తెలంగాణకు జానారెడ్డి ప్రధాన అడ్డంకీ: కోమటిరెడ్డి

 

 

telangana issue, telangana separate, separate telangana issue, janana reddy telangana, telangana congress

 

 

తెలంగాణకు ప్రథమ శత్రువు మంత్రి జానారెడ్డి అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తపరిచారు. అందరూ రాజీనామాలు చేస్తామన్నా జానారెడ్డి సిద్ధపడటంలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణకు జానారెడ్డి ఆటంకంగా మారారని ఆయన అన్నారు. జానారెడ్డి నిత్యం పోలీసుల పహారాలో ఉండడం కాదని, జనంలోకి వస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఉరికించుకుంటూ జానారెడ్డిని కొడతారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ యువకుల మరణాలకు తెలంగాణ కాంగ్రెసు నేతలు బాధ్యత వహిస్తారా, కేసులు వేయమంటారా అని ఆయన అడిగారు. ఆజాద్ వ్యాఖ్యలతో తెలంగాణలో తిరిగి ఆత్మహత్యలు మొదలయ్యాయన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పదవులు, డబ్బు తప్ప ప్రజల అభీష్టం పట్టడం లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.