TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాహుల్‌కి పిజ్జాకు బర్గర్ కు తేడా తెలియదు.. ముక్తార్

Published on: Mon May 25, 2015 3:04PM

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉల్లిపాయకు, పిజ్జాకు తేడా తెలియదంటూ కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నఖ్వీ మాట్లాడుతూ రాహుల్ గాంధీకీ ఉల్లిపాయకు, పిజ్జాకు, బర్గర్ కు తేడా తెలియదు కానీ రైతుల నాయకుడిగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో ఆయన ఏ మాత్రం విజయం సాధించలేరని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ తొలిసారి రాజకీయాలకంటే దేశాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది తమ ప్రభుత్వమని, మోడీ పాలన వలన ప్రపంచంలో దేశ ప్రతిష్ఠ పెరిగిందని కొనియాడారు. అసత్యాలతో ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారని, నిజనిజాలేంటో ప్రజలకు, మీడియాకు తెలియజేయాలని పార్టీ అధికారలను సూచించారు.