Latest News
సరస్వతి పవర్ మైనింగ్ లీజు రద్దు
posted on: Oct 9, 2014 5:28PM
.jpg)
గుంటూరు జిల్లా మాచవరం, చెన్నాయపాలెం తదితర ప్రాంతాల్లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనింగ్ కోసం లీజుకు ఇచ్చిన 613 ఎకరాల భూమి వినియోగంలోకి తేనందున ఆ లీజును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. సరస్వతి కంపెనీకి ఇచ్చిన కాలపరిమితి ముగిసిందని ప్రభుత్వం గురువారం 98వ నెంబర్ జీవోను విడుదల చేసింది. లీజు కాలపరిమితి ముగిసిందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. రేపో, ఎల్లుండో భూమిని వెనక్కి తీసుకునే ఉత్తర్వులు కూడా రావొచ్చని భావిస్తున్నారు.


.jpg)



