127 మంది రేప్

posted on: May 15, 2015 11:23AM

 

తూర్పు కాంగోలో ఆర్మీ వాళ్ళు అత్యాచారాలకు పాల్పడటం మామూలు విషయమైపోయింది. కొద్దిరోజుల క్రితం 60 మంది ఆర్మీ మిలిషియా సభ్యులు 127 మంది మహిళల మీద అత్యాచారం జరిపారు. అయితే అత్యాచారానికి గురైన మహిళలు ఈ విషయాన్ని బయటపెట్టడానికి జంకడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు కాంగోలోని దక్షిణ కీవ్ ప్రావెన్స్లో ఈనెల మొదటివారంలో ఈ ఘోరం జరిగింది. డాక్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ దారుణ ఘటనను శుక్రవారం నాడు ప్రపంచానికి వెల్లడించింది. ఆర్మీ చేతిలో అత్యాచారానికి గురైన మహిళలలో 14 నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు వున్నారు. ప్రస్తుతం వారందరికీ వారందరికి వైద్య సహాయం అందుతోంది. కాంగోతోపాటు దాదాపు 18 దేశాలలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...