Latest News
గొడవపడటం సబబుకాదు... కేసీఆర్
posted on: Mar 10, 2015 11:13AM

ప్రతి విషయానికీ గొడవపడటం సరికాదని, సభలో చర్చలు సజావుగా జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నేతలను కోరారు. అధికార పార్టీలు క్షమాపణ చెప్పాలని కోరుతూ... కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో కేసీఆర్ ఈ విధంగా స్పందించారు. ఇలా ఆందోళనలు చేసుకుంటూ పోతే సభలో చర్చలు ఎప్పుడు జరుగుతాయని, ప్రజలు తెలంగాణ శాసనసభలో చర్చలు బాగా జరగాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఏ విషయం మీదైనా... ఎంతసేపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.






