Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రామోజీ సపోర్టు కోసం పరితపిస్తున్న పార్టీలు
posted on: Oct 21, 2015 10:47AM

ప్రసుతం రాజకీయాల్లో రామోజీరావు పాత్ర హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు పార్టీలు ఈయన సపోర్టు కోసం పరితపించడం అందరికి ఆశ్చర్యకరంగా మారింది. నిన్న మొన్నటి వరకూ ఈనాడు అంటేనే అంత ఎత్తున ఎగిరిపడే జగన్ కూడా రామోజీరావును కలిసి రాజకీయాల్లో వేడి పుట్టించారు. అసలు వారిద్దరూ ఎందుకు కలిశారు.. ఏం మాట్లాడుకున్నారు.. అని బుర్రలు బద్దలుకొట్టికొని ఆలోచించిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే జగన్ రామోజీరావును కలిసిన ఫలితం.. ఆతరువాత ఈనాడులో జగన్ మీద మొయిన్ ఎడిషన్ లో ఒక ఆర్టికల్. దీంతో రామోజీరావును కలవడం వల్ల జగన్ కు బాగానే వర్కవుట్ అయింది. అయితే ఇప్పుడు జగన్ పంథాలోనే కాంగ్రెస్ పార్టీ కూడా రామోజీ మద్దతు కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జగన్, కేసీఆర్లు రామోజీరావుతో సయోధ్య కుదుర్చుకున్నారని.. ప్రస్తుత పరిస్థితిలో మన పార్టీకి కూడా తన మద్దతు అవసరమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కేంద్రాన్ని సూచించడం జరిగిందట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చిన దిగ్విజయ్ సింగ్.. టీ పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి రామోజీరావును కలిసినట్టు తెలుస్తోంది. దాదాపు గంటపాటు జరిగిన చర్చలో ప్రతిపక్షంలో తమ పోరాటాలకు మద్దతివ్వాలని దిగ్విజయ్ సింగ్ రామోజీరావును కోరారట. మొత్తానికి కాలం మనుషులను మార్చేస్తుంది అన్న నానుడి ప్రకారం.. అసలు ఈనాడు అంటేనే పడని జగన్ కాని.. కాంగ్రెస్ పార్టీ కానీ ఈనాడు సపోర్టు కోరడం ఆశ్చర్యం. దీనిబట్టి రామోజీరావు రేంజ్ ఏంటో అందరికి అర్ధమవుఉంటుంది.






