ఆ గొర్రెల మంద నన్ను కూడా టార్గెట్ చేసింది!
on Aug 16, 2022
'జబర్దస్త్'కి అనసూయ ఎంత గ్లామర్ ని పంచిందో అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఇటీవల ఆమె ఈ షో నుంచి పక్కకు తప్పుకుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ కూడా వచ్చాయి. ఐతే ఒక ఇంటర్వ్యూలో వీటికి సమాధానం చెప్పింది అనసూయ. వరుసగా మూవీ ఆఫర్స్ వస్తూండేసరికి తప్పక షో నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పింది. అలాగే తనకు ఆఫర్స్ వచ్చినప్పుడల్లా డేట్స్ అడ్జస్ట్ చేయమని ప్రతీసారి అడగలేను కదా.. చాలా గిల్టీగా అనిపిస్తోంది.
అలాగే అందరూ కూడా తన వల్ల ఇబ్బందులు పడడం తనకు అస్సలు ఇష్టం లేదని చెప్పి ఎమోషన్ అయ్యింది అనసూయ. ఈ కార్యక్రమం ఎప్పుడూ బోరింగ్ గా అనిపించలేదు కానీ కొంతకాలం నుంచి ఈ ప్లేస్ తనది కాదు అని అనిపించే సంఘటనలు జరుగుతుండేసరికి తనకు ఈ షో చేయకుండా కొంత టైం గ్యాప్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. "గ్లామర్ ఫీల్డ్ అంటేనే అంత. ఎన్నో కామెంట్స్ వస్తాయి. వాటిని భరించక తప్పదు. వెళ్లిపోయిన వాళ్ళ వెంట మిగతా వాళ్ళు వెళ్లిపోవడానికి ఎవరూ కూడా గొర్రెల మంద అసలే కాదు" అంటూ మనసులో మాట ఈ ఇంటర్వ్యూలో చెప్పింది అనసూయ.
బాడీ షేమింగ్ కి సంబంధించి ఎప్పుడూ నేను వ్యతిరేకమే. అలాంటి సీన్స్ ని నేను అస్సలు ఎంటర్టైన్ చేయను. అలాంటి టైంలో నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని చూపించరు. దీంతో ఆడియన్స్ కి తెర మీద ఏది చూపిస్తారో అదే ఆ మనిషి వ్యక్తిత్వం అని అనుకుంటారు. అలాగే నన్ను ఒక గొర్రెల మంద ఎటాక్ చేసింది. ఎందుకంటే నన్ను కూడా ఆ మందలో చేర్చడం కోసం. అని ఆమె తెలిపింది. కానీ తాను ఆ ఇష్యూస్ అన్నిటి నుంచి కూడా బయటపడినట్లు చెప్పిందామె.
"జబర్దస్త్ లో తీసుకున్న జీతానికి సరిపడా పని చేసాను. నాకు టీఆర్పీ విషయాలు కూడా తెలియవు. నేను ఎలా పెర్ఫామ్ చేయాలి అనుకున్నానో అలాగే చేసాను. ఎప్పుడూ ఎవరితో కూడా తప్పు చేశాననే మాటను అసలు అనిపించుకోలేదు." అని చెప్పింది అనసూయ.
Also Read