పాక్ ఆక్రమిత ప్రజల నిరసన.. పాకిస్థాన్ పైశాచికం...

 

పాక్ ఆక్రమిత  కాశ్మీర్ ప్రజలపై పాకిస్థాన్ తమ పైశాచికాన్ని చూపిస్తున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు తమకు స్వాతంత్రం కావాలని, తక్షణం పాకిస్థాన్ తమను వదిలిపెట్టాలని నిరసనలు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిపై పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతున్నట్టు, నిరసనకారులపై దారుణంగా ప్రవర్తిస్తూ, వారిని చిత్ర హింసలకు గురి చేస్తున్నట్టు వార్తలందుతున్నాయి. దొరికిన వారిని దొరికినట్టు కొడుతూ, వాళ్లను జైళ్లకు తరలిస్తూ, ఇబ్బందులు పెడుతున్నట్టు తెలుస్తోంది.