విభజనను ఆపండి

 

అసెంబ్లీ పార్లమెంట్‌ సమావేశాలకు గడువు దగ్గర పడుతుండటంతో సమైక్యాంద్ర కోరుకునే నాయకులు కూడా వేగం పెంచారు. ఇన్నాళ్లు రాజకీయనాయకులను విమర్శిస్తూ వచ్చిన ఏపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేఖించాలని రాజకీయపార్టీ నేతలను కోరారు.

శనివారం ప్రతిపక్షనేత చంద్రబాబును, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఫోరం చైర్మన్, మంత్రి శైలజానాధ్‌ను అశోక్‌బాబు కలుసుకున్నారు. అసెంబ్లీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే రాష్ట్ర విభజన జరగదని, ఏకాభిప్రాయం లేకుండా విభజన బిల్లును ఆమోదించబోమని కొన్ని జాతీయ పార్టీలు హామీ ఇచ్చాయని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు.