భారత్ పై దాడికి పాకిస్తాన్‌ సిద్ధంగా ఉంది..

 

26/11 ముంబై దాడుల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా అధినేత హఫీజ్‌ సయీద్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ పై భారత్ పాకిస్తాన్‌పై భారత్‌ శత్రుత్వ ధోరణి కనబరిచి దూకుడుగా వ్యవహరించినా, తక్షణమే తిరిగి దాడి చేయడానికి పాకిస్తాన్‌ సిద్ధంగా ఉందని.. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్‌ భూభాగంనుంచి ఎలాంటి డ్రోన్‌ దాడి జరిగినా, మొత్తం భారత్‌ను తుడిచివేసేందుకు అవసరమైన డ్రోన్‌లు తమ వద్ద ఉన్నాయని సయీద్‌ హెచ్చరించాడు. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌ వ్యతిరేక ప్రణాళికలను అమలుపర్చడానికి అవసరమైన నియామకాలు చేపట్టాడు. సయీద్‌కు పాకిస్తాన్‌ ఆర్మీ, ఐఎస్‌ఐల ప్రోద్బలం ఉంది. మరి ఈ వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.