తెలంగాణ రాష్ట్రం అవసరం లేదు

 

 Rayapati Sambasiva Rao, congress Rayapati Sambasiva Rao, telanagana issue rayati, separate telangana rayapati

 

 

మాకు ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదు. సమైక్య రాష్ట్రమే మంచిది. విడిపోతే తెలంగాణ ఇబ్బందులలో పడుతుంది” అని తెలంగాణలోని వరంగల్ నుండి కొందరు విద్యార్లులు నాకు ఫోన్ చేశారు” అని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు సమైక్యాంద్ర జేఏసీ సమావేశంలో వెల్లడించారు. శ్రీకృష్ణ కమిటీ కార్యదర్శి దుగ్గల్ కూడా తెలంగాణ బాగా అభివృద్ది చెందిందని, తెలంగాణ రాష్ట్రం అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఎంపీలకు విద్యార్థులు వత్తిడి చేయడంతో కేంద్రం మీద వత్తిడి తెచ్చారని, సమైక్యాంధ్రకు మద్దతుగా ఎనబైమంది ప్రజా ప్రతినిధులం వెళ్లి తమ వాదన వినిపించామని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ అస్సలు రాదని, రోశయ్య ప్రభుత్వం గొడవల మూలంగా ఐదువేల మంది చనిపోతారని చెప్పడంతో తెలంగాణకు అనుకూల నిర్ణయం కేంద్రం తీసుకుందని అన్నారు.సమైక్య రాష్ట్ర ఉద్యమానికి తాము మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.