రఘువీరారెడ్డికి అస్వస్థత

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. విశాఖ జిల్లా పర్యటనలో వున్న ఆయన పెందుర్తి మండలం చిన్నముసిడివాడ శారదా పీఠానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో ఆయన అస్వస్థతకు గురై కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఆయన సుగర్ లెవల్స్ పెరిగిపోవడంతో స్పృహతప్పి పడిపోయారని తెలుస్తోంది. రఘువీరారెడ్డిని విశాఖ నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu