వైరల్ గా మారిన మెరీనా పోస్ట్!
on Nov 30, 2022
బిగ్ బాస్ హౌస్ లోకి 'మెరీనా-రోహిత్' ఇద్దరు జంటగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హౌస్ లోకి వచ్చాక కొన్ని రోజులు జంటగా ఆడగా, ఆ తర్వాత ఇద్దరిని సపరేట్ గా ఆడమన్నాడు బిగ్ బాస్. కాగా మెరీనా గతవారమే ఎలిమినేట్ అయి బయటికొచ్చేసింది. అలా బయటకొచ్చాక తన భర్తకి సపోర్ట్ చెయ్యండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తుంది మెరీనా.
ఒక పోస్ట్ లో మెరీనా "చివరి వారంలో రోహిత్ ని ఎక్కువగా చూపించలేదు. కావాలని తనని టార్గెట్ చేసారు. తను ఎక్కువగా ఓపెన్ గా మాట్లాడడు. అందుకే అందరూ అతడిని నామినేట్ చేసారు" అంటూ రాసుకొచ్చింది. ఇప్పుడు ఆమె రాసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
అయితే సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో అందరూ కూడా రోహిత్ ని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. "ఎక్కువ ఏ విషయాన్ని ఓపెన్ గా చెప్పడు తను.. అందుకే నామినేట్ చేసారు. అలా చేసినందుకు తన లైఫ్ లో జరిగిన సంఘటనలను పోస్ట్ రూపంలో ప్రేక్షకులతో పంచుకుంది. "ఎప్పుడూ కూడా రోహిత్ ఏ విషయాన్ని అంత తొందరగా వ్యక్తం చేయడు. చాలా రిజర్వు గా ఉంటాడు. కానీ నామినేషన్ లో చాలా క్లారిటీగా తన మనసులో ఏం ఉందో, అది హౌస్ మేట్స్ అందరితో చెప్పాడు. అంతా కూడా స్పష్టంగా చెప్పాడు. చాలా రోజుల తరువాత తను అలా ఓపెన్ అవ్వడం చూసాను. 'ఐ యామ్ వెరీ హ్యాపీ.. ప్లీజ్ సపోర్ట్ హిమ్' అంటూ సోషల్ మీడియాలో మరొక పోస్ట్ చేసింది మెరీనా.
హౌస్ లో అన్ డిజర్వింగ్ కంటెస్టెంట్ గా ఉన్న రోహిత్, ఇప్పుడు టాప్ 5 లోనే కాకుండా రన్నర్ స్థానానికి వెళ్ళాడు. "Rohith is Genuine and Honest Player in this House" అంటూ రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ సపోర్ట్ ని తెలియజేస్తున్నారు. అయితే రోహిత్ రన్నరా? విన్నరా? అనే విషయం తెలియాలంటే ఇంకో రెండు వారాలు ఆగాల్సిందే మరి!
Also Read