బీజేపీ ఓటమి.. మంత్రివర్గంలో మార్పు?
posted on Nov 9, 2015 2:48PM
.jpg)
బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో ప్రధాన మంత్రి ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన బీహార్ ఎన్నికల్లో ఇంతటి పరాభవం పొందిన మోడీ.. ఇది తన ప్రతిష్టకే భంగకరమని భావించినట్టు ఉన్నారు. అందుకే కేంద్ర మంత్రివర్గంలో మార్పు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బీహార్ ఎన్నికల్లో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారి మీద చర్యలు తీసుకోనున్నట్టు సమాచరం. బీహార్ ఎన్నికల సమయంలో మొత్తం ఐదుగురు మంత్రులు తమకు ఏమి పట్టనట్టు వ్యవహరించగా.. వారిలో మొదటి వరుసలో ఉన్నది మాత్రం.. ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ - వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ లు. వీరు దేశంలో నిత్యవసర ధరలు పెరుగుతున్నా.. కరువు పరిస్థితులు ఏర్పడుతున్నా ఏమాత్రం మోడీ దృష్టికి తీసుకురాకపోవడంతో వీరిపై మొదట చర్యలు తీసుకోకున్నారు. అంటే శాఖ నుండి తీసేయకపోయినా.. శాఖ మార్పిడి మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెపుతున్నారు. మొత్తానికి వెంటనే కాకపోయినా.. శీతాకాల సమావేశాల అనంతరం మంత్రివర్గంలో మార్పులు చేస్తారని అభిప్రాయపడుతున్నారు.