నితీశ్ కు అభినందనలు తెలిపిన కేసీఆర్ ఫ్యామిలి



బీహార్ ఎన్నికల నేపథ్యంలో మహాకూటమి ఘన విజయం సాధించి.. బీజేపీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. నిజామాబాద్ ఎంపీ కవిత సైతం స్పందిస్తూ మహాకూటమి విజయం సాధించినందుకు అభినందనలు తెలియజేశారు. మంచి పాలన అందించినందుకే మరోమారు ప్రజలు నితీష్ కు పట్టం కట్టారని కేసీఆర్ అన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. లక్షకోట్ల ప్యాకేజీ ప్రకటించినా మోడీని బీహారీలు విశ్వసించలేదని.. బీహార్ లో నితీశ్ విజయం వెనుక స్థానిక అంశాలు కూడా ప్రభావం చూపాయని కేటీఆర్ విశ్లేషించారు. కవిత మాట్లాడుతూ.. ఎన్నికల కారణంగానే మోడీ బీహార్ కు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారని.. కానీ బీహార్ ప్రజలు మోడీని నమ్మలేదని.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ప్రధానమంత్రి హోదాలో  ప్రస్తుతం చేస్తున్న పనులకు  పొంతనలేదని ఆమె అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu