రష్మీ.. ఇంత కిక్కిస్తుందని తెలీదు అన్న సుధాకర్!?
on Aug 9, 2022
రష్మీ పేరుకు తగ్గట్టే గ్లామర్ గా ఉంటుంది. ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ ని హ్యాండిల్ చేస్తోంది. ఎప్పుడూ సరదాగా ఉండే రష్మీ సునామి సుధాకర్ మీద మండిపడి ఘాటుగా ఒక కామెంట్ కూడా చేసేసింది. ఇప్పుడు ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. ఇందులో సునామి సుధాకర్ సునామీ సుధాకర్ రష్మీ అందాన్ని పొగుడుదామనుకుని ట్రై చేస్తాడు.. అది విస్కీనా ? రమ్మా ?.. చూడగానే మత్తు వచ్చేస్తోంది అని అంటాడు. దానికి సుధాకర్ పక్కనే ఉన్న కమెడియన్ దగ్గరగా చూడు ఆ కిక్కు దిగిపోద్ది అంటూ రష్మీ వైపు సుధాకర్ ని నెట్టేస్తాడు.
సుధాకర్ వేసిన పంచ్ కి రష్మీ చాలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మీకు దింపుతాను అంటూ డబుల్ మీనింగ్ కౌంటర్ వేస్తుంది. ఇంతకుముందు స్కిట్స్ లో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ కూడా రష్మీపై ఎన్నో రకాల పంచ్లు వేసేవారు. రష్మీ వాటిని అంత సీరియస్ గా తీసుకునేది కాదు. కానీ ఇప్పుడు సుధాకర్ టీం మెంబర్ వేసిన చిన్న పంచ్ కి మాత్రం ఆమె ఫుల్ సీరియస్ ఐపోయింది. ఈ విషయాలు ఇలా జరుగుతుంటే జబర్దస్త్ నుంచి సింగర్ మనో కూడా తప్పుకున్నట్లే తెలుస్తోంది.. ఎందుకంటే ప్రతీ వారం ఒక కొత్త జడ్జి పలకరిస్తుంటే "ఈ వారం జడ్జి గా ఎవరు వస్తారో" అని ఎదురుచూడాల్సి వస్తోంది అంటున్నారు ఆడియన్స్. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ జడ్జిగా ప్రగతి ఆంటీ వచ్చి ఎంటర్టైన్ చేశారు.
ఇంద్రజ మాత్రం ప్రస్తుతానికి ప్రతి ఎపిసోడ్ లో కనిపిస్తున్నారు. అనసూయ ప్లేస్ లో కొత్త యాంకర్ అని అనుకున్న అందరికీ కూడా మళ్ళీ రష్మినేనా అనే ఫీలింగ్ ఇంతే ఉంది. ఐతే ప్రస్తుతానికి షో ఆగకుండా రష్మీ తో కంటిన్యూ చేయిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కొత్త యాంకర్ వస్తే రష్మిని రీప్లేస్ చేసే అవకాశం కూడా లేకపోలేదు.