తెలుగుదేశంలో ముదురుతున్న కుమ్ములాటలు

అనంతపురం తెలుగుదేశంపార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. టిడిపి అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్ బలమైన అభ్యర్థి అయినా విజయం సాధించలేకపోవటానికి కొందరు కలిసిరాలేదని ఆగ్రహించిన కార్యకర్తలు అంతర్గత విభేదాలకు తెరలేపారు. ప్రచారంలో సహకరించని తెలుగుదేశం నేతల జాబితా రూపొందించి మరీ దాడుఅలకు ప్రణాలికలు వేస్తున్నారు. దీనికి కూడా ఉదాహరణ తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యదర్శి రాయల్ మురళీపై దాడి. ఆయన ప్రచారంలో సరిగ్గా పాల్గోనకపోవటం వల్ల ఓట్లు తగ్గాయని ఆ పార్టీలోని కొందరు ఆగ్రహించారు. ఆ కోపంలోనే రాయల్ మురళీ ఇంట్లో జీపుపై రాళ్ళు విసిరారు. జీపు అద్దాలు కూడా పగిలాయి. ఇంట్లో కూడా రాళ్ళు పడ్డాయి. దీంతో మురళీ భార్య రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాను డబ్బు ఆశిచాకుండా పనిచేసినందుకే ఇటువంటి ప్రతిఫలం లభించిందని రాయల్ మురళీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎ.నారాయణపురం నాయకులే ఈ పనిచేసి ఉంటారని ఆయన అనుమానిస్తున్నారు. బెట్టింగుల్లో నష్టం తట్టుకోలేక ఈ దాడులకు దిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu