విశాల్ చూస్తుండగానే భూషణ్ పై తిలోత్తమ దాడి!
on Aug 11, 2022
చందూ గౌడ, అషికా గోపాల్ జంటగా నటించిన సీరియల్ `త్రినయని`. గత కొన్ని వారాలుగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా సాగుతోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ ఆద్యంతం ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతూ ఆకట్టుకుంటోంది. పవిత్రా జయరామ్, నిహారిక హర్షు, ద్వారకేష్ నాయుడు, అనిల్ చౌదరి, ప్రియాంకా చౌదరి, విష్ణు ప్రియ, భావనా రెడ్డి, శ్రీసత్య, సురేష్ చంద్ర, జయలలిత, చల్లా చందు తదితరులు నటించారు. సూపర్ నేచురల్ డ్రామాగా రూపొందిన ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తికర మలుపులతో ఆకట్టుకుంటోంది.
గురువారం ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరగనుందన్నది ఒకసారి చూద్దాం. భూషణ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని బస్తీలోకి ఎంట్రీ ఇచ్చిన విశాల్ తనని వెతుకుతూ గల్లీ గల్లీ గాలిస్తుంటాడు. ఇదే సమయంలో భూషణ్ తమకే కనిపించాలని తిలోత్తమ, కసి, వల్లభ మారు వేషాల్లో వెతుకడం మొదలు పెడతారు. ఇదే సమయంలో నయని కూడా బస్తీలోకి ప్రవేశిస్తుంది. భూషణ్ విశాల్ కి కానీ, తిలోత్తమ బ్యాచ్ కి గానీ దొరక్కూడదని నయని వెతకడం మొదలు పెడుతుంది.
ఈ క్రమంలో భూషణ్ ని వెతుకుతున్నారని అతని భార్యకు తెలియడంతో అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తారు. అయితే ఓ పోల్ పక్కన కూర్చున్న భూషణ్ ..తిలోత్తమ కంటపడతాడు. వెతకబోయిన తీగ కాలికి తగిలిందని భావించిన తిలోత్తమ పక్కనే వున్న ఐరన్ రాడ్ తో భూషణ్ ని హత్య చేసే ప్రయత్నం చేస్తుంది. తిలోత్తమ ..భూషణ్ పై దాడి చేస్తున్న దృశ్యాలని విశాల్ కళ్లారా చూస్తాడు.. ఆ తరువాత ఏం జరిగింది? భూషణ్ ని తిలోత్తమ హత్య చేసిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.