అజ్ణాతంలో విడదల రజిని.. అరెస్టు భయమే కారణమా?

తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. వైసీపీలోకి జంప్ చేసిన విడదల రజని ఆ పార్టీ తరఫున 2019 ఎన్నికలలో చిలకలూరి పేట నుంచి అసెంబ్లీకి ఎన్నికై అవినీతి వటవృక్షంగా ఎదిగారు.   సైబ‌రాబాద్ మొక్క‌నంటూ తెలుగుదేశం పార్టీ  ద్వారా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన విడద‌ల ర‌జ‌నీ..  వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా చంద్రబాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అయితే కొద్దికాలంకే తెలుగుదేశం పార్టీని వీడి  వైసీపీలో చేరిపోయారు.  ఆ త‌రువాత అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని  పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. త‌ద్వారా వైసీపీ హ‌యాంలో మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. రెండున్న‌రేళ్లు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అధికారంలో ఉన్న‌స‌మ‌యంలో విడుద‌ల ర‌జ‌నీ, ఆమె అనుచ‌రులు పెద్దెత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అప్ప‌ట్లో వైసీపీ ప్ర‌భుత్వం ఉండ‌టం, ఆమె మంత్రిగా ఉండ‌టం వ‌ల్ల ఆమె అవినీతిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పోలీసులు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత విడుద‌ల ర‌జనీ అవినీతి అక్ర‌మాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. అధికారంలో ఉన్న స‌మ‌యంలో తెగ హ‌డావుడి చేసిన ఆమె.. పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి పెద్ద‌గా ప్ర‌జ‌ల్లోకి రావ‌డం లేదు. గ‌త నెల రోజుల నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ర‌జ‌నీ అందుబాటులో లేర‌ని వైసీపీ నేతలే చెబుతున్నారు. అవినీతి గుట్టు వీడుతుండ‌టంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయార‌ని.. బీజేపీలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది.   టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ నేత‌ల‌పై వ‌రుస కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌త ప్ర‌భుత్వంలో న‌మోదైన కేసులూ మ‌ళ్లీ తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో  తెలుగుదేశం ప్ర‌ధాన కార్యాల‌యంపై వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు దాడిచేశారు. అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. పోలీసులకు పిర్యాదు చేసిన‌ప్ప‌టికీ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ కేసుపై దృష్టి సారించింది.. ఈ క్ర‌మంలో మాజీ ఎంపీ నందిగం సురేశ్​, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు  చేసిన పోలీసులు.. మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం దూకుడుతో గ‌త ఐదేళ్లు పొలిటికల్‌ స్ర్కీన్‌పై ఓ వెలుగు వెలిగిన నేతలు.. ఉన్నపళంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేశ్ వంటివారు అండర్‌ గ్రౌండ్‌కి వెళ్లిపోగా, మాజీ మంత్రి విడదల రజిని కూడా వారి బాటనే అనుసరిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వైసీపీ హయాంలో విడదల రజనీ పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. అంతేకాక‌.. ఇటీవ‌ల కాలంలో ర‌జ‌నీ అవినీతి అక్ర‌మాల‌పై పోలీస్ స్టేష‌న్‌ల‌లో ప‌లు కేసులు న‌మోదైన‌ట్లు తెలుస్తోంది. ఆ కేసుల‌పై దృష్టి సారించిన అధికారులు.. ర‌జ‌నీని త్వ‌ర‌లో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నార‌ని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది.   2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన ర‌జ‌నీ.. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఆ త‌రువాత క్ర‌మంలో ర‌జ‌నీని ప‌లు వివాదాలు చుట్టుముట్టాయి. ఆమె నియోక‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. స్థానిక‌ వైసీపీ నేతలు కూడా గతంలో జగన్ మోహ‌న్ రెడ్డికి ర‌జ‌నీపై ప‌లుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా జ‌గ‌న్ చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేయ‌డంతో విడద‌ల‌ ర‌జ‌నీ మ‌రింత రెచ్చిపోయార‌ని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెపై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌యింది. జ‌గ‌న్ నిర్వ‌హించిన స‌ర్వేలో చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రోసారి ర‌జ‌నీని పోటీకి దింపితే ఆమె ఓడిపోవ‌టం ఖాయ‌మ‌ని తేలింది.  దీంతో 2024 ఎన్నిక‌ల్లో ఆమెను గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి మార్చారు. అయితే, ఆ ఎన్నికలలో రజనీ   ఓట‌మి పాల‌య్యారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో.. చిలక‌లూరిపేటలో విడదల ర‌జ‌నీ భూ దందా వెలుగు చూసింది. జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి కోటీ 16 లక్షల రూపాయల కమిషన్‌ తీసుకున్నారని విడదల రజినిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ బాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారని తెలిసింది.  ఎన్నికల ముందు చిలక‌లూరిపేట టికెట్‌ ఇప్పిస్తానని తన వద్ద విడద‌ల ర‌జ‌నీ ఆరు కోట్లు తీసుకున్నారని అప్పటి వైసీపీ ఇన్‌చార్జి రాజేశ్‌ నాయుడు ఆరోపించారు. గ‌తంలో కొంత మొత్తం తిరిగి ఇచ్చేయ‌గా.. ఇంకా రావాల్సిన డబ్బు రాకపోవడంతో ఆ డబ్బు కోసం రాజేశ్‌నాయుడు చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజేష్ నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.  ఆయన ర‌జ‌నీకి గ‌ట్టి షాకిచ్చేందుకు రెడీ అవుతున్నార‌ట‌. మరో వైపు చిలక‌లూరిపేట స్టోన్‌ క్రషర్‌ యజమానులు కొందరు మాజీ మంత్రి విడుదలపై తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు.   క్రషర్లు నడపాలంటే ఐదు కోట్లు   ఇవ్వాలని రజిని డిమాండ్‌ చేశారని, లేదంటే 50 కోట్ల జరిమానా విధించేలా విజిలెన్స్‌ కేసులు నమోదు చేయిస్తానని బెదిరించారని ఆరోపించారు. దీంతో విడుదల‌ రజినీపై చర్యలకు పోలీసులు రంగం సిద్ధంచేస్తున్నార‌ని ఏపీ రాజ‌కీయాల్లో గట్టిగా వినిపిస్తోంది. త‌ర్వాత జైలు కెళ్లే వైసీపీ నేత మాజీ మంత్రి ర‌జ‌నీ అయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. మ‌రోవైపు.. విడుద‌ల ర‌జ‌నీ మాత్రం త‌న‌ను చుట్టుముడుతున్న కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, ఈ క్ర‌మంలో ఆమె బీజేపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని వైసీపీ నేతలు అంటున్నారు.  మొత్తం మీద రజనీ అవినీతి, అక్రమాల గుట్టు రట్టౌతుండటంతో ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా అరెస్టు నుంచి తప్పించుకునే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సగం బెజవాడను కాపాడినది రైల్వే కట్టలేనా?

బుడమేరు ముంపు కారణంగా సగం బెజవాడ మునిగిపోయింది. మిగిలిన సగం బెజవాడను ముంపు ముప్పు నుంచి కాపాడినది రైల్వే కట్టలేనా? అంటే స్థానికులు ఔననే చెబుతున్నారు. జనవాసాలలోకి నీరు చేరకుండా ఎత్తుగా ఉన్న ఈ రైలు కట్టలే అడ్డుకున్నాయంటున్నారు. కాజీపేట రైల్వే డివిజన్ కొండపల్లి వరకూ ఉంది. కొండపల్లి నుంచి విజయవాడ డివిజన్ మొదలౌతుంది.  ఆగస్టు.31 వతేదీ బుడమేరు ప్రవాహాన్ని కొండపల్లి, రాయనపాడు, విశాఖ వైపు నిర్మించిన లూప్ లైన్ అడ్డుకుంది.కవులూరు,రాయనపాడు, శాంతి నగర్ మధ్య బుడమేరు గండ్లు పడ్డాయి. ఆ ప్రవాహమే బెజవాడ ను ముంచెత్తింది. 1వ తేదీ సాయంత్రానికి విజయవాడ రైల్వేస్టేషన్ కు కి.మీ దూరంలో ఉన్న నైజాం గేటు వరకూ పట్టాలపైకి నీరు వచ్చింది. రాయనపాడు,కొండపల్లి రైల్వేస్టేషన్లు ఎత్తులో ఉండడంవల్ల ముంపుకు గురి కాలేదు.  సాధారణంగా రైల్వే లైన్లు  దాదాపు ఆరు అడుగుల ఎత్తులో నిర్మిస్తారు. కోస్తా ప్రాంతంలో వ్యవసాయ భూములు ఉండడంవల్ల తరచూ వర్షాలు,వరదలు వచ్చే అవకాశం ఉండడంతో నాలుగు నుంచి ఐదు మీటర్ల ఎత్తులో నిర్మించారు. విశాఖమార్గంలో,విజయవాడలో లైన్ ఎత్తులో నిర్మించారు.35ఏళ్ల క్రితం విశాఖ మార్గంలో లూప్ లైన్ నిర్మించడంతో భద్రత పెరిగింది. రాజేశ్వరిపేట మీదుగా విశాఖ వెళ్లేమార్గంలో కొత్త లైన్ నిర్మాణంతో గూడ్స్ రైళ్లు మళ్లింపు జరుగుతున్నాయి.ఇటీవలకాలంలో అత్యవసరం సమయంలో ప్యాసింజర్ రైళ్లు నడుపుతున్నారు.ఈ లైన్  గుణదల, రామవరప్పాడు మీదుగా వెళుతుంది.పొడవైన ఈ లైన్ ఎత్తుగా ఉండడంతో వరదను అడ్డుకోవడమే కాక నగరం లోని మిగిలినప్రాంతాలు ముంపునకు గురికాకుండా అడ్డుకుంది.   ఇక పోతే బుడమేరు ముంపు బాధితులు ఆరున్నర లక్షల మంది గా భావిస్తున్నారు.194 పునరావాస కేంద్రాల్లో 45వేలమంది ఆశ్రయం పొందుతున్నారు.వరద దెబ్బకు 2900కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయి.రెండు లక్షల హెక్టార్ల మేరకు పంట పొలాలు మునిగాయి. 20వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన  పంటలు దెబ్బతిన్నాయి. అధికారిక లెక్కల మేరకు 20మంది మృతి చెందారు.

పని తీరే ప్రామాణికం.. ఇదీ చంద్ర‌బాబు స్కూల్ అంటే

జగన్ హయాంలో ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అరాచకం తాండవించింది. దాడులకు, దౌర్జన్యాలకూ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. తప్పులు చేసిన వారిపై చర్యలు లేవు.అకృత్యాలకూ, అత్యాచారాలకు, హత్యలకు పాల్పడిన వారిపై కేసులు లేవు, ,చర్యలు లేవు సరికదా ఎదురు బాధితులే వేధింపులకు గురైన పరిస్థతి. వరదలు, తుపానులు వంటి విపత్తులు జరిగిన సమయాలలో ప్రభుత్వం నుంచి స్పందన లేదు, సహకారం లేదు. అసలా ఐదేళ్లూ రాష్ట్రంలోఅసలు ప్రభుత్వం అనేది ఉందా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి.  ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలో ఉంది. జవాబుదారీ తనంతో పని చేస్తున్నది. ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నది. జగన్ ప్రభుత్వం దిగిపోయి, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నిండా మూడు నెలలు కాలేదు. అయినా రాష్ట్రంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అభివృద్ధి ఉరకలేస్తోంది. సంక్షేమం నిజమైన అర్దం ఏమిటో తెలిసేలా పథకాలు అమలు అవుతున్నాయి. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ప్రభుత్వ వారిని అన్ని విధాలుగా ఆదుకుంటోంది. మూడు నెలలలోనే ఇంతటి మార్పునకు కారణమేంటి? అంటే లభించే జవాబు. నాయకత్వం. సమర్థుడైన నాయకుడు తాను కష్టపడటమే కాదు... తన టీమ్ ను సైతం సమర్థంగా పని చేసేలా గైడ్ చేస్తారు. ప్రభుత్వం, పాలనా అన్నది ఒక సమష్టి బాధ్యత అన్న భావన అందరిలో కలిగిస్తారు.  టీమ్ స్ఫిరిట్ అన్నది అందరిలోనూ నింపుతారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఒక స్కూల్ లో  ప్ర‌ధానోపాధ్యాయుడు స‌మ‌ర్ధుడైతే.. ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు, సూచ‌న‌ల‌కు అనుగుణంగా ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల‌ను ఉన్న‌తులుగా తీర్చిదిద్ద‌ుతారు. అందు కోసం శ్రమిస్తారు.  త‌ద్వారా విద్యార్థుల బంగారు భ‌విష్య‌త్తుకు బ‌ల‌మైన పునాదులు ప‌డ‌తాయి. అదే త‌ర‌హాలో ప్ర‌భుత్వాన్ని న‌డిపించే ముఖ్య‌మంత్రి స‌మ‌ర్ధ‌ుడైతే మంత్రివ‌ర్గం, నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తారు. ప్ర‌జ‌ల సాధక‌ బాధ‌కాల్లో పాలుపంచుకుంటారు. ప్ర‌స్తుతం ఏపీలో సరిగ్గా అలాంటి సమర్థ ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్ర‌భుత్వ‌మే ఉంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జ‌రుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అదే సమయంలో అభివృద్ధినీ ప‌రుగులు పెట్టిస్తున్నారు. కష్టం వస్తే సమష్టిగా కదిలి బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో విజయవాడను భారీ వర్షాలు వరదలూ ముంచెత్తి రోజుల తరబడి ప్రజలు ముంపులో చిక్కుకుంటే.. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కదిలింది. బాధితులను ఆదుకుంది. భరోసా ఇచ్చింది. ధైర్యం చెప్పింది. కష్టాలలో తాము ఒంటరిగా లేమన్న ధీమాను జనంలో కలిగించింది.  ప్రకాశం బ్యారేజీ వద్ద రికార్డు స్థాయిలో వరద ప్రవాహం రావడం, ఎన్నడూ లేని విధంగా  బుడ‌మేరు పోంగి పొర్లడం.. మూడు ప్రాంతాల్లో గండ్లు ప‌డ‌టంతో విజవాడ‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మ‌నిషి లోతు నీళ్లు చేరాయి. అప్ర‌మ‌త్త‌మైన సీఎం చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌ద‌నీరు వ‌చ్చిన కొద్ది గంట‌ల నుంచే ముంపు ప్రాంతాల్లో స్వ‌యంగా పర్యటించి ముంపు బాధితులకు భరోసా ఇవ్వడమే కాకుండా స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. ఏడు రోజులుగా ముంపు బాధితుల‌కు ప్ర‌భుత్వం ఆహారం, కూర‌గాయ‌లు, పాలు, పండ్లు అందిస్తూ వారికి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూస్తున్నారు. ముంపు బాధితులలో ధైర్యాన్ని నింపారు. నేనున్నా అన్న భరోసా ఇచ్చారు. ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం   ప‌డుతుండ‌టంతో ముంపు ప్రాంతాల ప్ర‌జ‌లు ఊపిరిపీల్చుకుంటున్నారు.  విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్తిన విష‌యం ప‌క్క‌న‌పెడితే.. వ‌ర‌ద ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న స‌హాయ‌క చ‌ర్య‌లను చూసి దేశం మొత్తం ఆశ్చ‌ర్య‌పోతుంది. ఆపత్సమయాలలో ప్రజలను ఆదుకునే తీరు ఇదే అంటూ ప్రశంసలు గుప్పిస్తోంది.  స‌మ‌ర్ధ‌ సీఎం ఉంటే.. ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య ఎదురైనా ఇబ్బంది ఉండద‌న్న విష‌యాన్ని  చంద్ర‌బాబు నాయుడు దేశానికి మ‌రోసారి చాటి చెప్పారు. విజయవాడ ముంపు బాధితులను ఆదుకోవడంలోనూ, వారికి ధైర్యం చెప్పి భరోసా ఇవ్వడంలోనూ చంద్రబాబే ఒక సైన్యంగా, ఒక ధైర్యంగా నిలబడ్డారు. జాతీయ మీడియా సైతం సీఎం చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తుండటం, మంత్రివ‌ర్గం, అధికారులు, ఎమ్మెల్యేలు ముంపు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తున్న తీరుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా విజ‌య‌వాడ న‌గ‌రంలోకి వ‌ర‌ద రావ‌డానికి కార‌ణ‌మైన బుడ‌మేరుకు ప‌డిన మూడు గండ్ల‌ను ద‌గ్గ‌రుండి పూడ్చివేయించే బాధ్య‌త‌ల‌ను సీఎం చంద్ర‌బాబు నాయుడు నీటిపారుద‌ల శాఖ మంత్రి రామానాయుడుకు అప్ప‌గించారు. చంద్ర‌బాబు ఆదేశాల‌ మేర‌కు రాత్రి, ప‌గ‌లు అనే తేడాలేకుండా.. వ‌ర్షం, చ‌లిని లెక్క చేయకుండా గండ్ల వ‌ద్ద‌నే ఉండి ద‌గ్గ‌రుండి ప‌నులు వేగంగా చేయించారు. మూడు రోజుల్లోనే మూడు గండ్ల‌ను పూడ్చివేసి శెభాష్ రామానాయుడు అనిపించుకున్నారు. ఒక్క రామానాయుడే కాదు.. మంత్రివ‌ర్గం, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముంపు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న సేవ‌ల‌ను చూసి రాష్ట్ర ప్ర‌జ‌లు హర్షం  వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి ప్ర‌భుత్వాన్ని ఎన్నుకున్నందుకు గ‌ర్వంగా ఉందంటూ పొంగిపోతున్నారు.  నిర్మ‌ల రామానాయుడుతో పాటు.. మంత్రివ‌ర్గం మొత్తం వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మైంది. గ‌తవారం రోజులుగా మంత్రి నారా లోకేశ్‌ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ, కంట్రోల్ రూమ్ ఉండి వ‌ర‌ద ప్రాంతాల్లో అందుతున్న స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆర్టీజీఎస్ శాఖ మంత్రిగా లోకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ పవరేంటో చూపారు. వ‌రద ఉధృతంగా ఉన్న మూడురోజులు తన నియోజకవర్గంలో కరకట్టకు కాపలాకాసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వరద తగ్గిన వెంటనే రంగంలోకి దిగి రాష్ట్ర నలుమూలల నుంచి నిత్యావసర సరుకులు తెప్పించి, బాధితులకు అందించే పనిలో ఉన్నారు. ఇక రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పాటు తన నియోజకవర్గంలో కట్ట‌కు కాపలాకాసి, తర్వాత నుంచి గండ్లుపూడ్చే పనిలో నిమ‌గ్న‌మ‌య్యారు. అలాగే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, తన జిల్లాలో కట్టకు గండి పడకుండా అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. వానలో వరదలో ఆయన ప్రజల మధ్యనే నిలిచారు. వరద తగ్గుముఖం పట్టగానే ముంపు ప్రాంతాలలో  విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలపై దృష్టిపెట్టారు. అత్యంత వేగంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా చూశారు.  మున్సిపల్ శాఖ మంత్రి  పొంగూరు నారాయణ  వరద ప్రాంతాల్లోనే మకాం వేశారు. ప్రజలకు ఏ కష్టం రాకుండా కాపు కాశారు. ముంపు తగ్గిన తరువాత ఆయా ప్రాంతాలలో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని రప్పించి ముంపు ప్రాంతాల్లో క్లీనింగ్ చేయిస్తున్నారు. విపత్తులశాఖ కూడా చూసే హోమ్ అనిత అయితే  విశ్రాంతి అనే మాటే లేకుండా చంద్ర‌బాబు వెంట వరద నీటిలోనే తిరుగుతూ ప్ర‌జ‌ల‌కు ఆహారం, కూర‌గాయ‌లు, పండ్లు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఇక  ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒకపక్క ముంపు ప్రాంతాలలో పర్యటనలు చేస్తూ, మరో పక్క కేంద్రంతో సంప్రదింపులు జరుపుదూ కేంద్ర సాయం జాప్యం లేకుండా వచ్చేలా చేస్తున్నారు.  దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దుర్గ గుడి కిచెన్ లో లక్షల ఆహార పొట్లాలు తయార‌వుతున్నాయి. వండిన ఆహారం అయితే త్వరగా చెడిపోతుంద‌ని మార్కెటింగ్, వ్యవసాయ శాఖల ద్వారా లక్షల సంఖ్యలో యాపిల్స్ సేకరించారు. ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాంమ‌నోహ‌ర్ నాయుడు మొదటి రెండు రోజులు కంట్రోల్ రూమ్‌లో ఉండి వ‌రద ముంపు ప్రాంతాల్లో అధికారుల‌కు త‌గు సూచ‌న‌లు చేస్తూ వ‌చ్చారు. అదే సమయంలో చంద్రబాబు సూచనల మేరకు డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహార పదార్ధాలు అందించే విషయంలో సత్వర అనుమతులు వచ్చేలా చేశారు. మ‌రో కేంద్ర మంత్రి తన నియోజకవర్గంలో వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితుల‌కు అండ‌గా నిలబడ్డారు.  ఇక రాష్ట్ర వ్యాప్తంగాఉన్న తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ ఎమ్మెల్యేలు  ముంపు ప్రాంతాల్లో బాధితుల‌కు ఆహారం, కూర‌గాయ‌లు, పండ్లు స‌ర‌ఫ‌రా చేయ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. మంత్రులంతా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఉంటే.. రాష్ట్రంలో సాధార‌ణ పాల‌న ప‌రిస్థితి ఏమిట‌? అన్న అనుమానాలే ఎవరికీ కలగకుండా పాలన సాగింది.  ఒక వైపు మంత్రులంతా వరద ముంపు ప్రాంతాలలో సహాయ పునరావాస కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్న సమయంలో.. వరద ముంపులో ఉన్న విజ‌య‌వాడ‌లోనే వేదాంత కంపెనీ  83వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు ముంచుకొచ్చింది. ఈ కార్య‌క్ర‌మానికి  పెట్టుబ‌డుల శాఖ మంత్రి హాజరయ్యారు. మరో మంత్రి ఢిల్లీలో మంత్రుల సదస్సులో ఉన్నాడు. రోజువారీ ప్ర‌భుత్వలో జ‌ర‌గాల్సిన ప‌నుల‌న్నీ జరుగుతూనే ఉన్నాయి. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ఏపీలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పాల‌న‌ను చూసి దేశం మొత్తం ఆశ్చ‌ర్య‌పోతుంది. ఇదీ ప్ర‌భుత్వాన్ని న‌డిపించ‌డం అంటే.. ఇదీ ప్రజల విషయంలో బాధ్యతగా ఉండడం అంటే.. ఇదీ ప్రజలకోసం పని చేయడం అంటే.. అంటూ దేశ‌వ్యాప్తంగా ప్ర‌ముఖుల నుంచి, రాష్ట్ర ప్ర‌జ‌ల నుంచి చంద్ర‌బాబు, ఆయ‌న టీంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. 

సీబీఎన్ మీకు సెల్యూట్‌.. ఇదిక‌దా గెలుపంటే!

ఆయనో రాజ‌కీయ చాణుక్యుడు.. ఆర్థిక వేత్త‌.. ఐటీ రంగ నిపుణుడు.. టెక్నాల‌జీకి బ్రాండ్ అంబాసిడర్.. ఆప‌ద‌లో ఉన్న‌వారికి ఆప‌ద్భాంద‌వుడు.. క‌ష్ట‌ కాలంలో అండ‌గా నిలిచే పెద్ద‌న్న‌.. మొత్తంగా ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషి.. ప్రజా నాయకుడు. ఇంకా చెప్పాలంటే.. ఏపీ ప్ర‌జ‌ల క్షేమం కోసం ఎంత‌దూర‌మైనా వెళ్లే జననేత. ఏపీని తాకిన ఎలాంటి ఉప‌ద్ర‌వ‌మైనా సీఎం కుర్చీలో ఆయ‌న‌ ఉన్నాడంటే తోక ముడ‌వాల్సిందే.. ఆయ‌నే ఎవ‌రో కాదు.. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇవ‌న్నీ ఆయ‌న అభినుమాలు, టీడీపీ శ్రేణులు  మాట‌లే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న  తెలుగు ప్ర‌జ‌ల హృదయాంతరాళాలలోంచి గ‌ర్వంగా వస్తున్న పలుకులు.  మ‌రోసారి ఆ మాట‌లు అక్ష‌ర‌స‌త్యాల‌య్యాయి. చంద్ర‌బాబు సీఎం సీటులో ఉంటే.. ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా జీవ‌నం సాగించొచ్చని మ‌రోసారి రుజువైంది.  గ‌తంలో విశాఖ‌.. నేడు విజ‌య‌వాడ‌. ప్ర‌కృతి ప్ర‌కోపానికి ఎదురొడ్డి నిల‌బ‌డ్డారు ఆ 74ఏళ్ల నవ యువ‌కుడు. విజ‌య‌వాడ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు త‌న ప్రాణాల‌ను అడ్డుగా పెట్టి అండ‌గా నిలిచాడు. బాధితులంతా వ‌ర‌ద‌ ముంపు నుంచి బయటకు వచ్చేవరకూ తానూ ఓ వరద బాధితుడాగా గడిపారు.  ప‌గ‌లు రాత్రి అన్న తేడా లేకుండా, నిద్రాహారాలన్న ఊసే ఎత్తకుండా వ‌ర‌ద‌ల్లో  బోట్ల‌పై విస్తృత పర్యటనలు సాగించి బాధితుల్లో దైర్యాన్ని, స్థైర్యాన్ని నింపారు.. వారిని సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చాడు. దీంతో మొన్నటి ఎన్నిక‌ల్లో సాధించిన విజయం కంటే.. ఉగ్ర‌రూపందాల్చిన కృష్ణమ్మ‌ను శాంతింప‌ జేసి చంద్ర‌బాబు సాధించిన విజ‌యం వంద రెట్లు గొప్ప‌ది. ఏపీ ప్ర‌జ‌ల‌కు మొద‌టి నుంచి సీఎం చంద్ర‌బాబుపై అపార న‌మ్మ‌కం ఉంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, నవ్యాంధ్రప్రదేశ్ లోనూ అయిన చంద్ర‌బాబు సీఎం కుర్చీలో ఉంటే మ‌న క‌ష్టాలు తీరుతాయ‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఉంటుంది. అందుకే.. ఏపీ ఎప్పుడు క‌ష్టాల్లో కూరుకుపోయినా జనం చంద్ర‌బాబు వైపే చూస్తారు.  చంద్ర‌బాబు కూడా ఎన్నికలలో జయాపజయాలను  ప‌ట్టించుకోకుండా   నాలుగు దశాబ్దాలుగా మచ్చలేని చంద్రుడిలా ప్రజాజీవితంలో కొన‌సాగుతున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  తొమ్మిదేళ్లు సీఎంగా ప‌నిచేసిన చంద్ర‌బాబు నాయుడు అద్భుతాలు చేశారు.  ముఖ్యంగా హైద‌రాబాద్ వైపు ప్ర‌పంచం చూసేలా చేశాడు. రాష్ట్ర విభజన తరువాత పేరు తప్ప మరేం మిగలని విభజిత ఆంధ్రప్రదేశ్ ను అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టి  ప్ర‌పంచం మొత్తం ఏపీవైపు చూసేలా చేయాల‌ని చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగుతున్నారు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఎదురైన ప్ర‌కృతి విప‌త్తుల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటూ.. ప్ర‌జ‌ల‌కు నేనున్నాన‌ని భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు చంద్ర‌బాబు నాయ‌డు.  రాష్ట్రంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లు వ‌చ్చిన స‌మ‌యంలో..  ఏ ముఖ్య‌మంత్రి అయినా వ‌ర‌దల తీవ్ర‌త‌ను గ‌మ‌నించేందుకు ఏరియ‌ల్ స‌ర్వే చేస్తారు. లేకుంటే అధికారుల‌ను, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అల‌ర్ట్ చేస్తూ బాధితుల‌కు అండ‌గా నిలిచే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో ప‌లు సంద‌ర్భాల్లో భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లు సంభ‌వించిన స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏరియల్ స‌ర్వే ద్వారా ముంపు ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. కాలు కింద‌ కూడా పెట్ట‌లేదు. దీంతో ముంపు ప్రాంతాల‌ ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, సీఎం చంద్ర‌బాబు నాయుడు అలాకాదు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ముంపుకు గురైన ప్రాంతాల్లోకి నేరుగా వెళ్తారు.. పీక‌ల్లోతు నీళ్లున్నా ప‌ట్టించుకోరు.. నేరుగా బాధితుల వ‌ద్ద‌కు వెళ్లి వారికి భ‌రోసా క‌ల్పిస్తారు. గ‌తంలో విశాఖలో హుదూద్ తుఫాన్ సృష్టించిన విల‌యం అంతాఇంతా కాదు.. ఆ తుఫాన్‌ రక్కసి ధాటికి సర్వం కోల్పోయిన ప్రజలు తల్లడిల్లిపోయారు. అలాంటి సమయంలో ప్రజలకు కావాల్సిన భరోసా ఇవ్వడమే కాదు. నేనున్నానంటూ చంద్రబాబు కొండంత అండగా నిలిచారు. నాలుగు గోడల మధ్య కూర్చొని సమీక్షలు చేయడం కాదు బస్సులోనే మకాం పెట్టి మరీ బాధితులకు   భుజం కాశారు. వ‌ర‌ద ప్రాంతాల్లో విస్తృత ప‌ర్య‌ట‌న‌లుచేస్తూ బాధితుల్లో మనోధైర్యం నింపి బతుకుపై ఆశను నింపారు. అధికారులను పరుగులు పెట్టించి మరీ కూలబడిపోయిందనుకున్న ప్రాంతాన్ని తిరిగి నిలబెట్టారు. నెలల వ్యవధిలో తుపాను గాయాన్ని తుడిచి విశాఖకు పూర్వవైభవం తీసుకొచ్చారు. అప్ప‌ట్లో విశాఖ ప్రాంత ప్ర‌జ‌లు ఎదుర్కొన్న ప‌రిస్థితి.. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌కు ఎదురైంది. కుండ‌పోత వర్షానికి తోడు..  కృష్ణానదికి రికార్డు స్థాయిలో వ‌చ్చిన వ‌ర‌ద‌,  బుడ‌మేరు ముంపుతో  విజ‌య‌వాడ‌లోని అనేక ప్రాంతాల్లోకి మ‌నిషి లోతు వ‌ర‌ద‌ నీరు చేరింది. ఇళ్లు నీట‌మునిగాయి. ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోయారు. వెంట‌నే రంగంలోకి దిగిన చంద్ర‌బాబు నాయుడు.. నేనున్నాను మీకేం కాదు అంటూ వ‌ర‌ద బాధితుల్లో భ‌రోసా క‌ల్పించేందుకు వ‌ర‌ద నీటిలోకి దిగారు. బోటులో ముంపు ప్రాంతాలలోకి వెళ్లారు. పొక్లెయిలో ప్రయాణించి మరీ ముంపు ప్రాంతాల్లో విస్తృత ప‌ర్య‌ట‌న‌లు చేశారు. అధికారుల‌ను, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించి త‌క్ష‌ణ‌మే ఆహార ప్యాకెట్లు, తాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు.  వ‌ర‌ద బాధితులకు భరోసా ఇచ్చారు. తమను ఆదుకోవడానికి చంద్రబాబు ఉన్నారన్న ధైర్యాన్నిచ్చారు. ఆయన వచ్చారు ఇక భయం లేదు వ‌ర‌ద ముంపు నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌తాం అనే ధీమాను క‌ల్పించారు. ఐదు రోజులు నిర్విరామంగా వ‌ర‌ద బాధితుల‌కు ఆహారం, తాగునీరు అందించ‌ డంతోపాటు.. వర‌ద ముంపు నుంచి బ‌య‌ట‌ప‌డిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య ప‌నులు చురుగ్గా జ‌రిగేలా చ‌ర్య‌లు తీసు కున్నారు. గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రీ చేయని రీతిలో బుర‌ద‌తో నిండిపోయిన బాధితుల ఇళ్ల‌ను క్లీన్ చేయించే బాధ్య‌త‌ను తీసుకున్నారు. 74ఏళ్ల వ‌య‌స్సులో విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద బాధితులను కాపాడుకునేందుకు చంద్ర‌బాబు ప‌డిన క‌ష్టాన్నిచూసి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లే కాదు.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు చంద్ర‌న్నా సెల్యూట్ అంటున్నారు.

తోడేళ్లు పగబడతాయా.. ప్రతీకారం తీర్చుకుంటాయా?

తోడేళ్లు పగబడతాయా? ప్రతీకారం తీర్చుకుంటాయా? కక్షగట్టి వెంటాడి, వేటాడి మరీ ఉసురు తీస్తాయా? అంటే ఉత్తర ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో జరుగుతున్న వరస సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ ఔననే అంటున్నారు అటవీ శాఖ అధికారులు.  ఇంత కాలం మనం పాములు పగబడతాయనే విన్నాం. అయితే పాములు పగబట్టడం అన్నది ఉట్టి మూఢనమ్మకమేననీ అందుకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవనీ తేలిపోయింది. ఇక జంతువులు పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటాయన్న మాటే ఇప్పడి దాకా మనం వినలేదు. కానీ అటవీ అధికారులు మాత్రం తోడేళ్లు పగబడతాయనీ, అందుకు బహ్రైచ్ లో తోడేళ్లు జరుపుతున్న వరుస దాడులే నిదర్శనమనీ చెబుతున్నారు.  తోడేళ్లు కూడా మనుషుల్లాగే సామూహికంగా జీవనం సాగిస్తాయనీ, వాటి మధ్య మనుషులకున్నంతగా గాఢమైన మమతానుబంధాలు పెనవేసుకుని ఉంటాయనీ చెబుతున్నారు. అటువంటి తోడేళ్ల గుంపులోని ఓ రెండు పిల్ల తోడేళ్లు ఓ ట్రాక్టర్ గుద్దడంతో చనిపోయాయి. ఆ సంఘటన జరిగి ఆరు నెలలు దాటింది. సరిగ్గా ప్రమాదంలో రెండు తోడేలు పిల్లలు చనిపోయిన నాటి నుంచీ అంటే గత ఆరు నెలలుగా తోడేళ్లు మనుషుల మీద పగబట్టాయి. బహ్రైచ్ గ్రామస్తుల మీద వరుస దాడులు చేస్తున్నాయి. గత ఆరు నెలలుగా తోడేళ్లు తమ ప్రతీకార దాడులతో ఆరడజను మందిని చంపేసి పీక్కు తిన్నాయి. మరో 36 మందిని తీవ్రంగా గాయపరిచాయి. అటవీ అధికారులు గ్రామాన్ని  తోడేళ్ల బెడద నుంచి విముక్తి చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.   బహ్రైచ్ గ్రామంపై దాడులు చేసి మనుషుల ప్రాణాలు తీస్తున్న తోడేళ్ల గుంపును కాల్చి చంపేందుకు యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.   

వీగిపోయిన జగన్ బ్యాచ్ ఫేకు ప్రచారం.. క్యాపిటల్ సిటీ అమరావతి సురక్షితం

ప్ర‌కృతి ప్ర‌కోపానికి విజ‌య‌వాడ‌ వ‌ణికిపోయింది. గ‌తంలో ఎప్పుడూలేని స్థాయిలో కురిసిన కుండ‌పోత వ‌ర్షానికి తోడు బుడ‌మేరు, కృష్ణా న‌దిలోకి రికార్డు స్థాయిలో వ‌ర‌ద రావ‌డంతో న‌గ‌రంలోని జ‌నావాసాల‌ను వ‌ర‌ద‌నీరు చుట్టు ముట్టింది. న‌డుములోతు నీటిలో ప్ర‌జ‌లు చిక్కుకుపోయారు. విజ‌య‌వాడ‌లోని ప‌లు ప్రాంతాల్లోకి వ‌ర‌ద‌నీరు చేర‌డంతో సీఎం చంద్ర‌బాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. అధికారులు, మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ వ‌ర‌ద ముంపు బాధితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. వారికి ఆహారం, తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తూ అండ‌గా నిలిచారు. 74ఏళ్ల వ‌య‌స్సులో ముంపు బాధితుల‌కు అండ‌గా నిలిచేందుకు నిద్రాహారాలు మరిచి రాత్రింబ‌వ‌ళ్లు చంద్ర‌బాబు ప‌డిన క‌ష్టాన్ని చూసి ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇలాంటి నాయ‌కుడు ఉండ‌టం ఏపీకి గ‌ర్వ‌కార‌ణం అంటూ రాష్ట్రం వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శంస‌లు జ‌ల్లు కురుస్తోంది. పొరుగు రాష్ట్రంలోని విపక్షం కూడా చంద్రబాబు కార్యదక్షత, సమర్థత, వరద బాధితులను ఆదుకోవడంలో ఆయన పడిన శ్రమను వేనేళ్ల ప్రశంసించింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు చంద్రబాబును పొగుడుతూ చేసిన ట్వీట్ చేశారు. చంద్రబాబుకు ప్రజలలో ఆదరాభిమానాలు పెరగడం, తమ మిత్రుడైన కేసీఆర్ కూడా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించడం   ఓర్వ‌లేని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేత‌లు చంద్ర‌బాబుదంతా ప‌బ్లిసిటీ స్టంట్ అంటూ విష ప్రచారానికి తెరలేపారు.  అలాగే  మొద‌టినుంచి అమ‌రావ‌తిపై క‌క్ష‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్‌.. వ‌ర‌ద‌ల కార‌ణంగా అమ‌రావ‌తి మునిగిపోయిందంటూ తన అనుకూల సోషల్ మీడియా ద్వారా  ఫేక్ ప్ర‌చారం చేశారు. తప్పుడు ఫొటోలు, వీడియోల‌తో సోష‌ల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ అమ‌రావ‌తిపై విషం చిమ్మంది.  ఈ క్ర‌మంలో.. అసలు అమ‌రావ‌తి ప్రాంతాన్ని వ‌ర‌ద నీరు ముంచెత్తిందా..?  హైకోర్టు ప్రాంతం నీటిలో మునిగిపోయిందా... స‌చివాల‌యంలోకి నీరు చేరిందా? అనే విషయాలు తెలుసుకుందాం.  నవ్యాంధ్ర రాజధాని అమరావతిని విఛ్చిన్నం చేయాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశ్వప్ర యత్నాలు చేశాడు. వైసీపీ నేతలు అమరావతి ప్రాంతాన్ని స్మశానం అనికూడా అన్నారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో అమరావతి ప్రాంతం అధ్వాన్న స్థితికి చేరింది. ముళ్ల చెట్లు కంపలతో  ఓ అడవిలా మారిపోయింది. కానీ, ఏపీ ప్రజలు మాత్రం మా రాజధాని అమరావతే అంటూ నమ్మారు. అదే విషయాన్ని ఎన్నికలలో తమ ఓటు ద్వారా విస్పష్టంగా తేల్చేశారు.  మూడు రాజధానుల పేరుతో అమరావతిని విఛ్చిన్నం చేయాలని చూసిన జగన్ మోహన్ రెడ్డి పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదాకూడా ఇవ్వలేదు. ఎన్నికల్లో ప్రజల తీర్పు తరువాతకూడా అమరావతిపై జగన్ మోహన్ రెడ్డి అనుకూల మీడియా, వైసీపీ సోషల్ మీడియా విషం చిమ్ముతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయి. గతంలో 120ఏళ్లలో ఎప్పుడూ రానంత స్థాయిలో వర్షం పడటం, వరదలు రావడంతో విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. బుడమేరు, కృష్ణానదిలోకి రికార్డు స్థాయిలో వరదనీరు వచ్చింది. దీంతో బుడమేరు వరద కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాల్లోకి వరదనీరు రావడంతో సీఎం చంద్రబాబు వెంటనే అప్రమత్తమై ముంపు బాధితులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. అర్థరాత్రి సైతం బోటుపై వెళ్లి వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వరద ముంపు ప్రాంతంలో నామమాత్రపు పర్యటన చేసి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కరకట్ట వద్ద చంద్రబాబు ఇంటిని వరద ముంపు నుంచి తప్పించేందుకు బడమేరు గేట్లు ఎత్తారని.. దానికారణంగా విజయవాడ నగరంలోని వరదనీరు వచ్చిందని జగన్ చెప్పుకొచ్చాడు. అసలు కరకట్ట వద్ద చంద్రబాబు ఇంటికి, బుడమేరుకు ఎలాంటి సంబంధం లేదు. బుడమేరు వాగుకు గేట్లు కూడా లేవు. కనీస అవగాహన, పరిజ్ణానం లేని జగన్ వ్యాఖ్యలతో సోషల్ మీడియా ఆయనను ఓ రేంజ్ లో ఆటాడుకుంటోంది.   నవ్యాంధ్ర రాజధాని అమరావతి వరద నీటిలో మునిగిపోయిందని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం ఫేక్ ప్రచారమని స్పష్టంగా అర్థమవుతోంది. అమరావతికి పది కిలో మీటర్ల దూరంలో విజయవాడ మహాన గరం వరద ముంపునకు గురైంది. గుంటూరులోనూ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అమరావతి మునిగిపోయిందంటూ ఫేక్ ప్రచారం మొదలు పెట్టింది. వాస్తవానికి అమరావతిలోకి  వరద నీరు చేరలేదు. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలు సహా కోర్ క్యాపిటల్ ప్రాంతం అత్యంత సురక్షితంగా ఉంది. రాజధాని గ్రామాల్లో వర్షం కారణంగా నీరు నిలిచింది. దీంతో కాలనీల్లోని రోడ్లపై నిలిచిన వర్షపు నీటికే రాజధాని పరిధిలోని గ్రామాలు వరదలో మునిగిపోయాయంటూ వైసీపీ బ్యాచ్ ఫేక్ ప్రచారం చేసింది. మరోవైపు.. కరకట్ట వద్ద చంద్రబాబు ఇల్లు కృష్ణా వరదలకు మునిగిందని ప్రజలను నమ్మించేందుకు వైసీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా విశ్వప్రయత్నాలు చేసింది. వైసీపీ అనుకూల మీడియాకు చెందిన కెమెరా మెన్లు, వీడియోగ్రాఫర్లు చంద్రబాబు ఇంటి వద్ద పడిగాపులు కాస్తున్నారు. వరదనీరు వస్తుంది.. పెద్దపెద్ద ఫొటోలతో విస్తృత ప్రచారం చేయొచ్చని అనుకున్నారు. కానీ, చంద్రబాబు ఇంటిలోకి వరద నీరు చేరకపోయే సరికి.. తప్పుడు ప్రచారానికి తెరలేపారు.  రాజధాని ప్రాంతానికి, నదికి మధ్యలో పెద్ద కరకట్ట ఉంది. వరదనీరు దాని వరకూ వచ్చి ఆగిపోయింది. ఆ రెండింటి మధ్యలో ఉన్న కొన్ని భవనాలు మాత్రం కొంతమేర ముంపుకు గురయ్యాయి. మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం నది ఒడ్డునే ఉంది. దానిలోకి నీళ్లు వచ్చాయి. ఆ పక్కనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉంటున్న అద్దె ఇల్లు ఉంది. ఆ ఇల్లు కూడా నదికి ఆనుకొనే ఉంటుంది. దీంతో ఆ ఇంటి ప్రాంతంలోకి స్వల్పంగా వరద నీరు చేరింది. దీంతో చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది. అమరావతి రాజధాని ప్రాంతంలోకి వరదనీరు పెద్ద ఎత్తున చేరిందంటూ జగన్ అనుకూల మీడియా ఫేక్ ప్రచారం చేస్తుంది. సాధారణంగా ఏ నదిలోకైనా ఎగువ ప్రాంతాల నుంచి పెద్దుత్తున వరదనీరు వచ్చి చేరినప్పుడు.. దాని పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం కృష్ణా నదికి గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో వరదనీరు వచ్చి చేరింది. రాబోయే కాలంలో ఇంతస్థాయి వరద రావటంకూడా అసాధ్యమనే చెప్పొచ్చు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో కృష్ణా నదిలో వచ్చిన వరదలకు, కుండపోత వర్షానికి అమరావతి చెక్కు చెదరలేదు. రోడ్లు క్లీన్ గా ఉన్నాయి. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని పక్కనపెడితే.. రికార్డు స్థాయిలో వచ్చిన వరదల్లోకూ అమరావతి సేఫ్ గా ఉదంటే .. ఏపీకి రాజధానిగా అమరావతి ఎంపిక ఎంత ఉత్తమమో తేలిపోయింది.

కత్తెర గాటు లేని ‘అమరావతి ఫైల్స్’ మీకోసం!

ఐదేళ్ళ జగన్ అరాచక పాలనలో అన్యాయానికి గురైన అమరావతి రైతుల ఆవేదనకు అద్దం పట్టేలా భాను దర్శకత్వంలో ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ ‘అమరావతి ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించారు.  సినిమా నిర్మాణమంటేనే కత్తిమీద సాములాంటిది. అలాంటిది అప్పటి అధికార పార్టీకి వ్యతిరేకంగా, అధికార పార్టీ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా ఒక సినిమాని నిర్మించాలంటే ఎంత కష్టమైన విషయమో ఊహించవచ్చు. ‘అమరావతి ఫైల్స్’ సినిమా నిర్మాణానికి జగన్ ప్రభుత్వం మొదటి నుంచీ ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసింది.   జగన్ సైకో ప్రభుత్వం అమరావతి రైతులను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ‘అమరావతి ఫైల్స్’ సినిమా నిర్మాణం విషయంలో కూడా అన్ని ఇబ్బందులు పెట్టింది. ఈ సినిమా నిర్మాణాన్ని ఆపించడానికి ఎన్నో అనైతిక దారుల్లో ప్రయత్నించింది. అయినప్పటికీ నిర్మాత కంఠంనేని రవిశంకర్ ఏ దశలోనూ వెనుకడుగు వేయకుండా సినిమా నిర్మాణాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి చేశారు. అమరావతి ప్రాంత రైతుల అంతరాత్మను ఆవిష్కరించే విధంగా అద్భుతంగా రూపొందిన ‘అమరావతి ఫైల్స్’ చిత్రానికి సెన్సార్ సమయంలోనూ, విడుదల సమయంలోనూ జగన్ ప్రభుత్వం సమస్యలు సృష్టించింది. అనేక కతెర గాటులకు చిత్రాన్ని గురిచేసింది. టైటిల్ విషయంలో కూడా అభ్యంతరం లేవనెత్తింది. అమరావతి రాజధాని ప్రాంత రైతుల గుండె చప్పుడుగా రూపొందిన ఈ చిత్రానికి ‘అమరావతి ఫైల్స్’ అనే టైటిల్ వుండకూదంటూ సైకో జగన్ ప్రభుత్వం పట్టుబట్టింది. ఈ విషయంలో కంఠంనేని రవిశంకర్ ఎంతో పోరాటం చేశారు. అయితే రాజుకంటే మూర్ఖుడు చాలా బలవంతుడు అంటారు. అప్పట్లో రాజు కూడా సాక్షాత్తూ మూర్ఖుడే. దాంతో ఈ సినిమా టైటిల్‌కి ‘రాజధాని ఫైల్స్’గా మార్చక తప్పలేదు.  ఇక విడుదల సమయంలో కూడా జగన్ చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాకి మంచి థియేటర్లు దొరక్కుండా చేశారు. ఒక దశలో విడుదల ఆపడానికి కూడా ప్రయత్నించారు. అయితే, నిర్మాత కంఠంనేని రవిశంకర్ మడమతిప్పని పోరాటం చేసి విడుదల చేశారు. ‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలయ్యాక సంతృప్తికరమైన ప్రేక్షకాదరణను ఈ సినిమా సొంతం చేసుకుంది. కమర్షికల్ లెక్కల సంగతి అలా వుంచితే, ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని, అమరావతి రైతుల ఆవేదనను సరైన సమయంలో సరైన రీతిలో ఆవిష్కరించారనే అభినందనలు భారీ స్థాయిలో అందాయి. నిర్మాత కంఠంనేని రవిశంకర్ ఈ సినిమాని మట్టి మీద అభిమానంతో నిర్మించారే తప్ప, మనీ ఆశించి కాదు. ‘రాజధాని ఫైల్స్’ కోసం తాను ఖర్చుపెట్టిన డబ్బుని నేలతల్లి కోసం ఖర్చు పెట్టినట్టుగా ఆయన భావించారు. థియేటర్ల ద్వారా ప్రజలకు చేరువైన ‘రాజధాని ఫైల్స్’ ఆ తర్వాత యూట్యూబ్ మాధ్యమం ద్వారా ప్రతి తెలుగు గడపనూ పలకరించింది. ప్రతి తెలుగువాడి చేతితో కరచాలనం చేసింది.  అమరావతి రాజధాని విషయంలో జగన్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో ఈ సినిమా ప్రజల ముందుకు చాలా ప్రభావవంతంగా తీసుకెళ్ళింది. 2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మట్టికొట్టుకుపోవడానికి దోహదం చేసిన అనేక అంశాలలో ‘రాజధాని ఫైల్స్’ సినిమా కలిగించిన ప్రభావం కూడా ఒకటి అనే ప్రశంసలు అందాయి. ఆ విధంగా ఎంతో శ్రమించిన నిర్మించిన ఈ సినిమా ప్రయోజనం నెరవేరినట్టు అయింది. మట్టిమనుషులను అవమానించిన జగన్ నోట మట్టి కొట్టడానికి నిర్మాత కంఠంనేని రవిశంకర్ చేసిన కృషి ఫలించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రాక్షస పాలన లేదు. ఇంతకాలం అంధకారంలో వున్న రాజధాని అమరావతి ఇప్పుడు మళ్ళీ రెక్కలు విప్పుతోంది. అంతర్జాతీయ స్థాయికి ఎగరడానికి, ఎదగడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బలవంతంగా పేరు మార్పిడికి, కత్తెర గాటుకి గురైన ‘అమరావతి ఫైల్స్’ చిత్రం కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసారి ‘రాజధాని ఫైల్స్’ అని కాకుండా ‘అమరావతి ఫైల్స్’ పేరుతో తెలుగు ప్రజల ముందు సగర్వంగా, సగౌరవంగా నిలబడింది. కత్తెర గాటుకి గురికాని ‘అమరావతి ఫైల్స్’ పూర్తి నిడివి చిత్రం ‘తెలుగువన్’ యూట్యూబ్ ఛానల్లో ప్రేక్షకులకు అందుబాటులో వుంది. అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని చరిత్రలో నిలిపేలా చేసి, చరిత్ర సృష్టించిన ‘అమరావతి ఫైల్స్’ మీ అభినందనలు అందుకోవడానికి యూట్యూబ్‌లో ఎదురుచూస్తోంది.  

చంద్రబాబుకు జేజేలు.. జగన్ కు ఛీచీలు!

చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తింది. బెజవాడ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది.  నగరానికి నలుమూలలా ఉన్న చిట్టినగర్, భవానీపురం, రామవరప్పాడు, సుందరయ్య నగర్, రామలింగేశ్వరనగర్, యనమలకుదురు  ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. ఇటువంటి విపత్తు బెజవాడ ప్రజలకు కొత్తేమో కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాదు..  విశాఖ నగరాన్ని హుద్ హుద్ తుపాను మంచెత్తిన సమయంలోనూ, అంతకు ముందు కోనసీమను ఉప్పెన ముంచేసిన సమయంలోనూ చంద్రబాబు గంటల వ్యవధిలో బాధితుల చెంతకు చేరి వారికి ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే. బాధితులకు భరోసా కల్పిస్తూ, వారిలో ధైర్యం నింపుతూ వారు పూర్తిగా తేరుకునే వరకూ, చివరి బాధితుడిని కూడా ఆదుకునేంత వరకూ అక్కడే మకాం వేసి పరిస్థితి కుదుటపడిన తర్వాతే వెనుదిరిగారు. ఇప్పుడు ఆ సంఘటనలకు బెజవాడ జనం గుర్తు చేసుకుంటూ, తమకేం ఢోకా లేదన్న ధైర్యంతో ఉన్నారు. ముఖ్యంగా హుద్ హుద్ తుపాన్ విశాఖను అతలాకుతలం చేసింది. పచ్చదనాన్ని మాయం చేసింది. భారీ వృక్షాలను కూల్చేసింది. సమాచార వ్యవస్థను నాశనం చేసేసింది. రాకాసి గాలులు ప్రళయం సృష్టించాయి. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ధ్వంసమైపోయింది. అలాంటి విశాఖను రోజుల వ్యవధిలోనే సాధారణ స్థితికి తీసుకు వచ్చారు. విద్యుత్ సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేలా అధికారులను పరుగులెత్తించారు. కూలిన సెల్ టవర్ల కారణంగా సమాచార వ్యవస్థ స్తంభించిపోతే.. 24 గంటల వ్యవధిలో పునరుద్ధరించారు. అప్పుడు కూడా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం విశాఖ చేరుకుని బాధితులకు అండగా నిలిచారు చంద్రబాబు. రోజుల తరబడి విశాఖలోనే మకాం వేసి.. బస్సులోనే విశ్రాంతి తీసుకుంటూ, అలుపెరుగకుండా పని చేశారు. విశాఖను నిలబెట్టారు. ఇప్పుడు వరదలతో అతలాకుతలమైన విజయవాడ నగరానికి, వరద బాధితులకు కొండంత అండగా నేనున్నానంటూ నిలబడ్డారు. 74 ఏళ్ల వయస్సులోనూ రేయింబవళ్లు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ, బాధితుల్లో ధైర్యం నింపుతున్నారు.  వరద ఉధృతి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన క్షణం నుంచి చంద్రబాబు ఫీల్డ్ లోకి దిగారు, అర్థరాతరి అపరాత్రి అన్న తేడా లేకుండా వరద ప్రభావిత ప్రాంతాలలో బోటులో తిరుగుతూ  సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు. బాధితుల్లో ధైర్యం నింపారు.  బెజవాడలో వరద ఉధృతికి భయపడి అధికారులే బాధితులను చేరుకోవడానికి వెనకడుగు వేస్తున్న తరుణంలో చంద్రబాబు స్వయంగా వరద నీటిలోకి దిగి ప్రజలకు అభయం ఇవ్వడం జనంలో ధైర్యాన్ని నింపింది. దీంతో అధికారులూ అనివార్యంగా ముందుకు వచ్చి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 74 ఏళ్ల వయస్సులో పాతికేళ్ల కుర్రాడిలా నిరంతరాయంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనలు చేస్తూ ప్రజలకు అండగా చంద్రబాబు ఉన్నారు.   అయితే 2024 మార్చి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి,  ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ మాత్రం బాధితుల వద్దకు వెళ్లి వెకిలి నవ్వులతో ప్రభుత్వంపై , చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఇంతకీ ఆయన వరద ప్రభావిత ప్రాంతాలలో చేసిన పర్యటన వ్యవధి కేవలం అరగంట మాత్రమే. ఆ అరగంటా కూడా చిరునవ్వులు, ప్రభుత్వంపై విషపూరిత విమర్శలు వినా బాధితులకు ధైర్యం చెప్పిన పాపాన పోలేదు. దీంతో జగన్ తీరును చీదరించుకున్న జనం ఆయనను పట్టించుకోలేదు. పైగా తమకు ప్రభుత్వం నుంచి సహాయం అందుతోందని ముఖం మీదే చేప్పేసి చంద్రబాబుకు జేజేలు పలికారు. 

కృష్ణలంక రిటైనింగ్ వాల్ పై వైసీపీ కాకమ్మ కబుర్లు.. వాస్తవమేంటంటే?

ఓ వైపు బెజవాడ నగరం మొత్తం వరద ముంపునకు గురై అల్లాడిపోతోంది. లక్షలాది మంది నిలువ నీడ లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం సహాయ పునరావాస కార్యక్రమాలలో నిమగ్నమై ఉంది. అధికార కూటమి నేతలూ, కార్యకర్తలూ కూడా యధాశక్తి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే వైసీపీ మాత్రం ప్రజల కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా... ప్రకృతి విపత్తును చంద్రబాబు పాలనా వైఫల్యం ఖతాలో వైసేసి పోలిటికల్ మైలేజీ పొందాలని తహతహలాడుతోంది. విజయవాడలోని కృష్ణలంక ప్రాంతం వారద ముంపు బారిన పడకుండా ఉండడానికి జగన్ హయాంలో నిర్మించిన రిటైనింగ్ వాలే కారణమని గప్పాలు కొట్టుకుంటోంది. 3.44 కిలో మీటర్ల పొడవైన ఈ రిటైనింగ్ వాల్ మొత్తాన్ని జగన్ తన హయాంలోనే నిర్మించేశారని చెప్పుకుంటూ  తమ భుజాలను తామే చరిచేసుకుంటున్నారు.  అయితే వాస్తవమేమిటంటే.. కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చంద్రబాబు హయాంలో డీపీఆర్ సిద్ధమైంది. ఆయన హయాంలోనే రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా ఆరంభమైంది. ఈ రిటైనింగ్ వాల్ ను మూడు దశలలో నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 3.44 కిలోమీటర్ల పొడవైన ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని మొదటి దశలో  రామలింగేశ్వర్ నగర్, రాణిగారి తోట వరకూ, రెండో దశలో రాణిగారి తోట నుంచి కనకదుర్గ వారధి వరకూ, మూడో దశలో కనకదుర్గ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకూ నిర్మించాలని నిర్ణయించారు. ఈ మూడు దశలలో తొలి రెండు దశల నిర్మాణం చంద్రబాబు హయాంలోనే పూర్తి అయిపోయింది. అంటే మొత్తం 3.44 కిలోమీటర్ల పొడవైన రిటైనింగ్ వాల్ లో తొలి రెండు దశలలో 2.28 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ నిర్మాణం చంద్రబాబు హయాంలోనే పూర్తయ్యింది. కృష్ణలంకను వరద ముంపు నుంచి కాపాడడానికి తలపెట్టిన ఈ రిటైనింగ్ వాల్ లో తొలి రెండు దశల నిర్మాణం చాలా సంక్షిష్టమైనది. చంద్రబాబు హయాంలో  ఈ సంక్షిష్ట నిర్మాణం పూర్తఅయిపోయింది. వాస్తవానికి మూడో దశ కూడా ఆయన హయాంలోనే పూర్తి కావలసి ఉంది. అయితే వైసీపీ ఇక్కడ తన మార్క్ రాజకీయానికి తెరలేపింది.   అప్పటికి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ మూడో దశ రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయే స్థానికులను రెచ్చగొట్టింది. వారికి ప్రత్యామ్నాయంగా ఇళ్లు నిర్మించి ఇస్తామనీ, నష్టపరిహారం ఇస్తామని బాబు సర్కార్ హామీ ఇచ్చినా వారు అందుకు అంగీకరించకుండా చేయడమే కాకుండా కోర్టులలో కేసులు వేసేలా వారిని పురిగొల్పింది. దాంతో బాబు హయాంలో మూడో దశ నిర్మాణం పూర్తి కాలేదు.  ఆ తరువాత 2019 ఎన్నికలలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణలంక రిటైనింగ్ వాల్ మూడో దశ నిర్మాణం పూర్తి అయ్యింది. అప్పట్లో విపక్షంలో ఉన్న తెలుగుదేశం.. ఆ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కృష్ణలంక వరద ముంపు సమస్య నుంచి శాశ్వతంగా బయటపడుతుంది కనుక నిర్మాణాన్ని అడ్డుకోవడం సమంజసం కాదని భావించింది.   2019 ఆగస్టులో కృష్ణా నదికి వచ్చిన భారీ వరదలలో కృష్ణ లంక సురక్షితంగా ఉండడానికి రిటైనింగ్ వాలే  కారణం. అది వేరే సంగతి.  ఇప్పుడు వైసీపీ కృష్ణలంక వరద ముంపు నుంచి సురక్షితంగా ఉండడానికి తాము నిర్మించిన రిటైనింగ్ వాలే కారణమని చెప్పుకుంటోంది. రిటైనింగ్ వాల్ మూడు దశల నిర్మాణం తమ హయాంలోనే పూర్తయ్యిందని చెప్పుకోవడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు. గత రెండు రోజుల నుంచీ కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణం ఘనత అంతా జగన్ ఖాతాలో వేసేయడానికి గత రెండు రోజులుగా వైసీపీ సోషల్ మీడియా నానా రకాలుగా తంటాలు పడుతోంది. 2019 జూన్ లో అధికార పగ్గాలు చేపట్టిన జగన్ 2019 ఆగస్టు నాటికి కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసేశారని చెప్పుకుంటూ జనాలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే జగన్ తన ఐదేళ్ల కాలంలో బటన్ నొక్కడం వినా మరో పని చేయలేదన్న సంగతి జనాలను స్పష్టంగా తెలుసు. సొంత సోషల్ మీడియాలో ఎంతగా గప్పాలు కొట్టుకున్నా నమ్మడానికి జనం సిద్ధంగా లేరు.  అయినా కూడా ప్రస్తుత వరదల సమయంలో కూడా ప్రజల కష్టాలను పట్టించుకోకుండా సొంత డబ్బా వాయించుకోవడానికి జగన్ పార్టీ పడుతున్న ప్రయాసను చూసి జనం చీదరించుకుంటున్నారు. 

నెత్తిన చెయ్యి.. నత్తి పకోడీ..!

నత్తి పకోడీ అని చాలామంది పిలిచే వైఎస్ జగన్ విచిత్రమైన వేషాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి. అధికారంలో వున్నప్పుడే అంధకారంలో వున్నట్టుగా ప్రవర్తించేవాడు. అధికారం పోయిన తర్వాత మరీ దారుణంగా తయారయ్యాడు. ఎక్కడ ఎలా వుండాలో, ఎక్కడ నవ్వాలో, ఎక్కడ బాధపడాలో కూడా తెలియని వ్యక్తి కాబట్టే, ఆ మహామేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం కొడుకు పేరు చెబితేనే చిరాకు పడేవాడు. ఆంధ్రుల ఖర్మకాలి ఈ దరిద్రాన్ని ఐదేళ్ళపాటు నెత్తిన పెట్టుకోవాల్సి వచ్చింది. ఐదేళ్ళ దరిద్రం వదిలిపోయింది కదా అని ఊపిరిపీల్చుకునే అవకాశం కూడా ఇతగాడు ఆంధ్రులకు ఇవ్వడం లేదు. ఏదో ఒక రచ్చ చేస్తూ తన శాడిజాన్ని ప్రదర్శిస్తూనే వున్నాడు. మొన్నామధ్య వైజాగ్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే రాష్ట్రప్రభుత్వం సహాయ కార్యక్రమాల్లో కావచ్చు.. ఎక్స్.గ్రేషియా విషయంలో కావచ్చు... ఇలా ఏ విషయంలో అయినా ప్రశంసనీయంగా పనిచేసింది. ఆ సమయంలో జగన్ చేసిన పనేంటి? తన విషపు మీడియాలో సాధ్యమైనంత విషం కుమ్మరించడం. ఆ తర్వాత బాధితుల పరామర్శ పేరుతో ఆస్పత్రికి వచ్చి షిక్కటి షిరునవ్వుతో పలకరించడం. దీనికితోడు ఈయనగారి ట్రేడ్ మార్క్ అయిన నెత్తిన చెయ్యిపెట్టి దీవించడం.  గుడ్లవల్లేరు కాలేజీ హాస్టల్ విషయంలో కూడా జగన్ తీరు ఇదే. అసలు అక్కడ జరిగింది ఒకటి. జగన్ మీడియా విషపు నాగు కక్కిన విషం మరొకటి. ఒకపక్క కాలేజీలోని ఆడపిల్లల్లో భయాందోళనలను తొలగించే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే, ఈ శాడిస్టు తాలూకు పరమ శాడిస్టు మీడియా కట్టుకథలు అల్లి ప్రచారం చేసింది. ఆడపిల్లలు ఇంకా ఆందోళనకు గురయ్యేలా చేసింది. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు ఈ సైకో జగన్‌ చేతిలో కాలనాగు లాంటి మీడియా దొరికింది. ఇప్పుడు విజయవాడ వరదల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్ళు సహాయ కార్యక్రమాలలో నిమగ్నమై వుంటే, జగన్ మీడియా తనదైన శైలిలో విషం కలిపిన కథనాలు వండి వడ్డిస్తోంది. ఇక జగన్ అయ్యగారు వరద ప్రభావిత ప్రాంతాలకు పిక్నిక్‌కి వచ్చినట్టుగా వచ్చాడు. అలా కారులోంచి కిందకి దిగాడు. అక్కడ కష్టాల్లో వున్నవారిని తనదైన ‘షిక్కటి షిరునవ్వు’తో పలకరించాడు. తన చేతికి అందుబాటులో వున్నవారి నెత్తిన చేతులు పెట్టి దీవించి, మళ్ళీ తన కారు ఎక్కి వెళ్ళిపోయాడు. రేపు లండన్ వెళ్తున్నాడు కదా.. దానికి సంబంధించిన సామాను సర్దుకునే బిజీలో వున్నట్టున్నాడు బిడ్డ!  ఈ వీరుడు ఎక్కడకి వచ్చినా దిక్కుమాలిన నవ్వొకటి నవ్వుతూ జనాన్ని ఇరిటేషన్‌కి గురిచేస్తున్నాడు. ఏ సందర్భంలో ఎలా వుండాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియని ఈ నత్తిపకోడీకి నెత్తిన చేతులుపెట్టి ఈ దిక్కుమాలిన దీవించే అలవాటేంటో! ఎక్కడకి వెళ్ళినా నెత్తిన చేతులు పెట్టడం.. దీవించేయడం. ఐదేళ్ళు జనం నెత్తిన చేతులుపెట్టింది సరిపోనట్టుంది. 

బంగ్లాదేశ్ బెదిరింపు సెక్షన్!

పిల్లకుంక బంగ్లాదేశ్ భారతదేశం మీద బెదిరింపులకు దిగుతోంది. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాని  తమకు అప్పగించాలి అంటూ ఓవర్ యాక్షన్ చేస్తోంది. భారతదేశం సహకారంతో స్వాతంత్ర్యం పొందిన ఈ దేశం ఇప్పుడు ఇండియానే ఎదిరిస్తూ మాట్లాడుతోంది. షేక్ హసీనాను భారత్ తమ దేశానికి అప్పగిస్తుందా, లేదా అని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఆవేశంగా ప్రశ్నిస్తోంది. బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండీ తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ, హసీనాను బంగ్లాదేశ్‌కి రప్పించడానికి యూనస్ ప్రభుత్వం ఎంతదూరమైనా వెళ్తుందని అన్నారు. హసీనాని తమకు అప్పగించాలని ఇండియాని ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఇవ్వడం లేదని ఆయనగారు సీరియస్ అయిపోయారు. హసీనాను తమకు అప్పగిస్తారా లేదా అనే విషయంలో ఇండియా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. "మా న్యాయ వ్యవస్థ ద్వారా హసీనాను ఎలాగైనా బంగ్లాదేశ్‌కి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.’’ అంటున్నారు. హసీనా ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టడంతో ఆమె బంగ్లాదేశ్‌ని విడిచిపెట్టి ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు. ఆమెకు ఇండియాలోనే ఆశ్రయం కొనసాగితే భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని బంగ్లాదేశ్ అధికారులు అంటున్నారు. 

ఆయుత్థాయ బౌద్ధ పర్యాటకుల్ని బుద్ధవనానికి రప్పించాలి!

బుద్ధవనం కన్సల్టెంట్‌ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి థాయ్‌లాండ్‌ పూర్వరాజధాని ఆయుత్థాయలోని బౌద్ధారామ శిథిలాలు ప్రపంచ బౌద్ధుల్ని ఆకట్టుకొంటున్నాయని, నాగార్జున సాగర్‌లో పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్మించిన బుద్ధవనం, బుద్ధిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కన్సెల్టెంట్‌, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. బ్యాంకాక్‌లో జరిగిన ఫసిఫిక్‌ ఏసియా ట్రావెల్‌ అసోసియేషన్‌ 50వ సదస్సులో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైన ఆయన స్థానిక బౌద్ధ పర్యాటక స్థావరాల సందర్శనలో భాగంగా, శుక్రవారం (ఆగస్టు 30)నాడు ఆయుత్థాయలోని ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించబడిన వాట్‌ ప్రసిసంపేట్‌, వాట్‌, మహాతట్‌, విహాన్‌ ప్రయంగ్‌ ఖాన్‌, మహా పరినార్వణ బుద్ధ, వాట్‌ రచబురణ, వాట్‌ ఛైవత్థానారాం, బౌద్ధారామాల శిథిలాలు, శిల్పాలను సందర్శించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.  సియా రాజ్య రెండో రాజధానిగా, చక్కటి పట్టణ ప్రణాళిక, అరుదైన నీటి సరఫరా వ్యవస్థ, సువిశాల రాజప్రసాదం, ఆకాశాన్నంటే శిఖరాలతో నున్న బౌద్ధ చైత్యాలయాలు, వందలాది శిథిల బౌద్ధ శిల్పాలు, ప్రార్థనా మందిరాలు, స్థూపాలతో క్రీ.శ.1350లో స్థాపించబడిన ఆయుత్థాయ, క్రీ.శ.1767లో జరిగిన బర్మియుల దాడిలో గత వైభవాన్ని కోల్పోయిందన్నారు.  క్రీ.శ.17వ శతాబ్దిలో, జపాన్‌, చైనా, ఇండియా, పర్షియా, ఐరోపా, వాస్తు శిల్పాల మేళవింపుతో, రత్న కోశిని కళా సంస్కృతికి చిహ్నంగా, ఒక సార్వజనీన నగరంగా, గొప్ప బౌద్ధ కేంద్రంగా, ఆయుత్థాయ గుర్తింపు పొందిందన్నారు. వాట్‌ మహాతట్‌ బౌద్ధారామంలోని రావి చెట్టు కాండంలో ఇరుక్కు పోయిన బుద్ధని తల శిల్పం, వాట్‌ ప్రసిసంపేట్‌లోని ముగ్గురు రాజుల ధాతువులపై నిర్మించిన మూడు పగోదాలు, బుద్ధుని 100 అడుగుల మహా పరినిర్మాణ శిల్పం ఇక్కడి ప్రత్యేకతలనీ, శిథిలాలైనా, బుద్ధుని ధర్మ పరమణాలను వెదజల్లుతున్నాయనీ, ఇక్కడి పర్యాటకులు, బుద్ధవనం సందర్శించేలా చేయాలని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేసారు.  

చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా ముప్పై వసంతాలు!

సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితంలో చాలా ముఖ్యమైన రోజు... 1995 సెప్టెంబర్ ఒకటో తేదీన చంద్రబాబు నాయుడు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఇప్పటికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 సెప్టెంబర్ ఒకటో తేదీన ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పయ్యో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ రంగ ప్రస్థానాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకోవడం సముచితం.  విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే 1970లలో చంద్రబాబు యూత్ కాంగ్రెస్‌లో చేరారు. 1978లో కాంగ్రెస్ టికెట్ పైనే తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్‌ మంత్రిగా పని చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడే ఆయనకు ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తరువాత ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరినే చంద్రబాబు పెళ్లి చేసుకున్నారు. 1982లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారు. కానీ, అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌ను వీడలేదు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత ఏడాదిలోనే ఆయన టీడీపీలో చేరి ఎన్టీఆర్‌కు కుడిభుజంలా మారారు. క్రమంగా పార్టీలో ఎన్టీఆర్ తరువాత శక్తిమంతమైన నేతగా, పార్టీ జనరల్ సెక్రెటరీగా మారారు. 1994 వరకు టీడీపీ హయాంలో ఆయన మంత్రి పదవి చేపట్టలేదు. ఆ తరువాత ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక, 1995లో కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఎన్టీఆర్ స్థానంలో ముఖ్యమంత్రిగా, టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈరోజు వరకూ తెలుగుదేశం పార్టీ మనగలిగిందీ అంటే, ఆరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయమే కారణం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది చంద్రబాబును ఎంతో విమర్శించారు. అయినప్పటికీ పార్టీ కోసం, ప్రజల కోసం నిందలను భరించారు చంద్రబాబు.  ఏపీ ముఖ్యమంత్రి హోదాలో జాతీయ రాజకీయాలను కూడా చంద్రబాబు ఎంతో ప్రభావితం చేశారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో, దేవెగౌడ ప్రధాని కావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఆశ్చర్యకర రీతిలో యూ టర్న్ తీసుకొని బీజేపీతో జతకట్టి మొదటి నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అటల్ బిహారీ వాజపేయీ ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు మార్గం సుగమం చేశారు.2004లో ఏపీలో టీడీపీ కేంద్రంలో ఎన్డీయే ఓటమి పాలయ్యేవరకు ఆయన ఎన్డీయేతోనే కలిసున్నారు. 2014లో యూపీయే ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లును పాస్ చేశాక, మళ్లీ ఆయన బీజేపీతో చేతులు కలిపి ఎన్డీయేలో చేరారు. మోదీకి భావి ప్రధానిగా మద్దతు పలికారు. ఆంధ్ర ప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదన్న కారణంతో 2018 మార్చిలో ఎన్డీయే నుంచి వైదొలిగి బీజేపీకి వ్యతిరేకంగా మారారు. కాంగ్రెస్‌తో సహా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసి 2019 ఎన్నికలను ఎదుర్కొన్నారు. అయితే ఆ ఎన్నికలలో ఆయన పరాజయం చవిచూశారు. అయినప్పటికీ నిరాశపడకుండా, ఐదేళ్ళపాటు జగన్ రాక్షస ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పుడు మళ్ళీ 2024లో మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  చంద్రబాబు జీవితం తెరిచిన పుస్తకం. గడచిన నాలుగు దశాబ్దాల అవిభక్త ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్ర రాజకీయ చరిత్ర నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయ, జీవిత చరిత్ర వేరు చేయడం కుదిరే వ్యహారం కాదు. ముఖ్యంగా 1995లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కోట్ల విజయభాస్కర రెడ్డి మొదలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డివరకు రాజకీయ ప్రత్యర్ధులు అనేక మంది వచ్చి వెళ్ళారు. చరిత్రకే పరిమితమయ్యారు. కానీ, చంద్రబాబు నాయుడు తిరుగులేని నాయకునిగా, ఇటు ముఖ్యమంత్రిగా అటు ప్రతిపక్ష నేతగా చరిత్ర సృష్టించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రలో అత్యధిక కాలం సేవలు అధించిన  ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా, సేవలు అందించారు.రాష్ట్ర విభజనకు ముందు తర్వాత  కూడా ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఏకైక నాయకుడుగానూ చంద్రబాబు నాయుడు చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటికీ ప్రతిపక్ష నేతగా అనుక్షణం ప్రజల పక్షాన నిలిచి, నిఖార్సయిన రాజకీయాలకు నిలవెత్తు నిదర్శనంగా ఉన్నారు. సెవెన్టీ ప్లస్ వయస్సులోనూ అదే ఉత్సాహంతో, అదే దీక్షతో నవ్యాంధ్ర కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.  నిజానికి చంద్రబాబు రాజకీయ అరంగేట్రం మొదలు, అయన రాజకీయ ప్రస్థానంలోని ప్రతి మలుపు మరో సంచలనంగా చరిత్ర పుటల్లో నిలిచి పోయిందంటే అతిశయోక్తి కాదు. కాలేజీలో చదివే రోజుల్లోనే రాజకీయ చైతన్యం ఆయనలో మొగ్గ తొడిగింది. విద్యార్థి నాయకుడిగా తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాలలో ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్, హిస్టరీలో  విద్యను ముగించారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం ఎంఏ, మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పట్టా పొందారు.  ఈ దశలోనే క్రియాశీల రాజకీయాల వైపు ఆయన అడుగులు పడ్డాయి. 1977లో దివిసీమ ఉప్పెన సందర్బంగా చంద్రబాబు నాయకత్వంలో చేపట్టిన సహాయక చర్యలు ఆయనలోని సామాజిక సేవాభిలాషకు, మానవత్వానికి, నాయకత్వ పటిమకు అద్దం పట్టాయి. చంద్రబాబు నాయకత్వ ప్రతిభను గమనించిన అగ్రనాయకులు 1978లో చంద్రగిరి నియోజకవర్గానికి అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు.  ఇరవై ఎనిమిదేళ్ళ వయస్సులో సినిమాటోగ్రఫి, పురావస్తుశాఖ, సాంకేతిక విద్యా శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టి నూతన కార్యక్రమాలకు నాంది పలికారు. తదనంతర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చివేసినప్పుడు చంద్రబాబునాయుడు సారథ్యంలో జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టడం చారిత్రాత్మకం. 1989లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైనప్పుడు, ఎన్టీఆర్‌ అసెంబ్లీని బహిష్కరించినప్పుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టి చట్టసభల్లో అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.  1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధే  లక్ష్యంగా అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. ఒక ముఖ్యమంత్రి జిల్లా కేంద్రాలకు వెళ్లడమే గగనమనుకునే రోజుల్లో ఆయన గ్రామ గ్రామానికీ చొరవగా వెళ్ళారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు.   జన్మభూమి కార్యక్రమంతో రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు పరుగులు తీయించారు. ప్రభుత్వ పథకాల లోటుపాట్లను స్వయంగా సమీక్షించేందుకు ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక బోర్డును ఏర్పాటు చేశారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు, కంప్యూటర్‌ విద్య, మహిళా కండక్టర్లు వంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు.  దార్శనికతతో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో అగ్రగామిగా నిలిపారు. అమెరికా వెళ్లి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలను హైదరాబాద్‌ తీసుకురాగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా యువతకు కళ్లు చెదిరే జీతాలొచ్చాయి. రైతు బిడ్డలనూ రత్నాలుగా మార్చారు. మారుమూల గ్రామాలకు కూడా ఐటీ రంగాన్ని పరిచయం చేశారు.  ముఖ్యంగా, యునైటెడ్‌ ఫ్రంట్ కన్వీనర్‌గా దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌లను ప్రధానులుగా చేశారు. 1999లో వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. లౌకికవాదానికి కట్టుబడి బైట నుండి షరతులతో కూడిన మద్దతు ఇచ్చారు. ముస్లిం వర్గానికి చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిగా చేయటంలో కీలక పాత్ర పోషించారు. దళిత నేత జిఎంసి బాలయోగిని అత్యున్నత చట్టసభ లోక్‌సభ స్పీకర్‌గా చేశారు.   అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే. మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు అన్న పానీయాలు విడిచి  నిరహారదీక్ష చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ హైకమాండ్‌ రాష్ట్ర విభజన అంశాన్ని వినియోగించుకొని తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టడంపై ఢిల్లీ స్థాయిలో నిలదీశారు. ఏపీ భవన్‌లో ఆరు రోజులపాటు నిరశన దీక్ష చేసి తెలుగు వారి సమస్యలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేశారు.   దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా అరవై మూడేళ్ళ వయసులో కాళ్లు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా  7 నెలలపాటు దాదాపు 2,817 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్య పరిచారు.  చంద్రబాబునాయుడి జీవితంలో నేర చరిత్ర లేదని ప్రతిపక్ష నేతలే ఒప్పుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఆయనపై అవినీతి మరక అంటించేందుకు ప్రత్యర్థులు కోర్టుల్లో వేసిన కేసులన్నీ నీరుగారిపోయాయి. పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రతీ కార్యకర్తకు నూటికి నూరుశాతం సంక్షేమనిధి ద్వారా న్యాయం జరిగేలా చేశారు. జయాపజయాలు రాజకీయ నాయకులకు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే చంద్రబాబు నాయుడిని ఈ స్థాయిలో నిలబెట్టింది.  అందుకే చంద్రబాబు ... కేవలం రాజకీయ నాయకుడిగానే కాదు, ఒక రాజనీజ్ఞునిగా చరిత్ర పుటల్లో  ఒకే ఒక్కడుగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

ఒక రోజు ముందే పెన్షన్ల పండుగ.. చంద్రబాబుకు జనం జేజేలు

మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. ప్రజలకు నిజమైన సంక్షేమం అందించాలన సత్సంకల్పంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... తన సంకల్పానికి నిధుల కొరత ఎంత మాత్రం అడ్డంకి కాబోదని చాటారు. సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకున్నారు. జనం దృష్టిలో విశ్వసనీయతకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఎందుకు నిలిచారన్నదానికి సెప్టెంబర్ నెల పెన్షన్లను ఒక రోజు ముందే పంపిణీ చేయడం ద్వారా మరో సారి అందరికీ అవగతమయ్యింది. మాట ఇస్తే నెరవేర్చుకుంటానని బాబు మరోసారి నిర్ద్వంద్వంగా రుజువు చేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని చెప్పే చంద్రబాబు అదే బాటలో ఎలాంటి తడబాటూ లేకుండా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో పెన్షన్లపై ఇచ్చిన హామీని తు.చ. తప్పకుండా నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పెన్షన్లను ఠంచనుగా ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నారు. గత రెండు నెలలుగా ఒకటో తేదీనే పెన్షన్లను పంపిణీ చేసిన చంద్రబాబు సర్కార్ ఈ సారి ఒక రోజు ముందుగానే అంటే ఆగస్టు 31వ తేదీనే పెన్షన్లను లబ్ధదారులకు అందిస్తోంది. శనివారం ( ఆగస్టు 31) తెల్లవారు జాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది.  జోరు వానను సైతం లెక్కచేయకుండా మంత్రులు, అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం మొద లైంది.  తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధంగా చెప్పిన సమయానికి పెన్షన్ పంపిణీ చేయడం వరుసగా ఇది మూడో నెల. గత జగన్ పాలనలో పెన్షన్లు ఎప్పుడు అందుతాయన్న విషయంలో ఎలాంటి క్లారిటీ లేని పరిస్థితి ఉండేది. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ల పంపిణీ స్టీమ్ లైన్ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతినెల ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ జరుగుతోంది. ఒక వేళ ఒకటో తేదీ ఆదివారం అయితే ఒక రోజు ముందే పెన్షన్లను పంపిణీ జరుగుతుందనడానికి ఈ సారి ఆగస్టు 31నే లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తుండటం ఒక నిదర్శనం.   ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ ఇంటింటికి వెళ్లి పెన్షన్ నగదును అందజేస్తుండడంతో లబ్ధిదారుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.   పెన్షన్ల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఏడాదికి 36 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది. గత ప్రభుత్వ అవగాహనారహిత పాలన కారణంగా ఖజానా ఖాళీ అయింది.   అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు సమయానికే పెన్షన్ నగదు ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చేలా ఆదేశించడం కూటమి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధి, అంకిత భావానికి అద్దంపడుతోందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

హీరోయిన్ టాపిక్ డైవర్షన్‌కే గుడ్లవల్లేరు ఇష్యూ!

ఈ దిక్కుమాలిన, దరిద్రపు జగన్ మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు వుంది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది ఒకటయితే, సాక్షి మీడియా దాన్ని రకరకాలుగా టర్న్ చేసి, అదేదో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులాగా చిత్రీకరించడానికి శుక్రవారం ఉదయం నుంచి కాలకూట విషాన్ని సమాజంలో చిమ్ముతోంది. కేవలం ఐదుగురు విద్యార్థినీ విద్యార్థుల మధ్య జరిగిన వ్యక్తిగత అంశాన్ని కాలేజీ మొత్తానికి ఆపాదించి, దాన్ని హిడెన్ కెమెరాలు అనే మసిపూసి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం నిస్సిగ్గుగా జరిగింది. వాస్తవానికి ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారం హిడెన్ కెమెరాల ప్రచారానికి దారి తీసినట్లు తెలుస్తోంది. ప్రేమలో విఫలమైన ఒక కుర్రాడు చేసిన హిడెన్ కెమెరాల తప్పుడు ప్రచారాన్ని జగన్ మీడియా సొంతం చేసుకుని చాలా ఘోరం జరిగినట్టు మీడియాలో ఊదరగొట్టేసింది. రకరకాల విషపూరిత కథనాలు వండి వడ్డించేసింది. ఇప్పటి వరకూ శవాల కోసమే వెతుకుతున్న రాబందు జగన్ కూడా ఈ విషయం మీద విషం కక్కాడు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆడపిల్లల జీవితాలను కూడా నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ విషం కారణంగా గుడ్లవల్లేరు కాలేజీ ఆడపిల్లలు మరింత ఆందోళనకు గురయ్యారు. వందలు, వేలల్లో వీడియోలు వున్నాయని ఈ దుర్మార్గపు మీడియా చేసిన ప్రచారం చూసి ఆడపిల్లలు తల్లడిల్లిపోయారు. ఈ విషయం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన పోలీసులు లేడీస్ హాస్టల్లో ఎలాంటి హిడెన్ కెమెరాలు లేవని తేల్చారు. ఈ ఘటన వెనుక వున్న అసలు విషయం కూడా వెల్లడయింది. దాంతో అప్పటి వరకూ ఆందోళన చేసిన విద్యార్థినులు ఆందోళన విరమించారు. అంతా సర్దుమణిగినప్పటికీ దరిద్రపు జగన్ మీడియా మాత్రం వెనక్కి తగ్గలేదు.. తన విష ప్రచారం ఆపలేదు.  మొత్తమ్మీద ఆలోచిస్తే అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఇప్పుడు ముంబై హీరోయిన్ కాదంబరి ఇష్యూ చాలా సీరియస్‌గా వుంది. ఈ ఇష్యూలో ఐపీఎస్‌లతోపాటు జగన్ కొంప కూడా మునిగేలా వుంది. శుక్రవారం నాడు కాదంబరి విజయవాడ వచ్చింది. ఆమెకు జరిగిన అన్యాయానికి సంబంధించి దర్యాప్తు చాలా వేగంగా జరుగుతోంది. హీరోయిన్ కాదంబరి విషయంలో ఇదంతా జరగడానికి జగన్ ఇచ్చిన ఆదేశాలే కారణమన్న అంశం కూడా బయటకి వస్తోంది. ఈ అంశమే కనుక పూర్తి స్థాయిలో బయటపడిందంటే జగన్‌ సీన్ సితార్ అయిపోయే ప్రమాదం వుంది. అందుకే హీరోయిన్ కాదంబరి ఇష్యూని డైవర్ట్ చేయడం కోసమే జగన్ మీడియా గుడ్లవల్లేరు హాస్టల్ ఇష్యూని ఇంత పెద్దది చేసి రచ్చరచ్చ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఏపీలో మొదలైన ఆపరేషన్ ఆకర్ష్!?

ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆపరేషన్ ఆకర్ష్ మెదలైందా అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే ఔనని అనక తప్పదు. వైసీపీ నుంచి వలసల వెల్లువ కొనసాగుతున్నది. ఇప్పటికే ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు పార్టీకీ, తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసేశారు. పార్టీకీ, పదవులకు రాజీనామా చేసిన మోపిదేవి, బీద మస్తాన్ రావులు ఇద్దరూ కూడా తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాను తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు నాయకత్వంలో పని చేయాలని భావిస్తున్నట్లు మోపిదేవి వెంకటరమన విస్పష్టంగా చెప్పేశారు. బీద మస్తాన్ రావు కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరి చేరికకూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. అయితే వీరి చేరికకు చంద్రబాబు ఆమోదం తెలపడం పట్ల తెలుగుదేశం శ్రేణుల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. ఈ ఇద్దరిలో ఒకరైన మోపిదేవి వెంకటరమణ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. వాన్ పిక్ కేసులో మోపిదేవి వెంకట రమణ ప్రధాన ముద్దాయి. అలాగే జగన్ అక్రమాస్తుల కేసులలో కూడా కూడా మోపిదేవి ఉన్నారు. అంతే కాకుండా రేపల్లె కు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు అనేక ఏళ్ల పాటు మోపిదేవి కారణంగా నానా ఇబ్బందులూ ఎదుర్కొన్నారు. ఇప్పుడు మోపిదేవి తెలుగుదేశం గూటికి చేరితే వారు ఆయనతో కలిసి పని చేయాల్సి వస్తుంది. ఇక బీద మస్తాన్ రావు విషయానికి వస్తే ఆయన గతంలో తెలుగుదేశంలోనే ఉండేవారు. అయితే పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పార్టీని వదిలి వెళ్లిపోయారు. అయినా కూడా తెలుగుదేశం నాయకత్వం ఇటువంటి చేరికలు జగన్ ను, జగన్ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు అవసరమని చెబుతోంది.   పార్టీకీ, పదవులకు రాజీనామా చేసి వస్తే ఓకే అని చంద్రబాబు అంటున్నారు.  క్యాడర్ కూడా ఈ విషయాన్ని అర్ధం చేసుకోవలసి ఉంటుంది. మోపిదేవి, బాదం మస్తాన్ రావులు మాత్రమే కాదు.. ఇంకా పలువురు వైసీపీ రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామాల బాటలోనే ఉన్నారని తెలుస్తోంది. ఆ పార్టీకి ఉన్న పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలిన వారంతా కూటమి పార్టీల్లోకి  సర్దుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయి. రాజ్యసభ సభ్యులే కాదు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా పార్టీని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకీ, తన మండలి సభ్యత్వానికీ రాజీనామా చేసేశారు. ఆమె రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైనా, పార్టీ ద్వారా పలు అవకాశాలు అందిపుచ్చుకుని ఎదిగారు. అయితే తెలుగుదేశం ప్రతిపక్షంలోకి రాగానే పోతుల సునీత వైసీపీ గూటికి చేరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్ లపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్నారు. చివరికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్ భార్య బ్రాహ్మణిలను కూడా ఆమె అనుచితంగా విమర్శించారు.  ఆమె బీజేపీ గూటికి చేరనున్నారు.   అయితే రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం అంటూ తెలుగుదేశం అగ్రనాయకత్వం ఇటువంటి  చేరికలపై పెద్దగా అభ్యంతరం పెట్టడం లేదు. నిబంధనలను పట్టించుకోకుండా అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెబుతూనే.. వైసీపీని బలహీనం చేయడం, అలాగే మండలిలో ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది. కేవలం రాజ్యసభ నుంచి మాత్రమే కాకుండా మండలిలో కూడా పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు గోడ దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు. పోతుల సునీతతో మొదలు పెట్టి తాజాగా ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి కూడా తమ మండలి సభ్యత్వాలకు రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. వీరి బాటలోనే మరింత మంది ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ తనకు బలం ఉంది అని భావిస్తున్న రాజ్యసభ, శాసనమండలిలో ఆ పార్టీని బలహీనం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

బ్లాక్ మెయిల్ బాటలో విజయసాయి?!

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు అన్నట్లుగా ఉంది విజయసాయి తీరు. ఎవరూ అడగకపోయినా ఆయన తనంత తానుగా నేను వైసీపీని వీడే ప్రశక్తే లేదని గొంతు చించుకుంటున్నారు. విజయసాయిరెడ్డి జగన్ కు దూరం జరుగుతున్నారని కానీ, ఆయన పార్టీని వదిలేసి మరో పంచన చేరుతారని కానీ ఎవరూ భావించడం లేదు.   ప్రస్తతం వైసీపీనీ వీడి పోతున్న నేతల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యలు ఒకరిద్దరు తప్ప  ఇంకెవరూ వైసీపీలో మిగిలే పరిస్థితి లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితుడైన మోపిదేవి వెంకటరమణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికీ కూడా రాజీనామా చేసేశారు. తాను తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు విస్ఫష్టంగా చెప్పేశారు. ఆ సందర్భంగా మోపిదేవి వెంకటరమరణ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేతపైనా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు అది వేరే సంగతి. అదే విధంగా మోపిదేవితో పాటు మరో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కూడా పార్టీ సభ్యత్వానికీ, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసేశారు. ఇదే దారిలో వైసీపీ రాజ్యసభ సభ్యుల అడుగులు పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కు సమీప బంధువైన సుబ్బారెడ్డి, అక్రమాస్తుల కేసులో జగన్  సహ నిందితుడైన ఏ2 విజయసాయి రెడ్డి వినా మిగిలిన వారంతా వైసీపీని వీడుతారని పరిశీలకులు సైతం తమ విశ్లేషణల్లో అంచనా వేస్తున్నారు.  అంటే వైసీపీని వీడిపోతారని ప్రచారం జరుగుతున్న రాజ్యసభ సభ్యుల పేర్లలో విజయసాయి ఊసే లేదు.  అయితే విజయసారి మాత్రం ఊరికి ముందే  తాను పార్టీ మారే ప్రశక్తే లేదంటూ ట్వీట్ చేసేశారు. వాస్తవానికి విజయసాయిరెడ్డి పార్టీ మారతారని ఎవరూ లేశ మాత్రంగా కూడా భావించరు. ఎందుకంటే విజయసాయి రాజకీయం జగన్ తోనే మొదలైంది. జగన్ తోనే కొనసాగుతుంది. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసులో  విజయసాయి ఏ2.   అటువంటి విజయసాయి వైసీపీని వీడి బయటకు రావడమంటే.. జగన్ గుట్టుమట్లన్నీ వెల్లడి అయిపోతాయి. అలా వెల్లడి చేసే షరతుపైనే ఏ పార్టీ అయినా ఆయకు నీడ ఇస్తుంది.  అన్నిటికీ మించి జగన్ హయాంలో జరిగిన అన్ని ఆర్థిక అవకతవకల వెనుకా ఆయన హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరూ కనీసం ఊహా మాత్రంగా కూడా విజయసాయి వైసీపీని వీడుతారని అనుకోవడం లేదు. విజయసాయిని ఎవరూ వైసీపీలో ఉంటారా, గోడ దూకేస్తారా అని కూడా అడగలేదు. అయినా విజయసాయి తనంతట తానుగా పార్టీ మారడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా గొంతు చించుకుంటున్నారు. దీంతోనే విజయసాయి మాటలకు అర్ధాలు వేరే ఉన్నాయా?  అన్న సందేహాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. లేదా పార్టీ మార్పు సంకేతాలను జగన్ కు పంపడం ద్వారా  పార్టీలో తనకు ఇటీవలి కాలంలో తగ్గిన ప్రాధాన్యత, గుర్తింపును తిరిగి పొందేందుకు వైసీపీకి రాజీనామా అంటూ జగన్ కు హెచ్చరికలు పంపుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

సజ్జల.. జగన్ కు బంధమా..బందిఖానానా?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీ తీరు, పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా తయారైంది. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. అయితే ఆ విషయాన్ని అంగీకరించలేక గెలిస్తే విర్రవీగడం, ఓడిపోతే బ్రహ్మాండం బద్దలైపోయినట్లు కుంగిపోవడం ఎంత మాత్రం సరికాదు. కానీ వైసీపీ మాత్రం సరిగ్గా అదే చేసింది. చేస్తోంది. అధికారంలో ఉన్నంత కాలం తమంత వాళ్లు లేరన్నట్లుగా  ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతలంతా చెలరేగిపోయారు. అదే ఓటమి తరువాత నోరెత్తడానికి కూడా బెంబేలెత్తిపోతున్నారు. అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు, అన్యాయాలు ఇప్పుడు తమ మెడకు చుట్టుకుని ఇబ్బందుల పాలు చేస్తాయా అన్న భయంతో వణికి పోతున్నారు. ఈ విషయంలో వైసీపీ అధినేత కూడా మినహాయింపు కాదు. అందుకే పార్టీ పరాజయం తరువాత చాలా మంది సీనియర్ నేతలు మౌనముద్రలోకి వెళ్లిపోయారు. నోరెత్తడానికే కాదు, ప్రజలలో తిరగడానికి కూడా వెరుస్తున్నారు. అధికా రంలో ఉండగా మాట్లాడటమంటే ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టడమే అన్నట్లుగా చెలరేగిన వారె వరూ కూడా ఇప్పుడు కనిపించడం లేదు. వినిపించడం లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశి, ఆర్కే రోజా అనిల్ కుమార్ యాదవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత జాబితా ఉంటుంది.  పార్టీ అధినేత జగన్ కూడా అడపాదడపా పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయంటూ మీడియా ముందు మాట్లాడటం తప్ప ఆయన పెద్దగా బయటకు రావడం లేదు. అసలు తాడేపల్లి ప్యాలెస్ లో ఉండడానికే ఇష్టపడటం లేదు. పార్టీ అధినేతగా తప్పదు కనుక అప్పుడప్పుడు తాడేపల్లికి వస్తూ ఎక్కువ సమయం బెంగళూరు ప్యాలెస్ లోనే గడుపుతున్నారు. రెండు నెలల వ్యవధిలో ఆయన ఆరు సార్లు బెంగళూరు వెళ్లారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.  సరే ఇప్పుడు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలు ఎవరికో ఒకరికి అప్పగించాలి. అప్పగించకపోయినా పెద్ద ఫరక్ పడదు అది వేరే సంగతి. కానీ వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు మాత్రం ఎవరికో ఒకరికి అప్పగించక తప్పదు. ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత వైసీపీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి పిల్ల సజ్జల అదే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డిని తప్పించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత సజ్జల భార్గవరెడ్డి ఎక్కడా కనిపించలేదు. కానీ పార్టీ సామాజిక మాధ్యమ బాధ్యతల నుంచి సజ్జల భార్గవ్ రెడ్డిని తప్పించినట్లుగా అధికారిక సమాచారమేదీ లేదు. అంటే ఇప్పటికీ పార్టీ సోషల్ మీడియా వింగ్ సజ్జల చేతిలో ఉన్నట్లే లెక్క.   పార్టీ ఓటమి తరువాత ఈ రెండు నెలల కాలంలోనూ సజ్జల భార్గవ్ కు వైసీపీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతల నుంచి తప్పించేసినట్లు అధికారికంగా ప్రకటించేందుకు జగన్ శతధా ప్రయత్నించారు.  పలువురి పేర్లు కూడా తెరమీదకు తీసుకువచ్చారు. వారిలో జగన్ బంధువు పేరు గట్టిగా వినిపించింది. అలాగే నాగార్జున యాదవ్ పేరూ వినిపించింది. అయితే వారిలో ఎవరినీ జగన్ ఫైనలైజ్ చేయలేదు. ఇందుకు సజ్జల వ్యక్తం చేసిన అభ్యంతరాలే కారణమని అంటున్నారు.  సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో తన స్థానం ఎలా ఉన్నా కుమారుడు భార్గవ్ కు మాత్రం సముచిత స్థానం ఉండాలన్న తాపత్రయంతో తన పలుకుబడి అంతా ఉపయోగిస్తున్నారని అంటున్నారు. అలాగే జగన్ కూడా కారణాలేమిటో స్పష్టంగా తెలియడం లేదు కానీ, సజ్జలను కాదనలేకపోతున్నారని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. పార్టీ పరాజయం తరువాత ఓటమికి కారణాలుగా పార్టీ శ్రేణులు, నేతలూ కూడా సజ్జల, ఆయన కుమారుడే అని బాహాటంగానే చెబుతున్నారు. జగన్ సైతం వారి తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయినా కూడా సజ్జలను వదిలించుకోలేకపోతున్నారు.  ఇక ఇప్పుడు విదేశీ పర్యటన ముంగిట జగన్ కు పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతల విషయంలో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. అయితే ఆ బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అనివార్యంగా పిల్ల సజ్జలనే కొనసాగిస్తారన్న ధీమా సజ్జలలో వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయిన నష్టం ఎలాగూ అయ్యింది. భవిష్యత్ లోనైనా పార్టీ పుంజుకోవాలంటే సజ్జల, పిల్ల సజ్జలల విషయంలో జగన్ మొహమాటం వదుల్చుకుంటే మేలని పార్టీ వర్గాలు అంటున్నాయి. 

పొమ్మన్నారు.. పొగపెట్టారు.. బాలినేని

బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, అన్నిటికీ మించి మాజీ ముఖ్యమంత్రి, పులవెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత అయిన జగన్ కు సమీప బంధువు. అటువంటి బాలినేని గత కొన్నేళ్లుగా వైసీపీలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అవమానాలను దిగమింగుకుని మరీ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ ఆయనను పొమ్మన లేక పోగపెట్టినా ఆయన మాత్రం ఓపికగా వైసీపీ చూరుపట్టుకు వేళాడుతున్నారు.  అయితే అదే సమయంలో బాలినేని అవమానాలను జీర్ణించుకోలేక అధినేతను ధిక్కరించి, పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేసినా జగన్ ఆయనపై చర్యలు తీసుకోలేదు. బాలినేని ధిక్కార స్వరం వినిపించిన ప్రతిసారీ తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని బుజ్జగించి దారికి తెచ్చుకున్నారు. ఇదంతా ఎన్నికలకు ముందు నాటి మాట. ఎన్నికలలో చివరికి ఏదో విదిల్చినట్లుగా ఒంగోలు అసెంబ్లీ స్థానంలో పోటీకి బాలినేనికి టికెట్ ఇచ్చినా, జిల్లాలోని మరే ఇతర నియోజకవర్గాల అభ్యర్థల విషయంలోనూ బాలినేని మాట పార్టీలో చెల్లుబాటు కాలేదు. బాలినేని డిమాండ్ లను, అభ్యర్థనలను జగన్ బేఖాతరు చేశారు. ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ ఇవ్వాలని బాలినేని పట్టుబట్టారు, బతిమలాడారు అయినా ఫలితం లేకపోయింది. ఒక దశలో మాగుంటకు టికెట్ ఇవ్వకుంటే తాను పార్టీని వీడతానని హెచ్చరించే వరకూ వెళ్లిన ఫలితం లేకపోయింది. ఏది ఏమైనా ఎన్నికల ముందు అంతా జగన్ బాలినేనిని పొమ్మన లేక పొగబెట్టినా బాలినేని ఉక్కిరి బిక్కిరి అయ్యారు తప్ప జగన్ ను వదిలి, వైసీపీకి రాజీనామా చేసే ధైర్యం చేయలేకపోయారు. అలాగే బాలినేని ధిక్కార స్వరం వినిపించినా ఆయనపై చర్య తీసుకునే ధైర్యం జగన్ చేయలేకపోయారు.   ఏది ఏమైనా జగన్ బాలినేనిల మధ్యా ఎన్నికల ముందు వరకూ టామ్ అండ్ జెర్రీ గేమ్ నడిచిందనే చెప్పుకోవాలి. అందుకు ప్రధాన కారణంగా బాలినేనికి ఇతర పార్టీల తలుపులు మూసుకుపోవడం, వైసీపీని కాదని బయటకు వస్తే ఆయన అండగా నిలిచే పార్టీ లేకపోవడం ఒకటైతే.. బాలినేని వైసీపీని వీడితే ప్రకాశం జిల్లాలో పార్టీ మనుగడపై ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమౌతుందని జగన్ భావించడం. మొత్తం మీద ఇరువురూ కూడా పరస్పర ప్రయోజనాల కోసం తిట్టుకుంటూ, కొట్టుకుంటూ కూడా కలిసే ఉన్నారు.  ఎన్నికలు పూర్తై, ఫలితాలు వచ్చిన తరువాత ఇక టామ్ అండ్ జెర్రీ ఆటకు అవకాశమే లేదు. ఎందుకంటే బాలినేని స్వయంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పరాజయం పాలయ్యారు. ఇక వైసీపీ అయితే   ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకోకుండా అసెంబ్లీలో 11 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఇప్పుడు ఇక బాలినేనికి వైసీపీతో అవసరం లేదు. వైసీపీపి బాలినేనితో పని లేదు.  అందుకే బాలినేని కుండ బద్దలు కొట్టేశారు. పార్టీ మారడం ఖాయమన్న సంకేతాలు ఇచ్చేశారు. అలా ఇస్తూ కూడా పార్టీయే తనను వద్దనుకుంటోంది తాను కాదు అని చెప్పుకున్నారు. ఔను తాను కాదు.. తన పార్టీ వారే తనను వదిలించుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల తరువాత నుంచీ తాను పార్టీకి దూరంగా ఉంటున్నానని నెపం వేసి ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. పార్టీ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తన పోరాటం కొనసాగుతుందని, ప్రజలే తనకు అండ అని పేర్కొనడం ద్వారా వైసీపీతో తెగతెంపులకు బాలినేని రెడీ అయిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.