చనిపోయిన టెక్కీ.. సిపిఎం నేత మేనల్లుడు.. డబ్బుల కోసమే..

 

హైదరాబాద్ నగరం లింగంపల్లిలో హష్మీ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే హష్మీని హత్య చేసింది.. స్నేహితుడు నరేష్ కుమార్ రెడ్డి అనే విషయం పోలీసులు తెలిపారు. అంతేకాదు.. హష్మీ.. సిపిఎం ఎపి శాఖ కార్యదర్శి మధు మేనల్లుడు అనే విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హష్మీ గత వారం రోజుల క్రితమే టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా జాయిన్ అయ్యాడు. అయితే హష్మీ స్నేహితుడైన నరేష్ కుమార్ రెడ్డి అతనిని పదివేలు కావాలని అడిగాడు. హష్మీ తన వద్ద లేవని చెప్పడంతో.. అతని వద్ద ఉన్న డబ్బును లాక్కునేందుకు ప్రయత్నించగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నరేష్ కుమార్ రెడ్డి బండరాయితో హష్మీని కొట్టి చంపేసి.. తన వద్ద ఉన్న డబ్బు, బంగారం, సెల్ ఫోన్ తీసుకొని వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు వచ్చి.. మోటరు బైక్ ఇవ్వడానికి వచ్చానని హష్మీ తల్లిదండ్రులతో కట్టు కథ అల్లినట్టు పోలీసులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu