ఏపీ కాంగ్రెస్ అల్పసంతోషం...

 

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ అల్పసంతోషిలా మారిపోయింది. ఏపీలో అడ్రస్ గల్లంతైపోయిన కాంగ్రెస్ పార్టీ ఇంకా అక్కడేదో సాధించాలని తంటాలు పడుతోంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కాంక్రీట్‌తో సమాధి కట్టేశారన్న విషయం కాంగ్రెస్ నాయకులు విస్మరిస్తున్నారు. అలా విస్మరించే నందిగామ ఉప ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యే ఎన్నిక ఏకగ్రీవం కాకుండా అనవసరంగా ఎన్నిక జరిగేలా చేశారు. ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థి చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం విచారించకుండా అల్ప సంతోషాన్ని ప్రకటించింది. నందిగామలో ఉప ఎన్నికలో తమ పార్టీకి దక్కిన అత్తెసరు ఓట్ల పట్ల ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. తమ సంప్రదాయ ఓట్లు తిరిగొచ్చాయని చెప్పారు. తంగిరాల ప్రభాకరరావు కుటుంబంపై సానుభూతి, నామినేషన్ తర్వాత విజయవాడను రాజధానిగా ప్రకటించడం వంటి కారణాల వల్ల టీడీపీ విజయం సాధించిందని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu