Latest News

హైదరాబాద్ మెట్రోకి టీఆర్ఎస్ గ్రహణం పట్టింది.. రేవంత్ రెడ్డి

posted on: Sep 17, 2014 11:47AM

 

ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్‌ మెట్రో రైలుకు టీఆర్ఎస్ గ్రహణం పట్టిందని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. మెట్రో రైలు పనులకు తెలంగాణ ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తూ పెద్ద అడ్డంకిగా మారిందని ఆయన అన్నారు. మెట్రో రైలు అలైన్‌మెంట్ మార్చాలని కేసీఆర్ ఎల్ అండ్ టీ సంస్థ మీద తీవ్ర ఒత్తిడి తెచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేసీఆర్ ఒత్తిడి భరించలేకే ఎల్ అండ్ టీ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటానంటూ లేఖ రాసిందని అన్నారు. ఈ వివాదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని  ఆయన సూచించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...