జయలలిత ఇంటిని పేల్చేస్తా..

 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంటినే పేల్చేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. పొయెస్‌ గార్డెన్‌ లోని జయలలిత ఇంటిని పేల్చేస్తామంటూ.. ఓ ఆంగతకుడు పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ కాల్ ఎవరు చేశారో అన్న విషయం తెలుసుకున్నారు.  ఈ ఫోన్‌ కాల్‌ విల్లుపురం జిల్లాలోని మరకణ్ణం ప్రాంతం నుంచి వచ్చిందని.. దీంతో ముఖ్యమంత్రి నివాసాన్ని పేల్చేస్తానని బెదిరించింది భువనేశ్వరన్ అనే 14 ఏళ్ల బాలుడని గుర్తించారు. దీంతో బాలుడిన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అయితే బాంబు బెదిరింపును మాత్రం తేలిగ్గా తీసుకోని అధికారులు పొయెస్ గార్డెన్ చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. బాలుడు సరదాగా కాల్ చేశాడా.. లేకా ఎవరన్నా చేయించారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu