గ్రూప్-1 నియామకాలపై టీజీపీఎస్సీ అప్పీలు పిటిషన్

 

తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై ఇటీవల హైకోర్టు సింగిల్ ఇచ్చిన మధ్యంతరం ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ  అప్పీల్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు సీజే ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది.  గ్రూపు-1 పరీక్షలో అక్రమాలు జరిగాయని హైకోర్టుపలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. మెయిన్స్ ఎగ్జామ్ మూల్యాంకనం సరిగ్గా జరుగలేదని, పరీక్షల కేంద్రాల కేటాయింపుల్లోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.  గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కొన్ని పిటిషన్లు దాఖలు కావడం, వాటిపై విచారణ జరగడం, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, నియామక పత్రాలు జారీ చేయకుండా ఆపడం జరిగింది. అయితే, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.