ఆధార్ కార్డ్ తో దొంగ మొగుడి గుట్టు రట్టు..

 

ఏదైనా ఫ్రూఫ్ కావాలంటే ఈమధ్య ఆధార్ కార్డ్ తప్పని సరైపోయింది. అయితే ఈ ఆధార్ కార్డ్ వల్లే ఓ దొంగ మొగుడి వ్యవహారం బయటపడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా, ములకలచెరువుకు చెందిన ఓ యువతి రేషన్ కోసం వెళ్లగా ఆమెకు ఐదు కిలోల బియ్యం తగ్గాయి. అయితే కార్డులో తన భర్త పేరు కనిపించకపోవడంతో.. పేరుంటేనే బియ్యం ఇస్తానని డీలర్ చెప్పాడు. దీంతో భర్త ఆధార్ నంబరును ఆన్ లైన్లో చూడగా అసలు నిజం తెలిసింది. అతను ఇంకో యువతి పేరిట ఉన్న రేషన్ కార్డులో నమోదైనట్టు తెలిసింది. ఒకే ఆధార్ సంఖ్య రెండు రేషన్ కార్డుల్లో ఉండకూడదు కాబట్టి మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. డబ్బు సంపాదన కోసం బెంగళూరు వెళ్తానని చెబుతూ, రెండో పెళ్లి చేసుకున్నాడని ఆ యువతి బావురుమంది.