నోట్ల రద్దుపై మోడీ.. అక్కడ మాట్లాడనివ్వలేదు..ఇక్కడ మాట్లాడుతున్నా..

 

ప్రధాని నరేంద్ర మోడీ అహ్మాదాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన దీసాలో పాల ఉత్పత్తి సహకార కేంద్రంతో పాటు పాల సహకార కేంద్రాలను ప్రారంభించారు. అంతేకాదు ప‌లు ప్రాజెక్టులకు కూడా ఆయ‌న చేతుల మీదుగా ప్రారంభోత్స‌వం జ‌రిగింది. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశంపై ప్ర‌స్తావించారు. పార్ల‌మెంటులో పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని.. చర్చకు సిద్దంగా ఉన్నామని చెబుతున్నా చర్చను మాత్రం జరగనివ్వడం లేదు.. లోక్‌స‌భ‌లో త‌న‌కు ఈ అంశంపై మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని, కానీ తాను జ‌న్‌స‌భ‌లో ఈ రోజు మాట్లాడుతున్నాన‌ని చెప్పారు. అక్ర‌మ‌మార్గాల్లో డ‌బ్బు మార్చుకుంటున్న వారిని తాము వ‌దిలిపెట్ట‌బోమ‌ని..పెద్దనోట్ల రద్దు దేశంలోని పేదలకు ఎంతో లాభం చేకూర్చుతుంద‌ని.. సామాన్యుడిని విప‌క్షాలు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయని, నిజానిజాల‌ను చెప్పేందుకే జ‌నం ముందుకు వ‌చ్చానని..  న‌ల్ల‌ధ‌నాన్ని నిర్మూలించ‌డం కోస‌మే పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేశామ‌ని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu