గోల్కొండ కోట మీద జాతీయ జెండా ఎగరేస్తాం: కిషన్‌రెడ్డి

 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారి పెన్షన్లు ఆపేస్తారా? మా నిజాం రాజు తరతరాల బూజు అన్న దాశరథి మాటని ఖండిస్తారా? సెప్టెంబర్‌ 17వ తేదీని విమోచన దినంగా ఎందుకు గుర్తించడం లేదు? ఎంఐఎం ఒత్తిడితో చరిత్రను కాలగర్భంలో కలిపేస్తున్నారా? అని ప్రశ్నించారు. విమోచన దినమైన సెప్టెంబర్ 17వ తేదీన తాము గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. మెదక్ ఎన్నిక గురించ మాట్లాడుతూ, ఈ ఉప ఎన్నికలో తమ పార్టీ బలాన్ని నిలబెట్టుకుందని, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేయడం వల్లే గెలిచిందని ఆయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu