శంకుస్థాపనకు వద్దన్న కాంగ్రెస్ పార్టీ.. రాజీనామా చేసి మరీ వెళుతున్న మాజీ ఎమ్మెల్యే
posted on Oct 21, 2015 12:09PM

రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం అందరికి ఆహ్వాన్వాలు అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి చంద్రబాబు అందరికి ఆహ్వానాలు అందించినా కొన్ని ప్రతిపక్ష పార్టీలు మాత్రం కార్యక్రమానికి దూరంగా ఉండాలని యోచిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రతిపక్షనేత అయిన జగన్ తనకు ఆహ్వానం అందించవద్దని, తనని ఆహ్వానించినా రానని ముందే చెప్పారు. దాంతో అసలు పార్టీ అధినేతే వెళ్లనప్పుడు పార్టీ నేతలు మాత్రం ఎందుకు వెళతారు వాళ్లు కూడా వెళ్లరు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్లాలా వద్దా అన్న సంగ్ధిగ్ధంలో పడింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళదామని ఏపీ కాంగ్రెస్ నేత అయిన రఘువీరా రెడ్డిని అడగగా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోడీని కలిసి మాట్లాడే అవకాశం ఇస్తే వెళదామని.. లేకపోతే వద్దని చెప్పగా కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్లకూడదని నిర్ణయించుకుంది. అయితే అందరూ నేతలు బానే ఉన్నా ఒక్క కాంగ్రెస్ నేత మాత్రం శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళొద్దన్నారని రాజీనామానే చేశారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ నాయకుడు చేసింది నిజమే. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లొద్దని పార్టీ తీసుకున్న నిర్ణయం నచ్చక రాజీనామా చేశారు. తన నియోజక వర్గం తరుపున తను వెళ్లాలని నిశ్చయించుకుని పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంతకీ తను కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం నచ్చక రాజీనామా చేశారా లేక పార్టీ మారే యోచనలో రాజీనామా చేశారా అన్నది సందేహం.