ఓట్లు పెరిగినా ఓటమి తప్పలేదా?

2012 ఉపఎన్నికల చిత్రంలో ఇదీ ఒక విచిత్రమే అనుకోవాలి. ఒక పార్టీకి ఓట్లు పెరిగినా ఓటమి తప్పలేదు. ఈ పార్టీ పదిస్థానాల్లో వై,ఎస్,ఆర్, కాంగ్రెస్ పార్టీ తో హోరా హోరీగా పోరాడిందే. ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది అదే తెలుగుదేశం గురించేనని. ఎగ్జాట్లీ ... మీరు ఊహించింది నిజమే. తెలుగుదేశంపార్టీ తన క్యాడర్ ను పెంచుకునేందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకుందన్నది జగమెరిగిన సత్యం. దీనికి అనంతపురం నియోజకవర్గంలో పరిస్థితే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బతీసిన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ ఓట్లు పెరిగాయి. 2009 ఎన్నికల్లో తెలుగుదేశానికి 32వేల ఓట్లు పోలయ్యాయి.

 

2012 ఉపఎన్నికల్లో ఇదే పార్టీకి 40వేల చిల్లర ఓట్లు పోలయ్యాయి అంటే సుమారు 9వేల ఓట్లు ఈ పార్టీకి పెరిగినా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని గెలుపొందింది. రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ నుంచి దేశంలోనే అత్యంత ధనికుడు దీపక్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్ తగ్గింది. అందుకే ఓటింగ్ తగ్గిందని పరిశీలకులు వెల్లడి చేస్తున్నారు. 2009లో తెలుగుదేశం అభ్యర్థి గోవిందరెడ్డికి 62,000ఓట్లు వచ్చాయి. 2012లో దీపక్ రెడ్డికి 40,000ఓట్లు పోలయ్యాయి. అంటే 20వేల ఓట్లు తగ్గాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu