షీనా బోరా హత్య గురించి నాకు తెలుసు.. అప్రూవర్ గా ఇంద్రాణీ డ్రైవర్

 

షీనా బోరా హత్య కేసులో ఇప్పటికే ఎన్నో ట్విస్ట్ లు, కొత్త కొత్త విషయాలు బయటపడిన సంగతి తెలిసిందే. దేశమంతటా సంచలనం సృష్టించిన ఈ కేసులో షీనాను తల్లి ఇంద్రాణీయే చంపిందని వార్తలు కూడా వచ్చాయి. దీనికి సంబధించిన విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసులో నిందుతుడిగా ఉన్నా.. ఇప్పటికే అరెస్టయి జైల్లోలేనే విచారణ ఖైదీగా ఉన్న డ్రైవర్ శ్యాంవర్ రాయ్ అప్రూవర్ గా మారినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో తాను కోర్టు ముందు నిజ నిజాలు చెప్పేందుకు ముందుకు వచ్చాడు. ఈ నేరానికి సంబంధించిన విషయాలు తనకు తెలుసని.. ఈ హత్యలో తనకు కూడా భాగముందని.. షీనా గొంతునులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు కోర్టుకు చెప్పాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu