రాఫెల్ డీల్.. కేంద్రం సుప్రీంకోర్టుకి అబద్ధాలు చెప్పింది!!

Publish Date:Dec 15, 2018

Advertisement

 

రాఫెల్ డీల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ నేతలు సంబరపడిపోతూ.. కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే బీజేపీ సంబరాలు మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే రాఫెల్ డీల్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం మీద మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.

'రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కాగ్ ద్వారా.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ)కి అందజేశాం. వాళ్లకు పూర్తి అగాహన ఉంది' అని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పులో ఇది స్పష్టంగా ఉంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కాగ్ రాఫెల్‌పై నివేదిక ఎప్పుడు ఇచ్చింది?.. పీఎసీ ముందుకు ఎప్పుడు వచ్చింది? అనే సందేహాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పీఏసీ చైర్మన్ గా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. మరి ఆయనకు తెలియకుండా కేంద్రం చెప్పిన కాగ్ రిపోర్ట్ పీఏసీ ముందుకు రాదు కదా?. మరి కేంద్రం సుప్రీంకోర్టుకు ఎందుకు అబద్దాలు చెప్పింది? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వ్యవహారమపై పీఏసీ చైర్మన్, కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే తాజాగా స్పందించారు. రాఫెల్ డీల్ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. పార్లమెంటులో కాగ్‌ ఇచ్చిన నివేదికను ఎప్పుడు ప్రవేశపెట్టారనే దానిపై అటార్నీ జనరల్‌, కాగ్‌ సమాధానం ఇవ్వాలి. ఈ మేరకు పీఏసీ సభ్యులతో మాట్లాడి వారికి సమన్లు పంపిస్తాం అని ఖర్గే తెలిపారు. కాగ్‌ ఇచ్చిన నివేదికను పీఏసీ ఎప్పుడు పరిశీలించింది?. ఆ నివేదికను పార్లమెంటు ఎదుట ఎప్పుడు ఉంచారు? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇవ్వడం చూసి షాక్‌కు గురయ్యాం అన్నారు. సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించినందుకు గాను ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్‌ చేశారు. చూస్తుంటే రాఫెల్ రచ్చ ఇప్పట్లో మోదీ ప్రభుత్వాన్ని వదిలేలా లేదుగా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By
en-us Political News

  
ఏపీ ఎన్నికల సందర్భంగా జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు.
హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ భార్య వసుంధర నామినేషన్! అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరో వైపు చెల్లెళ్ల విమర్శలు, ఇంకో వైపు పార్టీ నుంచి పెరిగిపోతున్న వలసలు, వెరసి ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారా? ఆఫ్రస్ట్రేషన్ లో సొంత చెల్లెలిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి తనకు తానే నష్టం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఏంటమ్మా జగనూ... మొన్న చెల్లి షర్మిలమ్మ ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు చూశాంలే..
కేసీఆర్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ ను పండించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కారణాలేమైతేనేం చాలా రోజుల పాటు ఎక్కడా బహిరంగంగా మాట్లాడని ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రజల ముందుకు వచ్చారు.
గుడివాడ, గన్నవరం.. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు చోట్లా కూడా వైసీపీ అభ్యర్థుల తీరు, భాష పట్ల ఆయా నియోజకవర్గాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ వైసీపీ గాంభీర్యం పదర్శిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది.
ఏపీలో భానుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ తానేదో పెద్ద రాజకీయవేత్త అన్నట్టుగా బిల్డప్పు ఇస్తుంటారుగానీ, ఆయన నడిపేవి దిక్కూమొక్కూ లేని రాజకీయాలు.
నిజామాబాద్ లో మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులూ ఆరితేరిన ఉద్ధండులే! ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్ని బ‌ట్టి చూస్తే ఓటర్లు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు! ఏడు సెగ్మెంట్లలో మూడు చోట్ల‌ బీఆర్‌ఎస్‌ గెలిస్తే.. కాంగ్రెస్‌, బీజేపీ రెండేసి చొప్పున పంచుకున్నాయి! పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పుడు మూడు పార్టీలూ హోరాహోరీ తలపడుతున్నాయి!
ఏడు విడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రెండో విడత పోలింగ్ ఈ రోజు ఉదయం మొదలైంది. కేరళలోని మొత్తం 20 లోక్ సభ స్థానాలకూ, కర్నాటకలో 14, రాజస్థాన్ లో 13, మహారాష్ట్ర, యూపీలలో ఎనిమిదేసి స్థానాలకు, మధ్య ప్రదేశ్ లో 7, బీహార్, అసోంంలలో ఐదేసి, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ లో రెండేసి స్థానాలకూ ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.
అమాయ‌కమైన ముఖం పెట్టి అబ‌ద్ధాలను అల‌వోక‌గా చెప్ప‌డంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మించిన రాజ‌కీయ నేత మ‌రొక‌రు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పైన‌.. సొంత చెల్లెళ్ల‌పైన‌కూడా ఎలాంటి సంకోచం లేకుండా అధారాలు లేని అభాండాలను, అసత్య వ్యాఖ్యలను అలవోకగా చేస్తూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో జ‌గ‌న్ దిట్ట.
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. శుక్రవారం (ఏప్రిల్ 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.