ఏపీ కోసం మోడీకి రాహుల్ స్పెషల్ లెటర్

 

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్రమోడీకి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు. రాష్ట్ర విభజన సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, ఆ మేరకు ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని రాహుల్ కోరారు, 2014 ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాలని, ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ పై కేంద్రం ప్రకటన చేయాలంటూ ప్రధాని నరేంద్రమోడీకి రాసిన లేఖలో రాహుల్ రిక్వెస్ట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది యూపీఏ ప్రభుత్వమేనని, దాన్ని సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని రాహుల్ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu