మూడో భార్య కోసం రెండో భార్య హత్య

రంగారెడ్డి జిల్లా పూడూరు మండలంలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన రెండో భార్యపై కిరోసిన్ పోసి నిప్పింటించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లా సోమన్‌గుర్తికి చెందిన ఉప్పరి శేఖర్ అనే వ్యక్తి మొదటి భార్య పేరు అంజమ్మ. వారికి నలుగురు సంతానం. కానీ శేఖర్ మొదటి భార్య అంజమ్మ, పెద్ద కూతురు ఆత్మహత్యకు పాల్పడటంతో శేఖర్ సునీత అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే శేఖర్ కు పరిగిలో మరో యువతితో పరిచయం ఏర్పడి మూడో పెళ్లి చేసుకొన్నాడు. ఈ నేపథ్యంలో శేఖర్ తన రెండో భార్య సునీత తన మూడో భార్యతో కాపురానికి అడ్డు వస్తుందనే అనుమానంతో తనపై కిరోసిన్ పోసి నిప్పింటించి కాల్చి చంపేశాడు. అయితే సునీత ఇంట్లోంచి దుర్వాసన వస్తుండటంతో గ్రామస్థులు వెళ్లి చూడగా సునీత మృతదేహం కనిపించింది. దీంతో విషయం తెలుసుకున్న సునీత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటపడింది.