ఫామిలీ సర్కస్ తో ఫుల్ ఎంటర్టైన్ చేసిన బుల్లి తెర స్టార్స్
on Oct 7, 2022
శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం స్పెషల్ గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ లేటెస్ట్ వీక్ ఎపిసోడ్ లో ఫామిలీ సర్కస్ అనే కాన్సెప్ట్ తో బుల్లితెర స్టార్స్ అంతా తమ పిల్లలతో స్టేజి మీదకు వచ్చి డాన్స్ పెర్ఫార్మెన్స్, స్కిట్స్ చేసి ఫుల్ ఖుష్ అయ్యారు. శిరీష తన కొడుకుతో కలిసి "చిన్ని తండ్రి నిను చూడగా" అనే సాంగ్ కి ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. తర్వాత తాగుబోతు రమేష్ తన కూతురుతో కలిసి "గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి" సాంగ్ కి డాన్స్ చేసాడు.
ఇక యాట నవీన తన ఇద్దరు కొడుకులతో కలిసి "నీవే నీవే" సాంగ్ కి కలిసి డాన్స్ చేశారు. ఇంకా ఆటో రాంప్రసాద్, నాటీ నరేష్, పంచ్ ప్రసాద్ ని పంచ్ డైలాగ్స్ చెప్పనివ్వకుండా పిల్లలంతా కలిసి స్టేజి మీద గోల గోల చేసేసారు. ఇంతలో రష్మీ వచ్చి "ఇంద్రజ గారు ఈ స్కిట్ ఎలా అనిపించింది" అని అడిగేసరికి శిరీష కొడుకు మధ్యలో వచ్చి రష్మీ దగ్గర బూర ఊదేసి వెళ్ళిపోయాడు. దాంతో ఇంద్రజ పడీ పడీ నవ్వేసింది. బిజీ బిజీగా ఉండే అమ్మానాన్నలు పిల్లలకు అన్నం పెట్టకుండా, సండే కూడా ఎంజాయిమెంట్ లేకుండా పనిలో ఎలా మునిగి తేలుతున్నారో అని చెప్తూ వేసిన స్కిట్ అందరినీ ఎమోషన్ కి గురి చేసింది.
Also Read