విజయసాయిపై 'ట్రోల్'తీత
Publish Date:Mar 1, 2021
Advertisement
విజయసాయిరెడ్డి. ట్విట్టర్ పక్షి. ఎప్పుడూ నీతులు చెప్పే నేత నీతి తప్పాడు. అధికారంలో ఉండి అడ్డదిడ్డంగా ప్రవర్తించాడు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో విజయసాయి రెడ్డి నగరంలో ప్రచారం చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో గొప్పగా పోస్ట్ చేసుకున్నారు. ఆ బైక్ ర్యాలీ ఫోటోలను చూసిన నెటిజన్లు విజయసాయిని, అవంతి శ్రీనివాస్ ను తెగ ఆడుకుంటున్నారు. మేటర్ ఏంటంటే.. బైక్ నడుపుతూ వారిద్దరూ హెల్మెట్ పెట్టుకోలేదు. అధికారంలో ఉన్న నేతలే ఇలా నిబంధనలు పట్టించుకోకుండా, హెల్మెట్ లేకుండా బైక్ నడపడమేంటని సోషల్ మీడియాలో తెగ ప్రశ్నిస్తున్నారు. కామెంట్లతో కుమ్మేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం ఓ నేరమైతే.. బహిరంగా ప్రదేశంలో ర్యాలీ నిర్వహిస్తూ ఆ ఇద్దరు నేతలు మాస్క్ కూడా పెట్టుకోకపోవడం కొవిడ్ నిబంధనలకు విరుద్ధం. బాధ్యత గల పదవుల్లో ఉండి.. హెల్మెట్ ధరించకుండా బుల్లెట్ నడపటంతో పాటు కొవిడ్ రూల్స్ అతిక్రమించడంతో ఇరువురు నేతలు విమర్శలకు గురవుతున్నారు. ఏపీలో ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఒక పక్క ప్రభుత్వమే భారీ జరిమానాలు విధిస్తుంటే... మరోపక్క ఆ ప్రభుత్వంలోని వారే నిబంధనలు గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏపీలో హెల్మెట్ లేని ప్రయాణానికి రూ.1000 జరిమానా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. యథారాజా తథాప్రజా అన్నట్టు.. ఆ ఇద్దరు నేతల వెనక ఉన్నవారూ హెల్మెట్ లేకుండా వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు. ఆ ఫొటోలు స్వయంగా విజయసాయిరెడ్డే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ట్రోల్స్ తో పండగ చేసుకుంటున్నారు నెటిజన్స్.
నిబంధనలకు తూట్లు పొడిచాడు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. ఎంపీ బాటలోనే మంత్రి సైతం రూల్స్ బ్రేక్ చేశాడు.
http://www.teluguone.com/news/content/mp-vijayasaireddy-bike-ride-without-helmet-39-110935.html