అరవై దాటితే సలహాలే ఇవ్వాలంటున్న జైరాం

 

పొలిటికల్ లీడర్స్ రిటైర్మైంట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, 70ఏళ్ల తర్వాత ఎంత గొప్ప నాయకులైనా రాజకీయాల నుంచి రిటైర్ కావాలని, 60 ఏళ్లు దాటితే సలహాలకే పరిమితం కావాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఈ మేరకు మార్పులు జరుగుతున్నాయన్న జైరాం... కొత్త టీమ్ ను ఎంచుకోవడంతో రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ న్యూ టీమ్ ఎంపిక పూర్తికాగానే ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశముందని, వచ్చే మార్చినాటికి ఈ ప్రక్రియ పూర్తికావొచ్చని అన్నారు. రాహుల్ టీమ్ లో యువకులకు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరముందని, 30 నుంచి 40 ఏళ్ల వయసులోపు వారికే చోటివ్వాలని ఆయన సూచించారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu