ఉప్పల్ టెస్ట్: సెంచరీలు చేసిన విజయ్, పూజారా
posted on Mar 3, 2013 4:43PM
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్లో భారత ఆటగాళ్లు శతకాలు సాధించారు. చటేశ్వర్ పూజారా, భారత ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీలు సాధించారు. టెస్టుల్లో పూజారాకు ఇది నాలుగో శతకం. 188 బంతుల్లో పూజారా సెంచరీని సాధించాడు. భారత ఓపెనర్ మురళీ విజయ్ 243 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. ఈ శతకంలో 13 ఫోర్లు, 2 సిక్స్లు వున్నాయి. టెస్టుల్లో విజయ్కు ఇది రెండో శతకం. పుజారా, విజయ్లు చెలరేగి సెంచరీలు చేయడంతో భారత్ 311/1 పరుగులు చేసింది. సెహ్వాగ్ త్వరగా అవుటైనా విజయ్, పుజారాలు మైదానంలో సెంచరీల మోత మోగించారు. ఆసీస్ పైన రెండో వికెట్కు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 74 పరుగుల ఆధిక్యంలో ఉంది.