వరంగల్, నారాయణఖేడ్ టీఆర్ఎస్ అభ్యర్ధులు వీళ్లే
posted on Oct 19, 2015 4:32PM

వరంగల్ పార్లమెంట్, నారాయణఖేడ్ అసెంబ్లీ బైపోల్ అభ్యర్ధులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరంగల్ ను తిరిగి నిలబెట్టుకోవడంతోపాటు నారాయణఖేడ్ ను తమ ఖాతాలో వేసుకోవాలనుకుంటున్న అధికార పార్టీ... ఆ మేరకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా తిరుగుతూ డెవలప్ మెంట్ కార్యక్రమాలను చేపడుతున్న అధికార పార్టీ నేతలు... ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు, అయితే వరంగల్, నారాయణఖేడ్ అభ్యర్ధులను కేసీఆర్ దాదాపు ఖరారు చేశారని, నారాయణఖేడ్ లో పోటీచేసి ఓడిపోయిన భూపాల్ రెడ్డికే తిరిగి టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భూపాల్ రెడ్డిపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్పటికీ... ఇటీవల కొత్తగా పార్టీలో చేరినవారికి టికెట్ ఇవ్వరాదని పార్టీ డిసైడైందని అంటున్నారు. అలాగే వరంగల్ పార్లమెంట్ స్థానానికి రవికుమార్, దయాకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని, అయితే రవికుమార్, దయాకర్ లలో ఎవరో ఒకరిని ఫైనల్ చేయవచ్చని అంటున్నారు.