దాణా కేసులో లాలూ దోషి

 

Lalu Prasad Yadav convicted Fodder scam,  Lalu Prasad Yadav,  Fodder scam, CBI

 

 

దేశంలో సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ ను సిబిఐ దోషిగా తేల్చింది. లాలుప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి గా వున్న సమయంలో పశువుల దాణాకు సంబంధించి రూ.35.66కోట్లు కాజేశారనే అభియోగం పై సిబిఐ విచారణ చేపట్టింది. పదహారు ఏళ్ళ నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతుంది. లాలుతో పాటు మరో 45మందిని సిబిఐ కోర్ట్ దోషిగా తేల్చింది. కోర్టు తీర్పు కోసం లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన అనుచరులతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. లాలూను దోషిగా నిర్ధారించిన కోర్టు శిక్షను రేపు ఖరారు చేయనుంది.