జగన్ కి దూళిపాళ్ళ సవాల్
posted on Jun 23, 2014 12:53PM
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ప్రస్తావిస్తున్నారంటూ వైకాపా అధినేత జగన్ అభ్యంతరం వ్యక్తం చేసిన దానిపై టిడిపి నేత దూళిపాళ్ళ స్పందిస్తూ... గత ప్రభుత్వం చేసిన అక్రమాలను బహిర్గతం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అక్రమ భూకేటాయింపులపై విచారణ జరపాల్సిందే అని ధూళిపాళ్ల స్పష్టం చేశారు. అవసరానికి మించి వైఎస్ ప్రభుత్వం భూములు ధారాదత్తం చేసిందని ఆరోపించారు. ఆనాటి ప్రభుత్వ అక్రమాల వల్ల ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లారన్నారు. తన ఆరోపణలు తప్పని నిరూపణ అయితే రాజీనామాకు సిద్ధమని ధూళ్లిపాళ్ల సవాల్ విసిరారు. అక్రమ భూకేటాయింపుల వల్ల ఎవరు లబ్ది పొందారో ఏ మీడియా సంస్థలోకి నిధులు మళ్లాయో విచారణ జరగాలన్నారు. బయ్యారం గనుల కేటాయింపులో అక్రమాలు, రక్షణ స్టీల్స్ వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలియాని ఆయన పేర్కొన్నారు. చట్టాలు సవరించైనా దోపిడీ సొమ్మును రికవరీ చేయాలని ధూళిపాళ్ల స్పష్టం చేశారు.