వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం కెసిఆర్

రవీంద్రభారతిలో దాశరథి 89వ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్యాంక్‌బండ్‌పై చాలా పనికిమాలిన విగ్రహాలున్నాయని అన్నారు. బళ్లారి రాఘవ ఎవరో తెలియదని, ఆయన విగ్రహం ఉందని,దాశరది వంటి గొప్పవారి విగ్రహాలు ఉండాలని అబిప్రాయపడ్డారు. తెలంగాణ సాహితీ లోకం గర్వించే విధంగా దాశరథి విగ్రహం ఏర్పాటు చేస్తామని అన్నారు. త్వరలో దాశరథి పేరిట స్మారక అవార్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అవార్డుతో పాటు లక్షరూపాయల రివార్డు అందజేస్తామన్నారు. తెలంగాణ ముద్దు బిడ్డ దాశరథి అని కేసీఆర్ కొనాయాడారు.దాశరథి కుటుంబాన్ని ఆదుకుంటామని, ప్రభుత్వంలో వారికి తగిన పాత్ర ఇస్తామని హామీ ఇచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu