Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ట్యాక్సీకి డబ్బుల్లేక నడుచుకుంటూ వెళ్లిన క్రికెట్ గాడ్
posted on: Apr 27, 2016 10:04AM

క్రికెట్ లెజెండ్, ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కోట్లాది మంది అభిమానులతో పాటు కోట్లాది రూపాయల ఆస్తికి అధినేత. అలాంటి సచిన్ డబ్బుల్లేక క్యాబ్ ఎక్కలేకపోయాడు. అయితే ఇది ఇప్పుడు కాదు తాను 12 ఏళ్ల వయసులో ఉండగా జరిగిన సంఘటన. ముంబైలో డీబీఎస్ బ్యాంక్ డిజీ బ్యాంక్ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తన మనసులో మాటను బయటపెట్టారు. ముంబై అండర్-15 జట్టు తరపున పూణేలో మ్యాచ్లు ఆడేందుకు వెళ్లాను. నాలుగో ఆటగాడిగా క్రీజులో దిగే అవకాశం లభించింది. కానీ రనవుట్ కావడంతో ఎంతో నిరాశతో డ్రెస్పింగ్ రూమ్కు వచ్చి ఒక్కసారిగా ఏడ్చేశాను. ఆ తర్వాత ఈ టూర్లో మళ్లీ ఛాన్స్ రాలేదు. వర్షం పడుతుంటే ఆ రోజున బయటకు వెళ్లి సినిమా చూసి కడుపునిండా తిన్నాము. దాంతో జేబులో ఉన్నదంతా ఖర్చయిపోయింది. ముంబైకి రైలులో తిరిగి చేరుకున్న తర్వాత జేబులో చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. దాంతో చేతిలో ఉన్న రెండు పెద్ద బ్యాగులను దాదార్ స్టేషన్ వద్ద వదిలి ఇంటికి నడుచుకుంటూ వెళ్లాను అంటూ సచిన్ తెలిపారు. కానీ ఆ తర్వాత స్వయంకృషితో ఎదిగి ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడాకారుడిగా ఎదిగాడు.



.jpg)


