కేసీఆర్ ను అందుకే పిలిచా.. చంద్రబాబు


ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి సీఎం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అలా కేసీఆర్ ను స్వయంగా ఎందుకు పిలిచారు.. కేసీఆర్ కూడా మారు మాట్లాడకుండా శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని చెప్పడంతో చాలా మందికి చాలా సందేహాలే తలెత్తుతున్నాయి. అయితే స్వయంగా తానే ఎందుకు ఆహ్వానించాననే దానికి సమాధానం చెబుతూ చంద్రబాబు వివరణ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయినా.. రాష్ట్రం కలిసున్నా తెలుగు జాతి అంతా ఒకటే అని.. సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి అంత మాత్రన వాటినే పట్టుకొని కూర్చోకూడదు కదా అని అన్నారు. అంతేకాదు ఇరు రాష్ట్రాలు సామరస్యంగా ముందుకు వెళ్లాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు. ఎలాగూ రాష్ట్రం విడిపోయింది.. ఇప్పుడు గొడవలు పడుకుంటూ కూర్చుంటే రెండు రాష్ట్రాలకు వచ్చేది ఏం లేదు.. అందువల్ల అందరిని కలుపుకుంటూ పోవాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ను ఆహ్వానించడానికి వెళ్లాలని.. ఇద్దరం రాష్ట్రాల అభివృధ్ది గురించి చర్చించామని వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu