కడప పేరు వింటేనే భయపడేలా చేశారు: చంద్రబాబు
posted on Dec 31, 2013 2:39PM
వైఎస్ హయంలో కడప అనే పేరు వింటేనే భయపడేలా చేశారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కబ్జా చేశారన్న కారణంగా జూబ్లీహిల్స్లో అధికారులు కూల్చివేసిన ఇంటిని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ విషయంలో కడప మేయర్ రవీంద్రనాధ్రెడ్డికి ఎదురొడ్డి నిలిచి కడవరకూ పోరాడి, గెలిచిన నీరజారావును ఈ సందర్భంగా ఆయన అభినందించారు. తన హయంలో ఎంతో కష్టపడి, బోర్డులు పెట్టి కాపాడిన భూములన్నీ తర్వాత వచ్చిన ప్రభుత్వం అక్రమార్కుల పాలు చేసిందన్నారు. వైఎస్ హయంలో హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వేల ఎకరాలు కబ్జా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాఫియాతో పోరాడడం అంటే మామూలు విషయం కాదని, ఈ విషయంలో నీరజారావు ధైర్యం ఎంతైనా ప్రశంసనీయమైనదని అన్నారాయన.