అమరావతి కోసం ఏసీ బస్సులను పంపిన రజనీ
posted on Oct 21, 2015 3:13PM

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న అతిరథ మహారథులకు దేశ విదేశీ ప్రముఖులు, వీవీఐపీలను వేదిక వద్దకు తరలించేందుకు ఎయిర్ పోర్ట్స్ నుంచి ఖరీదైన కార్లను ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రధాన వేదిక దగ్గరకు చేరుకునేందుకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా... విమానాశ్రయాల నుంచి ఏసీ బస్సులతోపాటు బెంజ్, రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ లాంటి అతి ఖరీదైన కార్లను సమకూర్చుతున్నారు, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే పలు ఏసీ బస్సులను ఏర్పాటు చేయగా, విజయవాడలోని పలువురు ప్రముఖులు... తమ విలువైన కార్లను వీవీఐపీల రవాణా కోసం స్వచ్ఛందంగా ఇస్తున్నారు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం రెండు ఏసీ బస్సులను పంపించినట్లు తెలిసింది.