన్న తాపత్రేయం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇక సోమవారం (జులై22) జగన్ ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చొచ్చుకుని పోవడానికి ప్రయత్నించారు. నిబంధనల ప్రకారం సభలోకి ప్లకార్డులను తీసుకువెళ్లడానికి వీలు లేదు. ఆ కారణంగా పోలీసులు అడ్డుకుంటే వారితో ఘర్షణ పడినంత పని చేశారు. ప్రజాస్వామ్యం, నిబంధనలు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ప్రజాస్వామ్యం, పోలీసుల విధులు అంటూ ఆయన ప్రసంగించారు. పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆయన పోలీసులకు పోలీసు విధులు, ధర్మం, న్యాయం  అంటూ సూక్తులు చెబుతున్న వీడియోలో ఆయన పక్కనే ఇటీవలే శిరోముండనం కేసులో కోర్టులో దోషిగా తేలిన తోట త్రిమూర్తులు ఉన్నారు. అంతే కాదు ఆయన వెంట ఉన్న బృందంలో హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కూడా ఉన్నారు. వాళ్లిద్దరినీ పక్కన పెట్టుకుని జగన్ ప్రజాస్వామ్యం, హక్కులు, పోలీసుల విధులు అంటూ ప్రసంగించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను అధికారంలో ఉండగా ప్రజాస్వామ్యం ఖూనీ అయినా పట్టించుకోని, పైపెచ్చు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన అనంతబాబు, తోట త్రిమూర్తులు లాంటి వారిని వెనకేసుకొచ్చిన జగన్ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంటూ నినాదాలు చేయడం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

జగన్‌కి ఆస్కార్ అవార్డు?

గౌరవనీయులైన ఆస్కార్ అవార్డుల అకాడమీ వారికి నమస్కారం. ఈసారి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో మీరు ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి పడితే వాళ్లకి ఇవ్వకుండా, ఒక అంతర్జాతీయ స్థాయి గొప్ప నటుడికి ఇవ్వాలన్న ఉద్దేశంతో మీకు ఈ లేఖ రాయడం జరుగుతోంది. ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో జగన్ అనే ఒక మహా నటుడు వున్నాడు. ఈసారి ఆస్కార్ అవార్డు ఆయనకి ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన సినిమా నటుడు కాదు కదా అనే సందేహం మీకు రావచ్చు.. కానీ, ఆయన సినిమా వాళ్ళకి అమ్మమొగుడు లాంటి నటుడు. అవార్డులకు అర్హత నటనే కావాలిగానీ, సినిమాలు కాకూడదనే అభిప్రాయంతో మీకు ఈ లేఖ రాయడం జరుగుతోంది. దయచేసి ఈసారి అవార్డుల ప్రదానం సందర్భంగా జగన్ అనే మహా నటుడిని పరిగణనలోకి తీసుకోవల్సిందిగా కోరుతున్నాం.  ఏదో అభిమానం కొద్దీ చెప్పడం కాదు.. మీరు కూడా జగన్‌కి సంబంధించిన వీడియోలు గట్రాలు తెప్పించుకుని చూడండి. ముఖ్యంగా గత ఐదేళ్ళ కాలంలో ఆయన నటనా చాతుర్యం చూసి మీరు ముక్కు మీద వేలేసుకుంటారు. లేటెస్ట్ వీడియోలు కావాలంటే, మొన్నటి ఎన్నికల ప్రచారం, ఇంటర్వ్యూలు, రీసెంట్‌గా నెల్లూరు సెంట్రల్ జైల్‌కి వెళ్ళిన వీడియోలు, శుక్రవారం నాడు వినుకొండ వెళ్ళిన వీడియోస్ చూడండి.. ఆయన ఎంత మహా నటుడో, మీ హాలీవుడ్ నటుల్ని మడతెట్టి పక్కనపెట్టే నటుడో మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా బాబాయ్ మర్డర్ సమయంలో ఆయన మర్డర్ జరిగిన తీరును వివరించిన వీడియో చూశారంటే, మీరు రాబోయే వందేళ్ళపాటు వరుసగా జగన్‌కే ఆస్కార్ అవార్డు ఇచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు మేం మాటల్లో చెప్పిన దానికంటే, మీరు మా జగన్ వీడియోలు సేకరించి చూడండి సార్.. ఇంత మహా నటుడిని ఇంతకాలం మిస్సయిపోయామని మీరే పశ్చాత్తాపపడతారు. మీరు మా జగన్ వీడియోలు చూస్తారని, ఈసారి ఆస్కార్ అవార్డ్స్.లో ఉత్తమ నటుడి అవార్డు మా జగన్‌కి ఇస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు మహానటుడు జగన్ అభిమాన సంఘం..

‘కమ్మ’ అంటే అమ్మలాంటి వాళ్ళు.. రేవంత్‌రెడ్డి

కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న కమ్మ గ్లోబల్ సమిట్  కార్యక్రమం హైదరాబాద్‌లోని హైటెక్స్.లో శనివారం నాడు ప్రారంభమై అత్యంత వైభవంగా జరుగుతోంది. రెండు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి శనివారం నాడు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ కార్యక్రమానికి ఆలోచన రెండేళ్ళ క్రితం రూపుదిద్దుకుంది. మిత్రుడు కుసుమకుమార్‌కి రెండేళ్ళ క్రితమే ఏర్పాటు చేయాలని భావించారు. అప్పుడు కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఎన్నికలు, ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు... 90 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా ప్లాన్ చేయడం చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. కులం అనేది వృత్తినిబట్టి వచ్చేది. ‘కమ్మ’ అంటే అమ్మలాంటి వాళ్ళు. ఆకలి మీద వున్న వాళ్ళకి అమ్మలాగా అన్నం పెట్టే కులం ఇది. అమ్మ ఎవరిదైనా కడుపు చూస్తుంది. కమ్మ వాళ్ళు కూడా ఎదుటివారి కడుపు నింపాలని చూస్తారు. కమ్మవారు నేలతల్లని నమ్ముకుని, వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారం లాంటి పంటలు పంటలు పండించి, పదిమందికీ సాయం చేస్తారు. అందుకే ఒక సినిమాలో.. కొండపైన అమ్మవారు... కొండ కింద కమ్మవారు అని అన్నారు. కమ్మవాళ్ళు ఎక్కడ వున్నారో మనం గుర్తు పట్టాలంటే, పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సారవంతమైన భూములు, సమృద్ధిగా నీరు ఎక్కడైతే వుంటుందో అక్కడ తప్పకుండా కమ్మవారు వుంటారు అని నేను నా మిత్రులతో అంటూ వుంటాను. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్నాటక అయినా.! కమ్మవారి ఆలోచన ఎప్పుడూ శ్రమించాలి, పంటలు పండించాలి.. పదిమందికీ ఉపయోగపడాలి.. పదిమందిని ఆదుకునే ఆలోచన చేయాలని అన్నదే కమ్మ కులంలో వున్న నేపథ్యం. అదే కమ్మ కులంలో వున్న డీఎన్ఏ.  కమ్మ కులంతో నాకున్న సన్నిహిత సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, నేను ఎక్కడ వున్నా నన్ను కమ్మవారు ఎలా అభిమానిస్తారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ లైబ్రరీలో చదువుకునే నేను చాలా నేర్చుకున్నాను. ఎన్టీఆర్ లైబ్రరీలో నేను చదువుకున్న చదువు నేను జీవితంలో ఉన్నత స్థానానికి రావడానికి ఉపయోగపడిందని నేను గట్టిగా చెప్పడానికి ఎంతమాత్రం జంకను. మనం వచ్చిన నేపథ్యం, మనకి అవకాశం ఇచ్చినవాళ్ళని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. చిన్నగా చేసి చూడటం పద్ధతి కాదు.  ఎన్టీఆర్ కంటే ముందు 52 మంది కమ్మ కులానికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వున్నారని అంటూ వుంటారు. కానీ, ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆయన ‘ఎన్టీఆర్’ అనే బ్రాండ్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ పాలిటిక్స్.లో ఒక బ్రాండ్.. ఎన్టీఆర్ లీడర్‌షిప్‌లో ఒక బ్రాండ్. వారు ఇచ్చిన అవకాశాల వల్లే ఆ రాష్ట్రమైనా, ఈ రాష్ట్రమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు నాయకులు వున్నారూ అంటే, ఎన్టీఆర్ ఆనాడు ఇచ్చిన అవకాశాలే కారణం. ఎన్టీఆర్‌ని అవమానిస్తూ మాట్లాడే వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చింది ఎన్టీఆరే. అది ఎన్టీఆర్ లోపం, ఎన్టీఆర్ తప్పు కాదు.. ఎన్టీఆర్ అందరికీ అవకాశం ఇచ్చారు.. అవకాశాన్ని అందుకున్నవాళ్లలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా వుండొచ్చు. అది వారి వారి విజ్ఞత. అలాగే ఎన్జీ రంగా, వెంకయ్య నాయుడు, అలాగే.. చంద్రబాబు నాయుడు.. చంద్రబాబు నాయుడి గురించి ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు.. బలమైన నాయకురాలిగా ఇందిరాగాంధీని ఎదుర్కొనేవాళ్ళే లేరు అనే పరిస్థితులు వున్నప్పుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఈరోజు దేశాన్ని ఏలుతున్న వారికి అవకాశాలు ఇచ్చాయన్న విషయాన్ని మరవకూడదు. ఒకనాడు దేశంలో బీజేపీ రెండు పార్లమెంట్ స్థానాలు మాత్రమే గెలిస్తే, హనుమకొండ నుంచి పీవీ నరసింహారావుని ఓడించిన బీజేపీ అభ్యర్థి జంగారెడ్డి తెలుగుదేశం మద్దతుతోనే గెలిచారన్న విషయాన్ని మరవకూడదు. బీజేపీ ఎక్కడో గుజరాత్‌లో ఒక స్థానంలో గెలిచింది. ఇక్కడ తెలుగుదేశం మద్దతుతో మరో స్థానంలో గెలిచింది. నేషనల్ ఫ్రంట్ కావచ్చు, యునైటెడ్ ఫ్రండ్ కావచ్చు, ఎన్డీయే కావచ్చు.. ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చినా ఎన్టీఆర్ సంకీర్ణ రాజకీయాల ఆలోచనే కారణం.  కమ్మ కులస్తులు వ్యవసాయం నుంచి లాయర్లుగా, డాక్టర్లుగా, వ్యాపారవేత్తలుగా అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు రాణిస్తున్నారు. సత్య నాదెళ్ళ దగ్గర మొదలుపెడితే, పెద్దపెద్ద మల్టీ నేషనల్ కంపెనీల సీఈవోలుగా కమ్మవారు వున్నారు. అమెరికాలో తానా సోదరులు పెట్టే బహిరంగ సభల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమావేశం జరపడం ఆనందకరం. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చడంలో కమ్మవారు కూడా భాగస్వాములుగా కావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆహ్వానిస్తున్నాను. మీ కులంలో నిపుణులను, నైపుణ్యాన్ని అన్నిరకాలుగా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సంసిద్ధంగా వుంది. హైదరాబాద్ ప్రపంచ నగరంగా మారాలంటే, ప్రపంచంలో రాణించిన కమ్మ సోదరులకు ఇక్కడ అన్నిరకాలుగా అవకాశాలు కల్పించాల్సిన అవసరం వుంది. వాటిని కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా వుంది.  ప్రపంచంలో నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు. పన్నులు కడుతున్న ప్రాంతంలో ఎవరైనా తమకు నచ్చని విషయాల మీద నిరసన తెలపడానికి అవకాశం వుంది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అమెరికాలో వైట్ హౌస్ ముందు నిరసన తెలపడానికి అనుమతి వచ్చింది. కానీ, తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది తమ నిరసన తెలపాలని అనుకుంటే అప్పటి ప్రభుత్వం ఆ నిరసనను ఆపాలన్న ఆలోచన చేసింది. అదే వారి పతనానికి నాంది పలికింది.  ఢిల్లీలో మనకు ఒక గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిన వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అవ్వాలని, నేను వేరే పార్టీ వాడిని అయినప్పటికీ కోరుకున్నాను. ఢిల్లీలో మన తెలుగు వారి వాయిస్ బలంగా వినిపించే వాళ్ళు లేరు. ఆ విషయంలో చాలా లోటు వుంది. ఆ లోటును పూరించే విషయాన్ని అందరం ఆలోచించాలి.  కమ్మ సంఘం నిర్మాణానికి ఐదెకరాలు గతంలో కేటాయించారు. కానీ, అది వివాదాలతో కూడిన భూమి. ఆ వివాదాలను పరిష్కరించి భూమిని స్వాధీనం చేయడానికి, అద్భుతమైన కమ్మ సంఘం భవనం నిర్మాణానికి సహకరించడానికి నేను, నా మంత్రివర్గ సహచరులం సిద్ధంగా వున్నాం. పేద కమ్మ వారిని, ఇతర పేదవారిని ఆదుకోవడానికి కమ్మవారంతా ముందుకు రావాలి. కమ్మవారు ఇతరులకు సహాయపడే తమ ప్రధాన లక్షణాన్ని, తమ డీఎన్ఏని వదులుకోకుండా వుండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు.