కాశ్మీర్లో ఆరని మంటలు..


కాశ్మీర్లో పరిస్థితి ఇప్పుడు ఇంకా ఆందోళనకరంగా తయారైంది. గత రెండు రోజుల నుండి జరుగుతున్న అల్లర్లు.. ఈరోజు తారాస్థాయికి చేరాయి. ఇప్పటి వరకు ఈ ఆందోళనల వల్ల 23 మంది మృతి చెందారు. మరో 250 మందికి పైగా గాయాల‌పాల‌య్యారు. పలు చోట్ల కర్ఫ్యూ విధించారు కూడా. అయితే ఆందోళనకారులు ఇంకా రెచ్చిపోతున్న నేపథ్యంలో కేంద్రం మరో 800 మంది సీఆర్పీఎఫ్ బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపింది. ఇప్పటికే 1200 మంది సహాయక సిబ్బందిని కశ్మీర్‌కు పంపగా.. అల్ల‌ర్లు రోజురోజుకీ పేట్రేగిపోతుండ‌డంతో కేంద్రం బలగాలను మరింత పెంచాలని నిర్ణ‌యం తీసుకొని 100 మంది సిబ్బంది చొప్పున ఎనిమిది బృందాల‌ను అక్క‌డి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పంపించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu