బ్రిటన్ మీడియాపై మోడీ ఫైర్.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు..

 

ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాంబ్లే స్టేడియంలో ప్రసంగించిన మోడీ బ్రిటన్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న మోడీకి ఆ దేశ మీడియా బాగానే కవరేజ్ చేసింది.. వార్త పత్రికల్లో మోడీ గురించి పెద్ద ఎత్తునే ప్రస్తావించింది. అయితే ప్రస్తావించింది కానీ అది  మోడీ ప్రస్థానం.. ఆయన హయాంలో విమర్శకులు తరచూ ప్రస్తావించే వివాదాల్ని ప్రముఖంగా ప్రస్తావించటం కనిపించింది. దీంతో మోడీ తన ప్రసంగంలో బ్రిటన్ ప్రధాని కామెరన్ సమక్షంలోనే మీడియా మీద పంచ్ లు వేశారు. ఒక దేశాన్ని అంచనా వేసేందుకు వార్తా పత్రికలు.. టీవీ శీర్షికలు కొలమానం కాదంటూ.. వార్తా పత్రికల్లో కనిపించేదే భారత్ కాదని ఆయన ప్రసంగించిన 75 నిషాల్లో కొంచం సేపు మీడియాపై పంచ్ లు విసిరారు. ‘‘125 కోట్ల మందితో కూడిన భారత్.. టీవీ తెరల్ని మించిన స్థాయిలో పెద్దదీ.. మెరుగైనది’’ అంటూ మీడియా కథనాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు. మొత్తానికి మత అసహనంపై మన దేశంలోనే కాకుండా పొరుగుదేశంలో కూడా చర్చించుకోవడం ఆశ్చర్యం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu